తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. సీఎంగా రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మంత్రులకు శాఖల కేటాయింపుపై నిర్ణయం ఓ కొలిక్కి రాలేదు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి మంత్రులకు శాఖలను కేటాయించారు. సీఎం రేసులో ఉండి డిప్యూటీ సీఎం అయిన మల్లు భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖతోపాటు, విద్యుత్ శాఖను కేటాయించారు. ఇక, సీఎం రేసులో ఉన్న మరో ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డికి పౌరసరఫరాల శాఖ, నీటి పారుదల శాఖను కేటాయించారు.
ఇక, కేటీఆర్ లేని ఐటీ శాఖను ఊహించుకోలేకపోతున్నామంటూ సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. ఈ క్రమంలోనే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఐటీ శాఖ దక్కింది. ఎల్లారెడ్డి పేట ఎమ్మెల్యే మదన్ మోహన్ పేరు కూడా ఐటీ శాఖా మంత్రి పదవి రేసులో తెరపైకి రాగా.. చివరకు శ్రీధర్ బాబుకు అవకాశం దక్కింది. సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలలో ఒకరికి హోంమంత్రి పదవి కేటాయిస్తారని ప్రచారం జరిగినా..హోం శాఖతోపాటు ఎవరికీ కేటాయించని శాఖలను సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించనున్నారు.
This post was last modified on December 9, 2023 11:35 am
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…