Political News

నాదెండ్ల మ‌నోహ‌ర్ అరెస్టు.. ఎక్క‌డ‌? రీజ‌నేంటి?

జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌న్వీన‌ర్‌.. మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ అరెస్ట‌య్యారు. విశాఖ ప‌ట్నంలో వైసీపీ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తున్న వెంచ‌ర్‌కు ముందు భాగంలో ఉన్న రోడ్డును వాస్తు కార‌ణాల‌తో మూసేయ‌డంపై ఉద్య‌మిస్తున్న నేప‌థ్యంలో తాజాగా చేప‌ట్టిన నిర‌స‌న‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలోనే నాదెండ్ల స‌హా.. అనేక మంది జ‌న‌సేన నాయ‌కుల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ఏం జ‌రిగింది?

ఎంపీ ఎంవీవీ నిర్మిస్తున్న వెంచ‌ర్ వ‌ద్ద‌.. రోడ్డును మూసేయ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ.. విశాఖ టైకూన్ కూడలి సమస్యపై నిరసన తెలిపేందుకు నాదెండ్ల మనోహర్ త‌న పార్టీ నేత‌ల‌తో క‌లిసి బ‌య‌లు దేరారు. ఈ విష‌యం ముందే తెలిసిన పోలీసులు ఆయ‌న బ‌స చేసిన హోటల్ వద్దనే అడ్డుకున్నారు. శాంతియుతంగా, ట్రాఫిక్ కు అడ్డు లేకుండా నిరసన తెలుపుతామని పోలీసులకు చెప్పినా వినలేద‌ని జ‌న‌సేన నాయ‌కులు ఆరోపించారు.

ప్రజా సమస్యలను తీర్చాల్సిన ప్రభుత్వమే సమస్యలను సృష్టిస్తుంటే.. వాటి కోసం విపక్షాలు పోరాడాల్సి న విచిత్ర పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని నాదెండ్ల మనోహర్ ఈ సంద‌ర్భంగా అన్నారు. విశాఖపట్నం నగర వాసులకు ఎంతో అవసరమైన టైకూన్ జంక్షన్ ను మూసి వేసి, ప్రజలకు లేనిపోని సమస్యలు తెచ్చి పెట్టిన ప్రభుత్వం ఎవరి కోసం ఇంత నాటకం ఆడుతుందో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

“విశాఖ ఎంపీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకి వాస్తు దోషాలు ఉండటంతో టైకూన్ కూడలి మూసివేశారు. దీనిపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సోమవారం ఉదయం కూడలి వద్దకు బయలుదేరిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని నోవాటెల్ హోటల్ వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. ఆనంతరం అరెస్టు చేశారు.
ఉదయం 9 గంటలకే హోటల్ వద్దకు చేరుకొని కనీసం రూమ్ నుంచి బయటకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు” అని మ‌నోహ‌ర్ వివ‌రించారు.

This post was last modified on December 11, 2023 2:11 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

48 seconds ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

30 mins ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

43 mins ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

46 mins ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

1 hour ago

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

2 hours ago