తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. సీఎంగా రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మంత్రులకు శాఖల కేటాయింపుపై నిర్ణయం ఓ కొలిక్కి రాలేదు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి మంత్రులకు శాఖలను కేటాయించారు. సీఎం రేసులో ఉండి డిప్యూటీ సీఎం అయిన మల్లు భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖతోపాటు, విద్యుత్ శాఖను కేటాయించారు. ఇక, సీఎం రేసులో ఉన్న మరో ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డికి పౌరసరఫరాల శాఖ, నీటి పారుదల శాఖను కేటాయించారు.
ఇక, కేటీఆర్ లేని ఐటీ శాఖను ఊహించుకోలేకపోతున్నామంటూ సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. ఈ క్రమంలోనే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఐటీ శాఖ దక్కింది. ఎల్లారెడ్డి పేట ఎమ్మెల్యే మదన్ మోహన్ పేరు కూడా ఐటీ శాఖా మంత్రి పదవి రేసులో తెరపైకి రాగా.. చివరకు శ్రీధర్ బాబుకు అవకాశం దక్కింది. సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలలో ఒకరికి హోంమంత్రి పదవి కేటాయిస్తారని ప్రచారం జరిగినా..హోం శాఖతోపాటు ఎవరికీ కేటాయించని శాఖలను సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించనున్నారు.
This post was last modified on December 9, 2023 11:35 am
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…