Political News

అన్ని జిల్లాల్లో ప్రజాదర్బార్

తొందరలోనే అన్ని జిల్లాల్లోను ప్రజాదర్బార్ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. మూడు రోజులుగా రేవంత్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతకుముందు పదేళ్ళు సీఎంగా ఉన్న కేసీయార్ ఒక్కరోజు కూడా ఇలా జనాల సమస్యలు విన్న పాపాన పోలేదు. నిజానికి ప్రజలతో ముఖ్యమంత్రి అని ప్రజలతో నేరుగా మాట్లాడటం మొదలుపెట్టింది చంద్రబాబు. అయితే ఆయన టీవీ ద్వారా ఫోన్లో మాట్లాడేవారు. ఇది సూపర్ హిట్టయ్యింది. తర్వాత వైఎస్సార్ దానిని ప్రజాదర్బార్ గా మార్చి నేరుగా కలిసే అవకాశం ఇచ్చారు. కాకపోేతే సీఎం దాకా రావడం ఒకింత ఇబ్బంది, వ్యయప్రయాసలతో కూడినది. అయినా జనానికి అది కూడా నచ్చింది. దాంతో ఆ కాన్సెప్ట్ కూడా హిట్టయ్యింది. అప్పట్లో సక్సెస్ అయిన కాన్సెప్టునే ఇపుడు సీఎం రేవంత్ పునరుద్ధరించారు.

అయితే ఇక్కడ చిన్న సమస్య వచ్చింది. అదేమిటంటే ముఖ్యమంత్రిని కలిసి సమస్యలు చెప్పుకోవటానికి జనాలు రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుండో రావటం అన్నది కష్టమైన పనే. అయినా వస్తున్నారంటే ఎంత అవసరమైతే వస్తున్నారన్నది అర్ధమవుతోంది. అందుకనే బాధితులకు వీలుగా ఉంటుందని ప్రతి జిల్లాల్లోను ప్రజాదర్బార్ నిర్వహిస్తే జిల్లాల నుండి బాధితులు హైదరాబాద్ కు రావాల్సిన అవసరం ఉండదని రేవంత్ ఆలోచించారు. అందుకనే మంత్రుల ఆధ్వర్యంలో ప్రతి జిలాలోను ప్రజాదర్బార్ నిర్వహిస్తే సరిపోతుందని అనుకున్నారు.

హైదరాబాద్ లో తాను ప్రారంబించిన ఈ కాన్సెప్టును తొందరలోనే జిల్లాల కేంద్రాల్లో మంత్రుల ఆధ్వర్యంలో ప్రారంభించాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. దానివల్ల జనాలు ఎక్కడెక్కడి నుండో హైదరాబాద్ కు రావటం తప్పుతుందన్నది ఆలోచన. మంత్రుల ఆధ్వర్యంలో కూడా ఈ కాన్సెప్ట్ సక్సెస్ అయితే దీన్ని తర్వాత నియోజకవర్గాలకు విస్తరించే ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కారమైపోతే బాధితులకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది ? అసలు సమస్యలే లేకుండా చర్యలు తీసుకోవటం ఏ ప్రభుత్వానికీ సాధ్యంకాదు. కాకపోతే ఎదురైన సమస్యలను ఎంత తొందరగా పరిష్కరిస్తున్నారు అన్నదానిపైన ప్రభుత్వ సామర్ధ్యం ఆధారపడుంది.

ముఖ్యమంత్రి క్యాంపు ఆపీసులో ప్రజాదర్బార్ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా సెల్ ను ఏర్పాటుచేసినట్లే జిల్లాలస్ధాయిలో కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక సెల్ ను ఏర్పాటుచేసే అవకాశాలున్నాయి. జిల్లాల స్ధాయిలో పరిష్కారం సాధ్యం కానివాటినే హైదరాబాద్ కు తెప్పించుకోవాలని రేవంత్ ఆలోచిస్తున్నారు. అయితే ఎదుయ్యే సమస్యల్లో జిల్లాలస్ధాయిలో పరిష్కారమైపోయేవే చాలా ఎక్కువగా ఉంటాయని అందరికీ తెలిసిందే. మరి ఈ కాన్సెప్ట్ చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

This post was last modified on December 11, 2023 11:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

24 minutes ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

2 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

6 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

8 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

8 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

8 hours ago