Political News

గులాబీ నేతల్లో రివ్యూల గుబులు?

రోజురోజుకు గులాబీ నేతల్లో గుబులు జరిగిపోతున్నట్లు ఉంది. కారణం ఏమిటంటే రేవంత్ రెడ్డి సమీక్షల తీరు చూస్తుంటే తొందరలోనే తాము కచ్చితంగా టార్గెట్ అవుతామని కొందరు గులాబీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోందట. గడచిన మూడు రోజులుగా రేవంత్ సమీక్షలు నిర్వహించిన శాఖల్లో విద్యుత్ శాఖ చాలా కీలకమైనది. అలాగే తొందరలోనే ధరణి పోర్టల్ పనితీరుపైన కూడా సమీక్ష జరపబోతున్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు బయటపడ్డాయి. అక్రమాలకు కారణమైన ముగ్గురిపైన ప్రభుత్వం  కేసులు పెట్టి విచారణ మొదలుపెట్టింది.

ఈ విచారణలో తెరవెనుక ఉండి ఉద్యోగులతో పోర్టల్లో అక్రమాలు చేయించిందనే విషయం ఈపాటికే బయటపడుటుందనటంలో సందేహం లేదు. అలాగే విద్యుత్ శాఖ రు. 85 వేల కోట్ల అప్పుల్లో మునిగి పోయిన విషయం ఉన్నతాధికారులు బయటపెట్టారు. ఉన్నతాధికారులు చెప్పిన అప్పులను విన్న తర్వాత రేవంత్, మంత్రులకు పెద్ద షాకే తగిలింది. వివిధ కారణాలతో హోం, మున్సిపల్ శాఖలను రేవంత్ తన దగ్గరే ఉంచుకున్నారు. మున్సిపాలిటి ప్రాంతాల్లో భారీ ఎత్తున భూములను గత ప్రభుత్వంలో కీలక నేతలు కబ్జాలు చేసినట్లు ఆరోపణలున్నాయి.

మున్సిపాలిటీ ప్రాంతాల్లో జరిగిన భూకబ్జాలు బయట పడాలన్నా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నా చాలా గట్టిగా ఉండాలి. కేసులు, విచారణంటే పోలీసు శాఖే కీలకపాత్ర పోషించాల్సుంటుంది. అందుకనే విద్యుత్, ఫైనాన్స్, ఇరిగేషన్, రెవిన్యు శాఖలను ఇతరులకు కేటాయించినా మున్సిపల్, హోంశాఖను మాత్రం రేవంత్ తన దగ్గరే అట్టిపెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖను కేటీయార్ చూసిన విషయం తెలిసిందే.

ఇపుడు చేసిన సమీక్షలకు తోడు తొందరలోనే అన్నీ శాఖలపైనా రేవంత్ సమీక్షించబోతున్నారు. సమీక్షలు కూడా లోతుగా జరిగితే కేసీయార్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలన్నీ బయటపడటం ఖాయం. అసలే రేవంత్-కేసీయార్ మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులాగున్న విషయం అందరికీ తెలిసిందే. కేసీయార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రేవంత్ ను ఎంత ఇబ్బంది పెట్టారో అందరు చూసిందే. కాబట్టి కేసీయార్ మీద కోపంతో ఇపుడు రేవంత్ తమపైన ఎక్కడ కఠిన చర్యలు తీసుకుంటారో అనే టెన్షన్ గులాబీ పార్టీ నేతల్లో పెరిగిపోతోందట. మరి రేవంత్ ఏమిచేస్తారో చూడాలి.  

This post was last modified on December 10, 2023 1:54 pm

Share

Recent Posts

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

14 minutes ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

3 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

3 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

4 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

5 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

5 hours ago