ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో రెండు కీలక నియోజకవర్గాల్లో టీడీపీ సీనియర్లకు సెగ తగులుతోంది. వారి స్థానాలను జనసేన కోరుతుండడమే కాదు.. పట్టుబడుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ రెండు ఇస్తే.. గెలిచి తీసుకువస్తాం.. అంటూ తాజాగా జనసేన అధినేత పవన్ దగ్గర నాయకులు తేల్చి చెప్పారు. అవే.. ఒకటి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం. రెండు అనంతపురం అర్బన్.
ఈ రెండు నియోజకవర్గాల్లోనూ జనసేన గెలుపు పక్కా అని చెబుతున్నారు. వాస్తవానికి ఈ రెండు నియోకవర్గాల్లోనూ ఒకటి టీడీపీ సిట్టింగ్ సీటు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో వైసీపీ హవా ఉద్రుతంగా ఉన్నప్పటికీ.. టీడీపీ దక్కించుకుంది. ఇక, అనంతపురం అర్బన్ టికెట్ను మాత్రం చేజార్చుకుంది. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు స్థానాలను ఇవ్వాలన్న జనసేన విన్నపానికి టీడీపీకి కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
రెండు కారణాలతో ఈ రెండు స్థానాలను టీడీపీ.. జనసేనకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. వయసు పైబడడం.. ప్రజల్లోనూ ఆయనపై సానుకూలత పెద్దగా లేక పోవడం.. వైసీపీ ఇక్కడ యువ నాయకుడిని ప్రవేశ పెట్టడం వంటి కారణాలతో బుచ్చయ్యకు టికెట్ ఇచ్చినా.. ప్రయోజనం లేదని టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో ఈ సీటును వదులుకునేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.
ఇక, అనంతపురం అర్బన్లో అంతర్గత కుమ్ములాటలు మరింత పెరిగాయి. జేసీ బ్రదర్స్ దివాకర్ రెడ్డి, ప్రభాకర్రెడ్డిలకు .. ఇక్కడి టీడీపీ ఇంచార్జ్ , మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర చౌదరికి మధ్య ఏళ్ల తరబడి విభేదాలు కొనసాగతున్నాయి. ఇప్పుడు వైకుంఠానికి టికెట్ ఇచ్చినా.. ప్రయోజనం లేదని భావించి.. ఆయనకు వేరే సీటు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఇక్కడ కూడా జనసేనకు టికెట్ ఖారరవుతున్నట్టు సమాచారం. ఏదైనా సంచనాలు చోటు చేసుకుంటే తప్ప.. దీనిలో మార్పు ఉండదనేది పార్టీ వర్గాల అభిప్రాయం.
This post was last modified on December 8, 2023 12:35 pm
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…
నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీ వల వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి,…
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…