తెలంగాణలో కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీ రావడంతోనే మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెచ్చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు వయసుతో నిమిత్తం లేకుండా.. అందరికీ ఉచిత ప్రయాణం చేరువైంది. ఇది ఒకరకంగా.. అసలే కష్టాల్లో ఉన్న ఆర్టీసికి పెను భారమే అయినా.. ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్కు మాత్రం మైలేజీని పెంచేసింది.
ఇక, కాంగ్రెస్ తీసుకువచ్చిన ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు ఫ్రీ రవాణా సదుపాయం అందుబాటు లోకి వచ్చింది. దీంతో సొంత వాహనాలను(స్కూటీ తదితర) పక్కన పెట్టేసి మరీ ఉద్యోగినులు కూడా.. బస్సులను ఆశ్రయించారు. మరోవైపు.. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగినులు కూడా ఉచిత రవాణాను వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7200 బస్సులు అందుబాటులోకి వచ్చాయి.
ఇదిలావుంటే.. ఫ్రీబస్సు ప్రయాణం కారణంగా.. కీలకమైన మెట్రో రైళ్లు బోసి పోయాయి. ప్రధాని మోడీ ఇటీవల ప్రచారంలో కూడా.. మెట్రో తీసుకువచ్చి.. మేలు చేశామని చెప్పుకొచ్చారు. కానీ, కాంగ్రెస్ తీసుకువచ్చిన ఫ్రీ బస్సు ప్రయాణంతో మెట్రో రైళ్లన్నీ ఖాళీగానే ప్రయాణించాయి. కీలకమైన ఎల్బీ నగర్ రూట్లో నిత్యం కిటకిటలాడే.. మెట్రో సర్వీసులు ప్రయాణికులు లేక ముఖ్యంగా మహిళలు, యువతులు లేక బోసిపోయాయి. మొత్తానికి కాంగ్రెస్ ఎఫెక్ట్తో మెట్రో రైళ్ల ఉనికికే దెబ్బ పడిపోయే ప్రమాదం ఏర్పడిందనే చర్చ సాగుతోంది.
This post was last modified on December 9, 2023 9:46 pm
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆసక్తికర విషయాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. ``ఇది మీ సొమ్మా.. అయితే.. సొంతం చేసుకోండి.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…