అధ్యాత్మిక ప్రసంగాలు.. నాలుగు మంచి మాటలు చెప్పుకుంటూ.. పాలకులు.. వారి విధానాల మీద మాట్లాడేందుకు అస్సలు ఆసక్తి చూపని చినజీయర్ స్వాములోరు తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంక్షేమ పథకాల అమలు మీద కావటం.. వాటిని అమలు చేసే ప్రభుత్వాల మీద కావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఆయన.. సంక్షేమ పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
క్రిష్ణా జిల్లా బావులపాడు మండలం వీరవల్లిలో విజయ డెయిరీ నూతన యూనిట్ ను ఆయన ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు రకరకాల రాయితీలు ఇస్తున్నాయన్న చినజీయర్ స్వామి ప్రజల్ని బలహీనులుగా.. బద్ధకస్తులుగా మారుస్తున్నాయని పేర్కొనటం గమనార్హం.
“ప్రభుత్వాలు రకరకాల రాయితీలు ఇస్తున్నాయి. పుడితే ఒకటి.. పోతే ఒకటి. కూర్చుంటే ఒకటి. నడిస్తే మరొకటి. పడుకుంటే ఇంకొకటి. తింటే రాయితీ. తినకపోతే రాయితీ ఇలా ప్రతిదానికీ రాయితీలు ఇస్తూ ప్రజల్ని బద్దకస్తులుగా.. బలహీనులుగా తయారు చేస్తున్నారు” అంటూ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అన్నీ మన ఇంటికే తెచ్చిస్తుంటే.. ఇంకెందుకు పని చేయాలన్నధోరణిలో ప్రజలు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యల లెక్కలేంటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
This post was last modified on December 8, 2023 10:32 am
ఇండస్ట్రీలో, సామాన్యుల్లో సినిమా టికెట్ రేట్ల గురించి చర్చ జరగడం కొత్తేమి కాదు. పెద్ద హీరోలతో ప్యాన్ ఇండియా మూవీస్…
https://www.youtube.com/watch?v=ZQuuw18Yicw బిగ్ స్క్రీన్ మీద సమంతాని చూసి అభిమానులకు బాగా గ్యాప్ వచ్చేసింది. ఇటీవలే అలియా భట్ జిగ్రా ప్రీ…
నాగచైతన్య తండేల్ విడుదల తేదీ తాలూకు డోలాయమానం కొనసాగుతోంది. నితిన్ రాబిన్ హుడ్ డిసెంబర్ 20 ప్రకటించారు కాబట్టి ఇది…
ఒక దౌత్యాధికారి మీద తీవ్ర ఆరోపణలు రావటం.. ఒక సంపన్న దేశం వేలెత్తి చూపటం.. దానికి భారతదేశం తీవ్రంగా స్పందించటమే…
సంపద సృష్టి. ఈ మాట ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు జోరుగా వినిపించింది. "సూపర్ సిక్స్ అమలు చేస్తాం…
కెజిఎఫ్ ప్రభావం వల్ల దాన్ని స్ఫూర్తితో కోట్ల రూపాయలతో అలాంటి సినిమాలు తీసి ఏదో నిరూపించాలని తాపత్రయపడి చేతులు కాల్చుకుంటున్న…