Political News

బస్సు దెబ్బ మెట్రో మీద పడిందా ?

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం ప్రభావం మెట్రో ట్రైన్ మీద బాగానే పడినట్లుంది. రోజువారి ప్రయాణించే వారి సంఖ్య బాగానే తగ్గిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నివేల బస్సులున్నా రద్దీని తట్టుకోలేకపోతున్నాయి. ఎన్ని బస్సులున్నా ప్రయాణీకులకు సరిపోవటంలేదు. అందుకనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బాగా ఆలోచించి మెట్రో రైలు ప్రాజెక్టును ఓకే చేశారు.

అయితే ప్రాజెక్టుకు డీపీఆర్ తయారై తొందరలోనే ప్రాజెక్టు పనులు ప్రారంభం అవబోతున్నది అనుకునే సమయంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తర్వాత కాల ప్రభావం వల్ల కేసీయార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పనులు ప్రారంభమై ప్రాజెక్టు పట్టాలకెక్కింది. ఎప్పుడైతే మెట్రో ప్రాజెక్టు మొదలైందో అప్పటినుండి బస్సుల మీద కాస్త ఒత్తిడి తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే మెట్రోలో ప్రతిరోజు సగటున 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ప్రశాంతంగా ప్రయాణించటమే కాకుండా బస్సులో కన్నా చాలా స్పీడుగా గమ్యస్ధానాలకు చేరుకోవటం వల్లే మెట్రోకు ఆదరణ పెరిగింది.

అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. ఎప్పుడైతే మహిళలకు బస్సు ప్రయాణం ఉచితమని ప్రభుత్వం ప్రకటించిందో వెంటనే ఆడవాళ్ళు మెట్రో ప్రయాణం నుండి బస్సులవైపు మళ్ళారు. ఇంతకుముందు ప్రతిరోజు బస్సుల్లో సుమారు 10 లక్షలమంది ప్రయాణించేవారట. అలాంటిది ఇపుడు మహాలక్ష్మీ పథకం పుణ్యమాని బస్సులు ఎక్కేవాళ్ళ సంఖ్య ఒక్కసారిగా 5 లక్షలకు పెరిగి ప్రయాణీకుల సంఖ్య 15 లక్షలకు చేరుకుందట.

ఐదు రోజుల క్రితంవరకు మెట్రోలో రోజుకు సగటున 5 లక్షలమంది ప్రయాణం చేసేవారట. అలాంటిది గడచిన నాలుగు రోజులుగా 50 వేలమంది ప్రయాణీకులు తగ్గిపోయినట్లు లెక్కలు కట్టారు. మెట్రో, బస్సులే కాకుండ ఆటోల్లో కూడా రోజు కొన్ని లక్షలమంది ప్రయాణం చేసేవారు. అలాంటిది ఇపుడు ఉచిత బస్సుల్లో ప్రయాణం చేసేందుకే మహిళలు మొగ్గుచూపుతున్నారట. దాంతో మెట్రోతో పాటు ఆటోలో ప్రయాణాలు కూడా బాగా తగ్గిపోయాయని సమాచారం. ఏదేమైనా ఉచిత ప్రయాణం దెబ్బ మెట్రోపై బాగానే పడింది. మరో వారంపోతే కానీ మెట్రో పరిస్ధితి ఏమిటో స్పష్టంగా తెలీదు.

This post was last modified on December 12, 2023 11:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

53 minutes ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

3 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

7 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

8 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

8 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

8 hours ago