తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. సీఎంగా రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మంత్రులకు శాఖల కేటాయింపుపై నిర్ణయం ఓ కొలిక్కి రాలేదు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి మంత్రులకు శాఖలను కేటాయించారు. సీఎం రేసులో ఉండి డిప్యూటీ సీఎం అయిన మల్లు భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖతోపాటు, విద్యుత్ శాఖను కేటాయించారు. ఇక, సీఎం రేసులో ఉన్న మరో ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డికి పౌరసరఫరాల శాఖ, నీటి పారుదల శాఖను కేటాయించారు.
ఇక, కేటీఆర్ లేని ఐటీ శాఖను ఊహించుకోలేకపోతున్నామంటూ సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. ఈ క్రమంలోనే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఐటీ శాఖ దక్కింది. ఎల్లారెడ్డి పేట ఎమ్మెల్యే మదన్ మోహన్ పేరు కూడా ఐటీ శాఖా మంత్రి పదవి రేసులో తెరపైకి రాగా.. చివరకు శ్రీధర్ బాబుకు అవకాశం దక్కింది. సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలలో ఒకరికి హోంమంత్రి పదవి కేటాయిస్తారని ప్రచారం జరిగినా..హోం శాఖతోపాటు ఎవరికీ కేటాయించని శాఖలను సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించనున్నారు.
This post was last modified on December 9, 2023 11:35 am
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…