టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ జనంలోకి అడుగు పెట్టనున్నారు. జైలు, అనారోగ్యం కారణాల తో దాదాపు మూడు మాసాలుగా ఆయన ప్రజలకు దూరంగా ఉన్నారు. సెప్టెంబరు 3న చంద్రబాబు ఏపీ సీఐడీ అధికారులు కర్నూలు జిల్లాలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఆయనను 52 రోజుల పాటు జైల్లో ఉంచారు. తర్వాత బెయిల్పై వచ్చిన చంద్రబాబు.. కంటి ఆపరే షన్ కోసం హైదరాబాద్కు వెళ్లారు. ఇక, సెప్టెంబరు 3 నుంచి చంద్రబాబు ప్రజలకు దూరమయ్యారు.
అయితే.. ఇప్పుడు మళ్లీ ఆయన ప్రజలలోకి వచ్చేందుకు పక్కా ప్రణాళిక వేసుకున్నారు. శుక్రవారం నుంచి ఇక, వరుసగా జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. శుక్రవారం, శనివారం మాత్రం మిచౌంగ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఓదార్చనున్నారు. అదేసమయంలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు .. మిచౌంత్ తుఫాను వస్తుందని తెలిసినా ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వంటి విషయాలను ఆయన ప్రజల్లొకి బలంగా తీసుకువెళ్లనున్నారు.
ఇక, 11వ తేదీ నుంచి ఉమ్మడి తూర్పు, ఉమ్మడి శ్రీకాకుళం సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటనలు చేయను న్నారు. ముఖ్యంగా జనసేన-టీడీపీ మిత్ర పక్షానికి సంబంధించి కొంత మేరకు దూరంగా ఉన్న పార్టీ నాయకులను చంద్రబాబు సమన్వయం చేయనున్నారు. పార్టీ కార్యాచరణ, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలనే లక్ష్యంలోనే జనసేనతో పొత్తు పెట్టుకున్నట్టు వారిని అనునయించనున్నారు.
ఇదేక్రమంలో కొన్ని సీట్లను కూడా ఖరారు చేయనున్నట్టు సమాచారం. ముఖ్యంగా బొబ్బిలి నియోజక వర్గంలో టీడీపీ వర్సెస్ టీడీపీగా ఉన్న విభేదాలపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్టు పార్టీవర్గాలు చెబుతు న్నాయి ఈ పర్యటనలో చంద్రబాబు సుమారు 4 బహిరంగ సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అదేసమయంలో ఆయా జిల్లాల్లో నియోజకవర్గాల సమీక్షతోపాటు, సమస్యలు కూడా తెలుసుకుని పరిష్కరించనున్నట్టు చెబుతున్నారు.
ఇప్పుడు ప్రపంచంలో నంబర్ వన్ డైౌరెక్టర్ ఎవరు అని పోల్ పెడితే.. తిరుగులేని ఆధిక్యంతో క్రిస్టోఫర్ నోలనే గెలుస్తాడు అనడంలో…
గత శుక్రవారం ‘సింగ్గీతం’ చిత్రం విడుదల కావడానికి ముందు పెద్దగా బజ్ కనిపించలేదు. 94 ఏళ్ల వయసులో సింగీతం ఓపిగ్గా…
గత ఎన్నికల సమయంలో మంగళగిరిలోని ప్రతి వీధిలోనూ పర్యటించిన నారా లోకేష్.. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను ప్రభుత్వం…
విడుదల ఎప్పుడు ఉంటుందో కానీ కల్కి 2 మీద అంచనాలు మాములుగా లేవు. కల్కి 2898 ఏడి గొప్ప విజయమే…
అక్కినేని నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కుమార్లది కల్ట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘మనం’ ఎంత పెద్ద…
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. సాధారణంగా జూన్ వచ్చిందంటే.. ఎండలు తగ్గుముఖం పట్టి..…