తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. సీఎంగా రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మంత్రులకు శాఖల కేటాయింపుపై నిర్ణయం ఓ కొలిక్కి రాలేదు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి మంత్రులకు శాఖలను కేటాయించారు. సీఎం రేసులో ఉండి డిప్యూటీ సీఎం అయిన మల్లు భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖతోపాటు, విద్యుత్ శాఖను కేటాయించారు. ఇక, సీఎం రేసులో ఉన్న మరో ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డికి పౌరసరఫరాల శాఖ, నీటి పారుదల శాఖను కేటాయించారు.
ఇక, కేటీఆర్ లేని ఐటీ శాఖను ఊహించుకోలేకపోతున్నామంటూ సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. ఈ క్రమంలోనే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఐటీ శాఖ దక్కింది. ఎల్లారెడ్డి పేట ఎమ్మెల్యే మదన్ మోహన్ పేరు కూడా ఐటీ శాఖా మంత్రి పదవి రేసులో తెరపైకి రాగా.. చివరకు శ్రీధర్ బాబుకు అవకాశం దక్కింది. సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలలో ఒకరికి హోంమంత్రి పదవి కేటాయిస్తారని ప్రచారం జరిగినా..హోం శాఖతోపాటు ఎవరికీ కేటాయించని శాఖలను సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించనున్నారు.
సినిమాలను అడ్డుకోవడం లేదా బ్యాన్ చేయడం వల్ల వాటి క్రేజ్ తగ్గడం పక్కన పెడితే నెటిజన్లలో క్యూరియాసిటీ మరింత పెరుగుతుందని…
బాలీవుడ్లో ఒకప్పుడు కంగనా రనౌత్కు తిరుగులేని స్టార్ ఇమేజ్, మార్కెట్ ఉండేది. కానీ వరుస ఫ్లాపులకు తోడు ఆమె వ్యక్తిగత ప్రవర్తన కారణంగా…
రాఘవ లారెన్స్ అంటే మొదట స్టార్ కొరియోగ్రాఫర్. తర్వాత అతను నటుడిగా మారి కొన్ని సినిమాలు చేశాడు. అంత వరకు…
బాలీవుడ్ బిగ్గెస్ట్ విజువల్ గ్రాండియర్ గా ప్రచారంలో ఉన్న రామాయణ పార్ట్ 1 దీపావళి విడుదలకు రెడీ అవుతోంది. ఇంకా…
బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్లో కొనసాగుతున్న…
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…