పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు సొంత కుటుంబం నుంచి ప్రతిపక్షాల కంటే ఎక్కువగా సెగ పెరిగింది. ఆయన రెండు వివాహాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. ప్రచారంలో తనకు సహకరించి.. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంతో కృషి చేసిన కార్యకర్తనే ఆయన రెండో వివాహం చేసుకున్నారు. అయితే.. ఆ తర్వాత నుంచి మొదటి వివాహానికి చెందిన భార్య, కుమార్తె,కుమారుడిని పట్టించుకోవడం మానేశారు.
ఇదిలావుంటే.. వివాహ సమయంలో అడ్డుపడని మొదటి భార్య, పిల్లలు.. ఇప్పుడు మాన్ రెండో సతీమణి గర్భం దాల్చగానే రోడ్డెక్కారు. కేవలం గంటల వ్యవధిలోనే మాన్ను ఇటు మొదటి భార్య కుమార్తె సిరత్ బెదిరించగా, తర్వాత ఆయన తొలి సతీమణి కూడా తీవ్రంగా హెచ్చరించారు. రెండో భార్యకు అబార్షన్ చేయించకపోతే.. మాన్ నగ్న వీడియోలను బయట పెడతానంటూ.. తొలి భార్య ప్రీత్ గ్రేవాల్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. “అతను ఆట మొదలు పెట్టాడు. ఇప్పుడు నేనేంటో చూపిస్తా.. చూస్తూనే ఉండండి” అని ప్రీతి పోస్టు చేయడం తీవ్ర సంచలనంగా మారింది.
ఎందుకిలా?
మాన్ సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. బాగా సంపాయించారనే అంటారు. అయితే.. తొలి వివాహం ద్వారా జన్మించిన పిల్లలను ఆయన పట్టించుకోకుండా.. కనీసం భార్య అనుమతి కూడా తీసుకోకుండానే రెండో వివాహం చేసుకున్నారనే ప్రచారం ఉంది. అయితే.. సిక్కు మతాచారం ప్రకారం..అసలు రెండో వివాహమే తప్పు. మరి అప్పట్లో ఎందుకో.. తొలి సంతానం, భార్య కూడా చూస్తూ ఉండిపోయారు. దీనికి రాజకీయ పరమైన ఒత్తిడులు ఉన్నాయని చెబుతున్నారు.
కానీ, ఇప్పుడు మాత్రం మాన్ తన ఆస్తిని రెండో భార్యకు ఇచ్చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే తొలి భార్య, పిల్లలు.. రోడ్డెక్కారనేది పంజాబ్లో జరుగుతున్న చర్చ. ఇదిలావుంటే, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పాగా వేయాలని చూస్తున్న బీజేపీ.. ఇప్పటికే మాన్పై నిరంతరం విమర్శలు గుప్పిస్తోంది. ఇలాంటి సమయంలో మాన్ మాజీ భార్య, పిల్లలు.. ఇలా రోడ్డున పడడం రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మాన్కు సంకటంగా మారిందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on December 11, 2023 8:52 am
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…