పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు సొంత కుటుంబం నుంచి ప్రతిపక్షాల కంటే ఎక్కువగా సెగ పెరిగింది. ఆయన రెండు వివాహాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. ప్రచారంలో తనకు సహకరించి.. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంతో కృషి చేసిన కార్యకర్తనే ఆయన రెండో వివాహం చేసుకున్నారు. అయితే.. ఆ తర్వాత నుంచి మొదటి వివాహానికి చెందిన భార్య, కుమార్తె,కుమారుడిని పట్టించుకోవడం మానేశారు.
ఇదిలావుంటే.. వివాహ సమయంలో అడ్డుపడని మొదటి భార్య, పిల్లలు.. ఇప్పుడు మాన్ రెండో సతీమణి గర్భం దాల్చగానే రోడ్డెక్కారు. కేవలం గంటల వ్యవధిలోనే మాన్ను ఇటు మొదటి భార్య కుమార్తె సిరత్ బెదిరించగా, తర్వాత ఆయన తొలి సతీమణి కూడా తీవ్రంగా హెచ్చరించారు. రెండో భార్యకు అబార్షన్ చేయించకపోతే.. మాన్ నగ్న వీడియోలను బయట పెడతానంటూ.. తొలి భార్య ప్రీత్ గ్రేవాల్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. “అతను ఆట మొదలు పెట్టాడు. ఇప్పుడు నేనేంటో చూపిస్తా.. చూస్తూనే ఉండండి” అని ప్రీతి పోస్టు చేయడం తీవ్ర సంచలనంగా మారింది.
ఎందుకిలా?
మాన్ సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. బాగా సంపాయించారనే అంటారు. అయితే.. తొలి వివాహం ద్వారా జన్మించిన పిల్లలను ఆయన పట్టించుకోకుండా.. కనీసం భార్య అనుమతి కూడా తీసుకోకుండానే రెండో వివాహం చేసుకున్నారనే ప్రచారం ఉంది. అయితే.. సిక్కు మతాచారం ప్రకారం..అసలు రెండో వివాహమే తప్పు. మరి అప్పట్లో ఎందుకో.. తొలి సంతానం, భార్య కూడా చూస్తూ ఉండిపోయారు. దీనికి రాజకీయ పరమైన ఒత్తిడులు ఉన్నాయని చెబుతున్నారు.
కానీ, ఇప్పుడు మాత్రం మాన్ తన ఆస్తిని రెండో భార్యకు ఇచ్చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే తొలి భార్య, పిల్లలు.. రోడ్డెక్కారనేది పంజాబ్లో జరుగుతున్న చర్చ. ఇదిలావుంటే, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పాగా వేయాలని చూస్తున్న బీజేపీ.. ఇప్పటికే మాన్పై నిరంతరం విమర్శలు గుప్పిస్తోంది. ఇలాంటి సమయంలో మాన్ మాజీ భార్య, పిల్లలు.. ఇలా రోడ్డున పడడం రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మాన్కు సంకటంగా మారిందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on December 11, 2023 8:52 am
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…