Political News

వైసీపీలో ర‌గులుతున్న కుంప‌ట్లు.. ఆర్పేదెవ‌రు…?

రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేల‌కు వ్య‌తిరేకంగా కుంప‌ట్లు ర‌గులుతూనే ఉన్నాయి. కాద‌న్నా..ఔన‌న్నా.. ఈ విష‌యాలు అధిష్టానానికి కూడా తెలుసు. అయినా.. వాటిని స‌రిదిద్దే ప్ర‌య‌త్నం మాత్రం ఎక్క‌డా జ‌ర‌గ‌డం లేదు. ఎవ‌రినీ క‌దిలించలేని ప‌రిస్థితి.. ఎవరినీ కాద‌న‌లేని ప‌రిస్తితి నెల‌కొంది. దీంతో మీరు మీరు తేల్చుకోండి.. త‌ర్వాత‌.. మా ద‌గ్గ‌ర‌కు రండి! అన్న‌ట్టుగా అధిష్టానం వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

వినుకొండ‌లో ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడును కాద‌ని.. ఓ వ‌ర్గం నాయ‌కులు న‌న్న‌ప‌నేని సుధ‌ను రం గంలోకి తెచ్చాయి. ఈ వివాదం రోజు రోజుకు ముదురు తోంది. అంతేకాదు.. బొల్లాకు వ్య‌తిరేకంగా కార్య‌క్ర మాలు చేప‌డుతున్నారు. ఇది అంతిమంగా వైసీపీనే దెబ్బేస్తోంది. దీనిపై దృష్టి పెట్టే విష‌యంలో అధిష్టానం ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. సామాజిక సాధికార యాత్ర జ‌రిగినా.. ఎమ్మెల్యే బొల్లా బ‌ల నిరూప‌ణ చేసుకోలేక‌పోయార‌నే వాద‌న వినిపించింది.

ఏదో సో..సో..గా ఈ యాత్ర ముగిసిపోయింది. కీల‌క నాయ‌కులు ఈ యాత్ర‌కు దూరంగా ఉన్నారు. ఇక‌, గుర‌జాల‌లోనూ ప‌రిస్థితి మ‌రింత తీవ్రంగా ఉంది. ఎమ్మెల్యే కాసు మ‌హేష్‌రెడ్డికి, బీసీ నాయ‌కుడు, ఎమ్మె ల్సీ జంగా కృష్ణ మూర్తికి ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్తితి క‌నిపిస్తోంది. దీంతో నాయ‌కుల మ‌ధ్య విభేదాలు జోరుగా సాగుతున్నాయి. ఫ‌లితంగా ఇక్క‌డ సామాజిక సాధికార బ‌స్సు యాత్ర నిలిచిపోయింది. ఈ యాత్ర‌కు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో ఎమ్మెల్యే దీనిని వాయిదా వేసుకున్నారు.

తాడికొండ‌లోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. గెలిచిన ఎమ్మెల్యే టీడీపీకి జైకొట్ట‌గా.. ఇక్క‌డ ఇంచార్జ్‌గా ఉన్న ఎమ్మ‌ల్సీ డొక్కా మాణిక్యానికి నాయ‌కులు స‌హ‌క‌రించ‌డం లేదు. పార్టీలు మారుతున్న‌వారికి ఇస్తున్న ప్రాధాన్యం త‌మ‌కు లేకుండా పోయింద‌ని క్షేత్ర‌స్థాయి నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో ఇక్క‌డ‌కూడా యాత్ర పేరు ఎత్తేందుకు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 8, 2023 8:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అస్సీలో అంత మ్యాటర్ ఉందంటారా

గత కొన్ని రోజులుగా ఇంటర్వ్యూలతో హీరోయిన్ తాప్సీ తెగ హడావుడి చేస్తోంది. కారణం తన బాలీవుడ్ మూవీ అస్సీ ఇటీవలే…

2 hours ago

టాక్సిక్ ఇష్టం మనోళ్లకే ఎక్కువ ఉంది

ఇటీవలే విడుదలైన టాక్సిక్ టీజర్ మీద పాజిటివ్, నెగటివ్ రెండు రకాల రియాక్షన్లు సోషల్ మీడియాలో కనిపించాయి. వయొలెన్స్ ఎక్కువయ్యిందని…

2 hours ago

విశ్వక్ అర్థం చేసుకున్న ట్రెండ్ నిజమేనా

నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…

4 hours ago

సాయిపల్లవి బరిలో ఉంటే అవార్డ్ ఇవ్వాల్సిందే

హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…

5 hours ago

‘పవన్ హఠావో’ రచయిత మృతి కేసు మిస్టరీ వీడింది

“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…

6 hours ago

విన్యాసం మీదే బాక్సాఫీస్ ఆశలు

గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…

6 hours ago