Political News

గులాబీ నేతల్లో రివ్యూల గుబులు?

రోజురోజుకు గులాబీ నేతల్లో గుబులు జరిగిపోతున్నట్లు ఉంది. కారణం ఏమిటంటే రేవంత్ రెడ్డి సమీక్షల తీరు చూస్తుంటే తొందరలోనే తాము కచ్చితంగా టార్గెట్ అవుతామని కొందరు గులాబీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోందట. గడచిన మూడు రోజులుగా రేవంత్ సమీక్షలు నిర్వహించిన శాఖల్లో విద్యుత్ శాఖ చాలా కీలకమైనది. అలాగే తొందరలోనే ధరణి పోర్టల్ పనితీరుపైన కూడా సమీక్ష జరపబోతున్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు బయటపడ్డాయి. అక్రమాలకు కారణమైన ముగ్గురిపైన ప్రభుత్వం  కేసులు పెట్టి విచారణ మొదలుపెట్టింది.

ఈ విచారణలో తెరవెనుక ఉండి ఉద్యోగులతో పోర్టల్లో అక్రమాలు చేయించిందనే విషయం ఈపాటికే బయటపడుటుందనటంలో సందేహం లేదు. అలాగే విద్యుత్ శాఖ రు. 85 వేల కోట్ల అప్పుల్లో మునిగి పోయిన విషయం ఉన్నతాధికారులు బయటపెట్టారు. ఉన్నతాధికారులు చెప్పిన అప్పులను విన్న తర్వాత రేవంత్, మంత్రులకు పెద్ద షాకే తగిలింది. వివిధ కారణాలతో హోం, మున్సిపల్ శాఖలను రేవంత్ తన దగ్గరే ఉంచుకున్నారు. మున్సిపాలిటి ప్రాంతాల్లో భారీ ఎత్తున భూములను గత ప్రభుత్వంలో కీలక నేతలు కబ్జాలు చేసినట్లు ఆరోపణలున్నాయి.

మున్సిపాలిటీ ప్రాంతాల్లో జరిగిన భూకబ్జాలు బయట పడాలన్నా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నా చాలా గట్టిగా ఉండాలి. కేసులు, విచారణంటే పోలీసు శాఖే కీలకపాత్ర పోషించాల్సుంటుంది. అందుకనే విద్యుత్, ఫైనాన్స్, ఇరిగేషన్, రెవిన్యు శాఖలను ఇతరులకు కేటాయించినా మున్సిపల్, హోంశాఖను మాత్రం రేవంత్ తన దగ్గరే అట్టిపెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖను కేటీయార్ చూసిన విషయం తెలిసిందే.

ఇపుడు చేసిన సమీక్షలకు తోడు తొందరలోనే అన్నీ శాఖలపైనా రేవంత్ సమీక్షించబోతున్నారు. సమీక్షలు కూడా లోతుగా జరిగితే కేసీయార్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలన్నీ బయటపడటం ఖాయం. అసలే రేవంత్-కేసీయార్ మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులాగున్న విషయం అందరికీ తెలిసిందే. కేసీయార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రేవంత్ ను ఎంత ఇబ్బంది పెట్టారో అందరు చూసిందే. కాబట్టి కేసీయార్ మీద కోపంతో ఇపుడు రేవంత్ తమపైన ఎక్కడ కఠిన చర్యలు తీసుకుంటారో అనే టెన్షన్ గులాబీ పార్టీ నేతల్లో పెరిగిపోతోందట. మరి రేవంత్ ఏమిచేస్తారో చూడాలి.  

This post was last modified on December 10, 2023 1:54 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

6 mins ago

అల్లు అర్జున్ వివాదం ఎక్కడి దాకా

ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…

2 hours ago

కృష్ణమ్మా….ఎంత పని చేశావమ్మా

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

3 hours ago

భువనగిరి : గెలిస్తే ఒక లెక్క .. ఓడితే మరో లెక్క !

శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…

4 hours ago

ఒక‌రు తీర్థ యాత్ర‌లు.. మ‌రొక‌రు విదేశీ యాత్ర‌లు!

ఏపీలో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఒక‌వైపు తీవ్రమైన హింస చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్ర‌తిపక్ష నాయ‌కులు…

5 hours ago

పోలీసులు ఏంచేస్తున్నారు.. చంద్ర‌బాబు ఆవేద‌న‌

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, తాడిప‌త్రి ప్రాంతాల్లో చెల‌రేగిన హింస‌పై చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం…

5 hours ago