టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా 3 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. నేడు పాదయాత్ర 219వ రోజు సందర్భంగా చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ సందర్భంగా తేటగుంట యనమల అతిథి గృహం వద్ద లోకేష్ పైలాన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్, నందమూరి మోక్షజ్ఞ, లోకేష్ తోడల్లుడు భరత్ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకను వీక్షించేందుకు వేలాది మంది టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దీంతో, తేటగుంట సమీపంలో జాతీయ రహదారి కోలాహలంగా మారింది.
ఈ సందర్భంగా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా ప్రజలే సైన్యంగా యువగళం 3 వేల కిలోమీటర్ల మైలురాయికి చేరిందన్నారు. ఈ మజిలీకి గుర్తుగా తుని నియోజకవర్గం తేటగుంట పంచాయతీలో అన్నా క్యాంటీన్లను మళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించానని లోకేష్ అన్నారు.
ఇక, అనంతపురం జిల్లా అహోబిళంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేశ్ సీపీఎస్ రద్దు.. ఓపీఎస్ అమలు కోసం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనపై కూడా లోకేశ్ స్పందించారు. జగన్ మాయమాటలు, హామీలతో మోసపోయిన కర్షక, కార్మిక, ఉద్యోగులంతా ఏకం కావాలని, వారికి టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు. జగన్ అరాచక పాలనలో అక్షరాలు నేర్పే గురువులు ఆత్మహత్యాయత్నం చేయడం దారుణమన్నారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని గద్దెనెక్కి 200 వారాలు దాటినా జగన్ అమలు చేయలేదని మండిపడ్డారు. జీపీఎస్ అంటూ జగన్ మరో వంచనకి తెరలేపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం చేసిన వారు బాగున్నారని, మోసపోయినవాళ్లు ఆత్మహత్యాయత్నం చేయకూడదని పిలుపునిచ్చారు.
This post was last modified on December 11, 2023 10:27 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…