ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో రెండు కీలక నియోజకవర్గాల్లో టీడీపీ సీనియర్లకు సెగ తగులుతోంది. వారి స్థానాలను జనసేన కోరుతుండడమే కాదు.. పట్టుబడుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ రెండు ఇస్తే.. గెలిచి తీసుకువస్తాం.. అంటూ తాజాగా జనసేన అధినేత పవన్ దగ్గర నాయకులు తేల్చి చెప్పారు. అవే.. ఒకటి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం. రెండు అనంతపురం అర్బన్.
ఈ రెండు నియోజకవర్గాల్లోనూ జనసేన గెలుపు పక్కా అని చెబుతున్నారు. వాస్తవానికి ఈ రెండు నియోకవర్గాల్లోనూ ఒకటి టీడీపీ సిట్టింగ్ సీటు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో వైసీపీ హవా ఉద్రుతంగా ఉన్నప్పటికీ.. టీడీపీ దక్కించుకుంది. ఇక, అనంతపురం అర్బన్ టికెట్ను మాత్రం చేజార్చుకుంది. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు స్థానాలను ఇవ్వాలన్న జనసేన విన్నపానికి టీడీపీకి కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
రెండు కారణాలతో ఈ రెండు స్థానాలను టీడీపీ.. జనసేనకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. వయసు పైబడడం.. ప్రజల్లోనూ ఆయనపై సానుకూలత పెద్దగా లేక పోవడం.. వైసీపీ ఇక్కడ యువ నాయకుడిని ప్రవేశ పెట్టడం వంటి కారణాలతో బుచ్చయ్యకు టికెట్ ఇచ్చినా.. ప్రయోజనం లేదని టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో ఈ సీటును వదులుకునేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.
ఇక, అనంతపురం అర్బన్లో అంతర్గత కుమ్ములాటలు మరింత పెరిగాయి. జేసీ బ్రదర్స్ దివాకర్ రెడ్డి, ప్రభాకర్రెడ్డిలకు .. ఇక్కడి టీడీపీ ఇంచార్జ్ , మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర చౌదరికి మధ్య ఏళ్ల తరబడి విభేదాలు కొనసాగతున్నాయి. ఇప్పుడు వైకుంఠానికి టికెట్ ఇచ్చినా.. ప్రయోజనం లేదని భావించి.. ఆయనకు వేరే సీటు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఇక్కడ కూడా జనసేనకు టికెట్ ఖారరవుతున్నట్టు సమాచారం. ఏదైనా సంచనాలు చోటు చేసుకుంటే తప్ప.. దీనిలో మార్పు ఉండదనేది పార్టీ వర్గాల అభిప్రాయం.
This post was last modified on December 8, 2023 12:35 pm
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర…
ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…
యాంకర్గా మొదలై, హీరోయిన్గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…
స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…