జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కన్వీనర్.. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అరెస్టయ్యారు. విశాఖ పట్నంలో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న వెంచర్కు ముందు భాగంలో ఉన్న రోడ్డును వాస్తు కారణాలతో మూసేయడంపై ఉద్యమిస్తున్న నేపథ్యంలో తాజాగా చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే నాదెండ్ల సహా.. అనేక మంది జనసేన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
ఏం జరిగింది?
ఎంపీ ఎంవీవీ నిర్మిస్తున్న వెంచర్ వద్ద.. రోడ్డును మూసేయడాన్ని వ్యతిరేకిస్తూ.. విశాఖ టైకూన్ కూడలి సమస్యపై నిరసన తెలిపేందుకు నాదెండ్ల మనోహర్ తన పార్టీ నేతలతో కలిసి బయలు దేరారు. ఈ విషయం ముందే తెలిసిన పోలీసులు ఆయన బస చేసిన హోటల్ వద్దనే అడ్డుకున్నారు. శాంతియుతంగా, ట్రాఫిక్ కు అడ్డు లేకుండా నిరసన తెలుపుతామని పోలీసులకు చెప్పినా వినలేదని జనసేన నాయకులు ఆరోపించారు.
ప్రజా సమస్యలను తీర్చాల్సిన ప్రభుత్వమే సమస్యలను సృష్టిస్తుంటే.. వాటి కోసం విపక్షాలు పోరాడాల్సి న విచిత్ర పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా అన్నారు. విశాఖపట్నం నగర వాసులకు ఎంతో అవసరమైన టైకూన్ జంక్షన్ ను మూసి వేసి, ప్రజలకు లేనిపోని సమస్యలు తెచ్చి పెట్టిన ప్రభుత్వం ఎవరి కోసం ఇంత నాటకం ఆడుతుందో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
“విశాఖ ఎంపీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకి వాస్తు దోషాలు ఉండటంతో టైకూన్ కూడలి మూసివేశారు. దీనిపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సోమవారం ఉదయం కూడలి వద్దకు బయలుదేరిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని నోవాటెల్ హోటల్ వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. ఆనంతరం అరెస్టు చేశారు.
ఉదయం 9 గంటలకే హోటల్ వద్దకు చేరుకొని కనీసం రూమ్ నుంచి బయటకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు” అని మనోహర్ వివరించారు.
This post was last modified on December 11, 2023 2:11 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…