తెలంగాణలో కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీ రావడంతోనే మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెచ్చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు వయసుతో నిమిత్తం లేకుండా.. అందరికీ ఉచిత ప్రయాణం చేరువైంది. ఇది ఒకరకంగా.. అసలే కష్టాల్లో ఉన్న ఆర్టీసికి పెను భారమే అయినా.. ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్కు మాత్రం మైలేజీని పెంచేసింది.
ఇక, కాంగ్రెస్ తీసుకువచ్చిన ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు ఫ్రీ రవాణా సదుపాయం అందుబాటు లోకి వచ్చింది. దీంతో సొంత వాహనాలను(స్కూటీ తదితర) పక్కన పెట్టేసి మరీ ఉద్యోగినులు కూడా.. బస్సులను ఆశ్రయించారు. మరోవైపు.. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగినులు కూడా ఉచిత రవాణాను వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7200 బస్సులు అందుబాటులోకి వచ్చాయి.
ఇదిలావుంటే.. ఫ్రీబస్సు ప్రయాణం కారణంగా.. కీలకమైన మెట్రో రైళ్లు బోసి పోయాయి. ప్రధాని మోడీ ఇటీవల ప్రచారంలో కూడా.. మెట్రో తీసుకువచ్చి.. మేలు చేశామని చెప్పుకొచ్చారు. కానీ, కాంగ్రెస్ తీసుకువచ్చిన ఫ్రీ బస్సు ప్రయాణంతో మెట్రో రైళ్లన్నీ ఖాళీగానే ప్రయాణించాయి. కీలకమైన ఎల్బీ నగర్ రూట్లో నిత్యం కిటకిటలాడే.. మెట్రో సర్వీసులు ప్రయాణికులు లేక ముఖ్యంగా మహిళలు, యువతులు లేక బోసిపోయాయి. మొత్తానికి కాంగ్రెస్ ఎఫెక్ట్తో మెట్రో రైళ్ల ఉనికికే దెబ్బ పడిపోయే ప్రమాదం ఏర్పడిందనే చర్చ సాగుతోంది.
This post was last modified on December 9, 2023 9:46 pm
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…