అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసుపత్రిలో చేరారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజు రాత్రే ప్రగతిభవన్ నుంచి ఎర్రవెల్లి ఫాంహౌస్ కు వెళ్లిపోయిన ఆయన.. అక్కడే ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. గురువారం అర్థరాత్రి ఫాంహౌస్ లోని బాత్రూంలో కాలుజారి పడిపోయినట్లుగా చెబుతున్నారు. దీంతో..తీవ్ర గాయమైన ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు.
సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రికి ఆయన్ను తీసుకెళ్లారు. ఆయనకు పరీక్షలు చేసిన వైద్యులు.. ఆయనకు తుంటి ఎముక విరిగినట్లుగా గుర్తించారు. సర్జరీ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. అయితే.. వైద్య పరీక్షలు పూర్తి అయ్యాక శస్త్రచికిత్సపై నిర్ణయం తీసుకుంటామని వైద్యులు చెబుతున్నారు. శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ.. అసెంబ్లీకి కేసీఆర్ వెళతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నవేళ.. అనూహ్యంగా ఆయన ఫాంహౌస్ బాత్రూంలో జారి పడటం ఆందోళనకు గురి చేస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై గులాబీ నేతలు.. కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు.
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిర్వహించిన…
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…
కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…
జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…
కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…
ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…