Political News

యువగళం@3000 కి.మీ..చారిత్రక ఘట్టం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా 3 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. నేడు పాదయాత్ర 219వ రోజు సందర్భంగా చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ సందర్భంగా తేటగుంట యనమల అతిథి గృహం వద్ద లోకేష్ పైలాన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్, నందమూరి మోక్షజ్ఞ, లోకేష్ తోడల్లుడు భరత్ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకను వీక్షించేందుకు వేలాది మంది టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దీంతో, తేటగుంట సమీపంలో జాతీయ రహదారి కోలాహలంగా మారింది.

ఈ సందర్భంగా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా ప్రజలే సైన్యంగా యువగళం 3 వేల కిలోమీటర్ల మైలురాయికి చేరిందన్నారు. ఈ మజిలీకి గుర్తుగా తుని నియోజకవర్గం తేటగుంట పంచాయతీలో అన్నా క్యాంటీన్లను మళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించానని లోకేష్ అన్నారు.

ఇక, అనంతపురం జిల్లా అహోబిళంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేశ్ సీపీఎస్ రద్దు.. ఓపీఎస్ అమలు కోసం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనపై కూడా లోకేశ్ స్పందించారు. జగన్ మాయమాటలు, హామీలతో మోసపోయిన కర్షక, కార్మిక, ఉద్యోగులంతా ఏకం కావాలని, వారికి టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు. జగన్ అరాచ‌క పాల‌న‌లో అక్ష‌రాలు నేర్పే గురువులు ఆత్మ‌హ‌త్యాయత్నం చేయ‌డం దారుణమన్నారు. వారం రోజుల్లో సీపీఎస్ ర‌ద్దు చేస్తామ‌ని ఇచ్చిన హామీని గద్దెనెక్కి 200 వారాలు దాటినా జగన్ అమలు చేయలేదని మండిపడ్డారు. జీపీఎస్ అంటూ జగన్ మ‌రో వంచ‌న‌కి తెర‌లేపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం చేసిన వారు బాగున్నారని, మోసపోయినవాళ్లు ఆత్మహత్యాయత్నం చేయకూడదని పిలుపునిచ్చారు.

This post was last modified on December 11, 2023 10:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఖైదీ 2 ఇక ఎప్పటికీ రాదేమో

దర్శకుడు లోకేష్ కనగరాజ్ టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమాగా ఖైదీ స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. అంతకు ముందు…

3 hours ago

అఖండ తాండవానికి అదొక్కటే సమస్య

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18…

5 hours ago

రెహమాన్ మీదే ‘పెద్ది’ బరువు

ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…

5 hours ago

బోరుగడ్డతో వైసీపీకి సంబంధం లేదా?

బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి…

5 hours ago

‘మీ మతంలో జరిగినా అలాగే మాట్లాడతారా జగన్’

తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీవ్రంగా…

6 hours ago

ఆఖర్లోనూ సిక్సర్లు కొడుతున్న బాలీవుడ్

గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…

7 hours ago