అధ్యాత్మిక ప్రసంగాలు.. నాలుగు మంచి మాటలు చెప్పుకుంటూ.. పాలకులు.. వారి విధానాల మీద మాట్లాడేందుకు అస్సలు ఆసక్తి చూపని చినజీయర్ స్వాములోరు తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంక్షేమ పథకాల అమలు మీద కావటం.. వాటిని అమలు చేసే ప్రభుత్వాల మీద కావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఆయన.. సంక్షేమ పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
క్రిష్ణా జిల్లా బావులపాడు మండలం వీరవల్లిలో విజయ డెయిరీ నూతన యూనిట్ ను ఆయన ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు రకరకాల రాయితీలు ఇస్తున్నాయన్న చినజీయర్ స్వామి ప్రజల్ని బలహీనులుగా.. బద్ధకస్తులుగా మారుస్తున్నాయని పేర్కొనటం గమనార్హం.
“ప్రభుత్వాలు రకరకాల రాయితీలు ఇస్తున్నాయి. పుడితే ఒకటి.. పోతే ఒకటి. కూర్చుంటే ఒకటి. నడిస్తే మరొకటి. పడుకుంటే ఇంకొకటి. తింటే రాయితీ. తినకపోతే రాయితీ ఇలా ప్రతిదానికీ రాయితీలు ఇస్తూ ప్రజల్ని బద్దకస్తులుగా.. బలహీనులుగా తయారు చేస్తున్నారు” అంటూ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అన్నీ మన ఇంటికే తెచ్చిస్తుంటే.. ఇంకెందుకు పని చేయాలన్నధోరణిలో ప్రజలు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యల లెక్కలేంటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
మన దేశంలో కార్యనిర్వాహక వ్యవస్థలో అలసత్వం అంతకంతకూ పెరిగిపోతోంది. శాసన వ్యవస్త ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిన కీలకమైన బాధ్యత…
ఏపీలో సోమావరం ఓ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఈ భారీ ప్రమాదంలో ఏకంగా…
ఢిల్లీలో జరుగుతున్న ఇండియా కూటమి కీలక సమావేశానికి కాంగ్రెస్ సన్నిహిత పార్టీలు హాజరవుతూ పాలిటిక్స్ లో మళ్లీ హీట్ పెంచాయి.…
నెల్లూరు జిల్లాకు చెందిన పొలిటికల్ ఫ్యామిలీ మేకపాటి కుటుంబంలో ఆస్తుల రచ్చ రోడ్డుకెక్కింది. ఈ కుటుంబం నుంచి పలువురు నాయకులు…
ఈ మధ్య తమన్ సౌండ్ కొంచెం తగ్గిపోయింది. తన నుంచి సాలిడ్ బ్లాక్ బస్టర్ పడక అభిమానులు ఎదురు చూస్తున్నారు.…
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడి అప్పుడే రెండున్నరేళ్లు అవుతోంది. ఇంకో రెండున్నరేళ్లలో ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికల్లో ఎలాగైనా…