ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే.. తుమ్మల నాగేశ్వరరావు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 1985 నుంచి ఇప్పటి వరకు మధ్యలో 2004-2014, 2018-2023 తప్ప.. అన్ని ప్రభుత్వాల్లోనూ ఆయన మంత్రిగా పనిచేశారు. ఈ రికార్డు ఇప్పటి వరకు జీవించి ఉన్న నాయకుల్లో ఎవరికీ లేకపోవడం గమనార్హం.
టీడీపీతో రాజకీయాలు ప్రారంభించిన తుమ్మల దాదాపు 40 ఏళ్లకు పైగానే పాలిటిక్స్ చేస్తున్నారు. అన్నగారు ఎన్టీఆర్ హయాంలోనే రాజకీయ అరంగేట్రం చేసిన తుమ్మల.. అప్పటి నుంచి 2014 రాష్ట్ర విభజన వరకు నమ్మకమైన నాయకుడిగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఆయన మంత్రిగా పనిచేశారు. 1985, 1995, 1996, 1999, 2001లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వాల్లో చిన్ననీటి పారుదల, ప్రొహిబిషన్, భారీ, మధ్యతరహా నీటి పారుదలశాఖ, ఎక్సైజ్, ఆర్అండ్బీ శాఖ మంత్రిగా తుమ్మల పనిచేశారు.
ఇక, ఆ తర్వాత.. టీడీపీ నుంచి బీఆర్ ఎస్లోకి వచ్చిన తర్వాత కూడా 2014లో ఆర్అండ్బీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన మంత్రిగా పనిచేసిన కాలంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారు. 2018లో పాలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు.
ఈసారి బీఆర్ఎస్ టికెట్ కేటాయించకపోవడంతో కాంగ్రెస్లో చేరి ఖమ్మం నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్పై ఘన విజయం సాధించారు. దీంతో ఆయనకు మరోసారి మంత్రి పదవి దక్కడం విశేషం. ప్రస్తుతం కొలువు దీరిన రేవంత్ మంత్రివర్గంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఏకైక మంత్రి కూడాఈయనే కావడం మరో రికార్డు!!
This post was last modified on December 8, 2023 12:35 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…