వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికలు అత్యంత వాడివేడిగా సాగనున్నాయి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మించి.. ఏపీలో రాజకీయాలు వేడెక్కుతాయని.. ఎన్నికలు సలసల మరుగుతాయని అంటు న్నారు. ఇదిలావుంటే.. అసలు క్షేత్రస్థాయిలో ప్రజలు ఈ సారి ఎవరిని ఎంచుకుంటారు? అనేది కీలక ప్రశ్నగా మారింది. పార్టీలను చూసి ఓటేస్తారా? లేక.. ఎమ్మెల్య అభ్యర్థులను చూసి ఓటేస్తారా? లేక పార్టీల అధినేతలను బట్టి ఓటెత్తుతారా? అనేది కీలక చర్చగా మారింది.
2014, 2019 ఎన్నికలను చూస్తే.. 2014లో చంద్రబాబు అనే ఒకే ఒక్క నాయకుడిని చూసి ప్రజలు ఓటేశారు. దీంతో ఆ పార్టీ తరఫున బలమైన నాయకులు.. బలహీన నాయకులు కూడా.. గెలుపు గుర్రం ఎక్కారు. ఇక, అదే సమయంలో వైసీపీ లోనూ 67 మంది గెలిచినా.. చంద్రబాబు వైపే జనం నిలిచారు. సో.. దీనిని బట్టి.. అప్పట్లో విజన్ ఉన్న నాయకుడి వైపు జనం మొగ్గారు. ఈ క్రమంలో పార్టీలను పక్కన పెట్టారు.
ఇక, 2019 ఎన్నికల విషయానికి వస్తే.. రెండు విషయాలు ప్రధానంగా పనిచేశాయి. ఒకటి.. నాయకుడు. రెండు.. క్షేత్రస్థాయి అభ్యర్థులు. క్షేత్రస్థాయిలో అభ్యర్థులపై వున్న వ్యతిరేకత కారణంగా అప్పట్లో టీడీపీకి వ్యతిరేకంగ జనాలు ఓటేశారు. ఇక, వైసీపీ నాయకుడిగా.. యువ నేతగా.. ఒక్క ఛాన్స్ అన్న జగన్ వైపు ప్రజలు మొగ్గారు. దీంతో టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది.
ఇక, ఇప్పటి పరిస్థితి ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. ఇక్కడ నాయకులు, పార్టీలు కాకుండా. మరోసారి విజన్ వైపే జనాలు అడుగులు వేసే పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. నిజానికి క్షేత్రస్థాయిలో ఇటు టీడీపీ, అటు వైసీపీకి కొన్నికొన్ని నియోజకవర్గాలు తప్ప.. మెజారిటీ నియోకవర్గాల్లో బలమైన అభ్యర్థులులేరు. వారిని చూసి ఓటేసే పరిస్థితి కూడా లేదు.
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ NBK 111 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
వరస డిజాస్టర్లతో మార్కెట్ నే రిస్కులో పెట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. ఆగస్ట్…
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…