అధ్యాత్మిక ప్రసంగాలు.. నాలుగు మంచి మాటలు చెప్పుకుంటూ.. పాలకులు.. వారి విధానాల మీద మాట్లాడేందుకు అస్సలు ఆసక్తి చూపని చినజీయర్ స్వాములోరు తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంక్షేమ పథకాల అమలు మీద కావటం.. వాటిని అమలు చేసే ప్రభుత్వాల మీద కావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఆయన.. సంక్షేమ పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
క్రిష్ణా జిల్లా బావులపాడు మండలం వీరవల్లిలో విజయ డెయిరీ నూతన యూనిట్ ను ఆయన ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు రకరకాల రాయితీలు ఇస్తున్నాయన్న చినజీయర్ స్వామి ప్రజల్ని బలహీనులుగా.. బద్ధకస్తులుగా మారుస్తున్నాయని పేర్కొనటం గమనార్హం.
“ప్రభుత్వాలు రకరకాల రాయితీలు ఇస్తున్నాయి. పుడితే ఒకటి.. పోతే ఒకటి. కూర్చుంటే ఒకటి. నడిస్తే మరొకటి. పడుకుంటే ఇంకొకటి. తింటే రాయితీ. తినకపోతే రాయితీ ఇలా ప్రతిదానికీ రాయితీలు ఇస్తూ ప్రజల్ని బద్దకస్తులుగా.. బలహీనులుగా తయారు చేస్తున్నారు” అంటూ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అన్నీ మన ఇంటికే తెచ్చిస్తుంటే.. ఇంకెందుకు పని చేయాలన్నధోరణిలో ప్రజలు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యల లెక్కలేంటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
This post was last modified on December 8, 2023 10:32 am
బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగుతున్న సంగతి తెలిసిందే. లండన్కు…
జాతిరత్నాలు సినిమాతో కథానాయికగా చాలా మంచి పేరు సంపాదించింది హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. లోకల్ హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యం…
మే 8 రవిబాబు కొత్త సినిమా రేజర్ విడుదల కానుంది. హీరో దర్శకుడు రెండూ ఆయనే. దీంతో సహజంగా ప్రమోషన్ల…
ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్లోకి మెరుపులా దూసుకొచ్చింది ఉత్తరాది అమ్మాయి పాయల్ రాజ్పుత్. ఆ సినిమానే కాదు.. అందులో పాయల్…
ఇంకో మూడు రోజుల్లో రెండు కొత్త తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సందడి లేక టికెట్ కౌంటర్లు…
ఫాంటసీ, విజువల్ ఎఫెక్ట్స్, వరల్డ్ బిల్డింగ్ లాంటివి లేకుండా ఒక స్పై డ్రామాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టొచ్చని నిరూపించిన…