ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎంట్రీ ఇవ్వబోతున్నారా ? ఇపుడిదే అంశం హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల ఏపీలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు. స్వయంగా ఏపీ పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజే ప్రకటించారు కాబట్టి షర్మిల ఎంట్రీ నిజమే అని అనుకోవాలి. అయితే షర్మిల ఏ హోదాలో అడుగుపెట్టబోతున్నారన్నదే అర్ధం కావటంలేదు.
పార్టీ పగ్గాలు అందుకుంటేనే షర్మిల స్వేచ్చగా రాష్ట్రంలో తిరగ్గలరు. ఇదే సమయంలో ప్రధాన ప్రత్యర్థి గా సోదరుడు జగన్మోహన్ రెడ్డే అవుతారు. టీడీపీ, జనసేనతో కాంగ్రెస్ చేతులు కలపడం దాదాపు జరిగే పనికాదు. అందుకని కాంగ్రెస్ వామపక్షాలతో జతకట్టి లేకపోతే ఒంటరిగానో పోటీచేయాల్సుంటుంది. టీడీపీ, జనసేన-కాంగ్రెస్-బీజేపీ-వామపక్షాలు విడివిడిగా పోటీచేస్తే వైసీపీకే ఎక్కువ లాభం జరిగే అవకాశం ఉంది. అయినా ఇప్పుడు బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్ కు ఓటుబ్యాంకంటు ఏమీలేదు. 2014లో జరిగిన రాష్ట్రవిభజన తర్వాత కాంగ్రెస్ నేలమట్టమైపోయింది.
భూస్ధాపితమైపోయిన కాంగ్రెస్ కు షర్మిల జవజీవాలు అందించగలరా అన్నది అనుమానమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చెప్పుకోదగ్గ నేతలంటు ఎవరు లేరు. పార్టీ భూస్ధాపితమైపోయి, గట్టి నేతలు లేని పార్టీకి జనాలు ఎందుకు ఓట్లేస్తారు ? ఇప్పటికే తెలంగాణాలో పార్టీ పెట్టి ఫెయిల్యూర్ లీడరని షర్మిల ముద్ర వేయించుకున్నారు. అలాంటిది ఏపీ కాంగ్రెస్ ను షర్మిల తట్టిలేపుతారని ఎవరు అనుకోవటం లేదు. మరెందుకు ఏపీ కాంగ్రెస్ ద్వారా షర్మిల ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ? ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి షర్మిలకు తెలీందేమీ కాదు.
మరి తెలిసి కూడా తెలంగాణాను వదిలేసి ఏపీని కార్యస్ధానంగా ఎందుకు మార్చుకుంటున్నట్లు ? తెలంగాణాలో ఎప్పటికైనా తాను చెల్లని కాసన్న విషయం షర్మిలకు అర్ధమైపోయిందా ? ఎంత అర్ధమైపోయినా ఏపీలో ఏమి చేయగలరు ? అన్నది కీలకమైన ప్రశ్న. వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులు, కాంగ్రెస్ పార్టీలోని ఒకప్పటి కీలక నేతల్లో చాలామంది ఇపుడు వైసీపీలో ఉన్నారు. వీళ్ళల్లో ఎవరూ షర్మిలతో కలిసి నడిచేందుకు ఇష్టపడరు. మరాలంటపుడు షర్మిల కాంగ్రెస్ లో చేరి ఏమి చేస్తారన్నదే అర్ధంకావటంలేదు.
This post was last modified on December 11, 2023 12:36 pm
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…