అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసుపత్రిలో చేరారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజు రాత్రే ప్రగతిభవన్ నుంచి ఎర్రవెల్లి ఫాంహౌస్ కు వెళ్లిపోయిన ఆయన.. అక్కడే ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. గురువారం అర్థరాత్రి ఫాంహౌస్ లోని బాత్రూంలో కాలుజారి పడిపోయినట్లుగా చెబుతున్నారు. దీంతో..తీవ్ర గాయమైన ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు.
సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రికి ఆయన్ను తీసుకెళ్లారు. ఆయనకు పరీక్షలు చేసిన వైద్యులు.. ఆయనకు తుంటి ఎముక విరిగినట్లుగా గుర్తించారు. సర్జరీ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. అయితే.. వైద్య పరీక్షలు పూర్తి అయ్యాక శస్త్రచికిత్సపై నిర్ణయం తీసుకుంటామని వైద్యులు చెబుతున్నారు. శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ.. అసెంబ్లీకి కేసీఆర్ వెళతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నవేళ.. అనూహ్యంగా ఆయన ఫాంహౌస్ బాత్రూంలో జారి పడటం ఆందోళనకు గురి చేస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై గులాబీ నేతలు.. కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు.
This post was last modified on December 8, 2023 9:27 am
కూటమి పాలనలో ఏపీకి పెట్టుబడుల వరద పోటెత్తుతోంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి గడచిన 7…
``ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు.. సమాజంలో బద్ధకస్తులను పెంచుతున్నాయి. ఇది సరికాదు. సమాజంలో పనిచేసే వారు తగ్గిపోతున్నారు.…
బాహుబలి పాన్ జాతీయ స్థాయిలో సంచలనం రేపాక.. ‘పాన్ ఇండియా’ సినిమాల ఒరవడి బాగా పెరిగింది. ఐతే పాన్ ఇండియా…
కామేపల్లి తులసిబాబుకు ఏపీ సీఐడీ భారీ నజరానా ఇచ్చిందన్న వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అసెంబ్లీ…
తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్కు కొన్నేళ్ల నుంచి నిఖార్సయిన బాక్సాఫీస్ హిట్ లేదు. 2019లో వచ్చిన ‘విశ్వాసం’తో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారన్న విషయంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విచారణకు…