Political News

ప్రభుత్వ పథకాలపై చినజీయర్ స్వామి వ్యంగ్యస్త్రాలు

అధ్యాత్మిక ప్రసంగాలు.. నాలుగు మంచి మాటలు చెప్పుకుంటూ.. పాలకులు.. వారి విధానాల మీద మాట్లాడేందుకు అస్సలు ఆసక్తి చూపని చినజీయర్ స్వాములోరు తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంక్షేమ పథకాల అమలు మీద కావటం.. వాటిని అమలు చేసే ప్రభుత్వాల మీద కావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఆయన.. సంక్షేమ పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

క్రిష్ణా జిల్లా బావులపాడు మండలం వీరవల్లిలో విజయ డెయిరీ నూతన యూనిట్ ను ఆయన ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు రకరకాల రాయితీలు ఇస్తున్నాయన్న చినజీయర్ స్వామి ప్రజల్ని బలహీనులుగా.. బద్ధకస్తులుగా మారుస్తున్నాయని పేర్కొనటం గమనార్హం.

“ప్రభుత్వాలు రకరకాల రాయితీలు ఇస్తున్నాయి. పుడితే ఒకటి.. పోతే ఒకటి. కూర్చుంటే ఒకటి. నడిస్తే మరొకటి. పడుకుంటే ఇంకొకటి. తింటే రాయితీ. తినకపోతే రాయితీ ఇలా ప్రతిదానికీ రాయితీలు ఇస్తూ ప్రజల్ని బద్దకస్తులుగా.. బలహీనులుగా తయారు చేస్తున్నారు” అంటూ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అన్నీ మన ఇంటికే తెచ్చిస్తుంటే.. ఇంకెందుకు పని చేయాలన్నధోరణిలో ప్రజలు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యల లెక్కలేంటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

This post was last modified on December 8, 2023 10:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago