బీఆర్ఎస్ పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన ఎంఎల్ఏల్లో జీవన్ రెడ్డి కూడా ఒకరు. నిజామాబాద్ అసెంబ్లీ నుండి రెడ్డి పదేళ్ళు ఎంఎల్ఏగా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో కేసీయార్ ఎందుకనో జీవన్ రెడ్దిని దూరంపెట్టారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగానే కొందరి బండారం బయటపడుతోంది. ఇందులో ముఖ్యంగా జీవన్ రెడ్డి వ్యవహారమంతా ఒక్కోటిగా వెలుగుచూస్తోంది. తాజాగా ఫైనాన్స్ కార్పొరేషన్ లో అప్పు తీసుకుని ఎగ్గొట్టిన విషయం బయటపడింది.
ఇప్పటికే ఆర్టీసీ బస్టాండ్ లో మాల్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోవటం, కరెంటు బిల్లులు ఎగ్గొట్టడం లాంటి ఘటనలపై ప్రభుత్వం రెండు నోటీసులు ఇచ్చింది. వాటికి అదనంగా ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పు ఎగ్గొట్టిన విషయం బయటపడింది. ఇంతకీ విషయం ఏమిటంటే తన బార్య పేరుతో జీవన్ రెడ్డి 2017లో ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర రు. 20 కోట్లు అప్పు తీసుకున్నారు. అప్పటినుండి ఇప్పటివరకు అసలు కానీ వడ్డీ కాని మాజీ ఎంఎల్ఏ కట్టలేదు. అసలుతో పాటు వడ్డీ కట్టాలని ఎన్నిసార్లు అధికారులు నోటీసులిచ్చినా లెక్కచేయలేదు.
అధికారంలో ఉన్నాడు కాబట్టి అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారు. అయితే బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో వెంటనే అధికారులు కొరడా ఝుళిపిచంటం మొదలుపెట్టారు. చెల్లించాల్సిన అప్పులపై కార్పొరేషన్ తాజాగా జీవన్ కు నోటీసులు జారీచేసింది. గడువులోగా అప్పు చెల్లించకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందని నోటీసులో వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ అప్పు ఎందుకు తీసుకున్నారంటే ఆర్టీసీ బస్టాండులో మాల్ కట్టడానికి.
ప్రభుత్వాన్ని మ్యానేజ్ చేసుకున్న జీవన్ రెడ్డి ఆర్టీసీ స్ధలాన్ని లీజుకు తీసుకున్నారు. అందులో పెద్ద షాపింగ్ మాల్ కట్టారు. మాల్ కట్టి బిజినెస్ చేస్తున్నారు కానీ ప్రాపర్టీ ట్యాక్స్ అయితే కట్టడంలేదు. అలాగే వాడుతున్న కరెంటుకు కూడా జీవన్ రెడ్డి బిల్లులు చెల్లించలేదు. ఎన్నిసార్లు నోటీసులిచ్చినా ఎలాంటి ఉపయోగం కనబడలేదు. ప్రభుత్వం మారగానే అధికారులు ఒక్కసారిగా జీవన్ను నోటీసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ రు.10 కోట్లు చెల్లించాలి. అలాగే విద్యుత్ బిల్లులు రు. 2 కోట్లు కట్టాలి. బిల్లులు చెల్లించాలని నోటీసులు ఇచ్చిన విద్యుత్ శాఖ ముందు కరెంటును కట్ చేసేసింది. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోతే మాల్ ను సీజ్ చేస్తామని మున్సిపాలిటి నోటీసుల్లో చెప్పింది. దానిమీద తాజాగా ఫైనాన్స్ కార్పొరేషన్ రు. 20 కోట్లు చెల్లించాలని నోటీసిచ్చింది.
This post was last modified on December 12, 2023 11:07 am
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…