Political News

గ్రూప్ – 2 కు గ్రీన్ సిగ్న‌ల్‌

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. 897 పోస్టుల‌తో కూడిన గ్రూప్‌-2 నోటిఫికేష‌న్‌కు ప‌చ్చ జెండా ఊపింది. పలు న్యాయపరమైన వివాదాలను అధి­గమించి గత నాలుగేళ్లల్లో సంస్కరణలు తెచ్చిన ఏపీపీఎస్సీ.. తాజాగా గ్రూప్‌–2 పోస్టుల భర్తీని చేప‌ట్టింది. ఈ మేర‌కు గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 897 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్‌ ప్రకటించింది. ఈ నెల 21వతేదీ నుంచి జనవరి 10 వరకు అభ్య‌ర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించను న్నారు.

ఇవీ పోస్టులు

డిప్యూటీ తహసీల్దార్ – 114
ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్ – 150
గ్రేడ్‌–3 మున్సిపల్‌ కమిషనర్ల పోస్టులు 4
గ్రేడ్‌–2 సబ్‌ రిజిస్ట్రార్‌ 16
అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ 28
59 శాఖల్లో 331 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు
అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఏఏఓ),
సీనియర్‌ ఆడిటర్
ఆడిటర్‌ ఇన్‌ పే అండ్‌ అకౌంట్స్ – 566

ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి?

ఇప్ప‌టికే ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో లాగిన్ ఐడీ ఉన్న అభ్య‌ర్థులు తమ వన్‌ టైమ్‌ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీపీఆర్‌) ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి. కొత్త అభ్యర్థులు అయితే.. కమిషన్‌ వెబ్‌సైట్‌లో తమ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఓటీపీఆర్‌తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

గ్రూప్‌–2 ప్రిలిమినరీ పరీక్షను ఆబ్జెక్టివ్ మోడ్‌లో ఫిబ్రవరి 25వతేదీన ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు. మెయిన్స్‌ సైతం ఆబ్జెక్టివ్‌ తరహాలో ఆఫ్‌లైన్‌ లేదా సీబీటీలో నిర్వహించనున్నారు. మెయిన్స్‌ పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఈ మొత్తం ప్రక్రియను మే నెల నాటికి పూర్తి చేయనున్నారు.

This post was last modified on December 8, 2023 1:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మీ సొమ్ము మీరే తీసుకోండి: మోదీ

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆసక్తికర విష‌యాన్ని దేశ ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు. ``ఇది మీ సొమ్మా.. అయితే.. సొంతం చేసుకోండి.…

52 seconds ago

దురంధర్ భామకు దశ తిరుగుతోంది

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…

2 hours ago

అఖండ-2… కొత్త హైప్… కొత్త ట్రైలర్?

గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…

3 hours ago

సూర్య, గిల్‌.. ఒక్క రోజు హిట్టు.. పది రోజులు ఫట్టు

కటక్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…

3 hours ago

నాగార్జున మీద రీసెర్చ్ చేయాలన్న సేతుపతి

అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…

4 hours ago

రాష్ట్రంలో జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రాన్ని త్వ‌ర‌లోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి…

4 hours ago