ఘోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. “అతని సమక్షంలో ప్రమాణం చేయను.. నాకు సిగ్గుంది. అంతకు మించిన అభిమానం ఉంది. నేను భారతీయుడిని“ అని రాజాసింగ్ అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్మం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అన్ని పార్టీల ఎమ్మెల్యేల చేత.. శాసన సభలో ప్రమాణం చేయించాల్సిన అవసరం ఉంది.
దీనికి సంబంధించి రేవంత్రెడ్డి సర్కారు నిర్ణయానికి వచ్చిన విషయం తెలిసిందే. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు సభను నిర్వహించాలని నిర్ణయించింది. అదేసమయంలో ఎమ్మెల్యేలందరితోనూ.. ప్రమాణం చేయించనున్నట్టు తెలిపింది. ఈ క్రమంలో సీనియర్ ఎమ్మెల్యే గా ఉన్న ఎంఐఎం నాయకుడు, చాంద్రాయణగుట్ట సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్గా ఎన్నుకుంది. ఈ నేపథ్యంలో ఆయన నేతృత్వంలో ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్నారు.
అయితే.. ఆది నుంచి కూడా ఎంఐఎంను వ్యతిరేకిస్తున్న బీజేపీ సబ్యుడు రాజాసింగ్.. ఇప్పుడు ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ను ఎన్నుకోవడం పట్ల కూడా తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఆయన సమక్షంలో ప్రమాణం చేయబోనని వెల్లడించారు. అంతేకాదు.. తనలో భారతీయ రక్తం పారుతోందన్నారు. దీంతో శనివారం నిర్వహించే ఎమ్మెల్యేల ప్రమాణ కార్యక్రమానికి రాజాసింగ్ డుమ్మా కొట్టనున్నట్టు తెలుస్తోంది. ఇక, పూర్తిస్థాయిలో స్పీకర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత.. రాజా సింగ్ ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఇది జరిగేందుకు మరో నెల రోజులు ఆయన వెయిట్ చేయాలి. ఫలితంగా ఆయనకు ఈ నెల రోజుల పాటు.. జీత భత్యాలు అందవు.
This post was last modified on December 8, 2023 6:21 pm
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటైన ‘కల్కి 2898 ఏడీ’ రిలీజైపోయింది. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి…
‘కల్కి 2898 ఏడీ’ లాంటి ఎపిక్ మూవీకి పని చేసిన సాంకేతిక నిపుణుల విషయంలో చాలామంది ఆశ్చర్యపోయారు. ఇలాంటి భారీ…
ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఈ రోజు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ కొండగట్టు…
సంవత్సరాల తరబడి భాగ్యనగర సినిమా ప్రేమికుల కల ఒకటి నెరవేరకుండా అలాగే ఉండిపోయింది. అదే ఐమాక్స్. ఒకప్పుడు ప్రసాద్ మల్టీప్లెక్సులో…
అభిమానులు లేడీ సూపర్ స్టార్ గా పిలుచుకునే నయనతార ఆమె హీరోయిన్ గా నటించిన సినిమా అయినా సరే ప్రమోషన్లకు…
టీడీపీ సీనియర్ నాయకులు.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని పార్టీ విజయం కోసం కష్టపడ్డ అశోక్ గజపతిరాజు,…