రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కుంపట్లు రగులుతూనే ఉన్నాయి. కాదన్నా..ఔనన్నా.. ఈ విషయాలు అధిష్టానానికి కూడా తెలుసు. అయినా.. వాటిని సరిదిద్దే ప్రయత్నం మాత్రం ఎక్కడా జరగడం లేదు. ఎవరినీ కదిలించలేని పరిస్థితి.. ఎవరినీ కాదనలేని పరిస్తితి నెలకొంది. దీంతో మీరు మీరు తేల్చుకోండి.. తర్వాత.. మా దగ్గరకు రండి! అన్నట్టుగా అధిష్టానం వ్యవహరిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును కాదని.. ఓ వర్గం నాయకులు నన్నపనేని సుధను రం గంలోకి తెచ్చాయి. ఈ వివాదం రోజు రోజుకు ముదురు తోంది. అంతేకాదు.. బొల్లాకు వ్యతిరేకంగా కార్యక్ర మాలు చేపడుతున్నారు. ఇది అంతిమంగా వైసీపీనే దెబ్బేస్తోంది. దీనిపై దృష్టి పెట్టే విషయంలో అధిష్టానం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సామాజిక సాధికార యాత్ర జరిగినా.. ఎమ్మెల్యే బొల్లా బల నిరూపణ చేసుకోలేకపోయారనే వాదన వినిపించింది.
ఏదో సో..సో..గా ఈ యాత్ర ముగిసిపోయింది. కీలక నాయకులు ఈ యాత్రకు దూరంగా ఉన్నారు. ఇక, గురజాలలోనూ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డికి, బీసీ నాయకుడు, ఎమ్మె ల్సీ జంగా కృష్ణ మూర్తికి పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్తితి కనిపిస్తోంది. దీంతో నాయకుల మధ్య విభేదాలు జోరుగా సాగుతున్నాయి. ఫలితంగా ఇక్కడ సామాజిక సాధికార బస్సు యాత్ర నిలిచిపోయింది. ఈ యాత్రకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎమ్మెల్యే దీనిని వాయిదా వేసుకున్నారు.
తాడికొండలోనూ ఇదే పరిస్థితి ఉంది. గెలిచిన ఎమ్మెల్యే టీడీపీకి జైకొట్టగా.. ఇక్కడ ఇంచార్జ్గా ఉన్న ఎమ్మల్సీ డొక్కా మాణిక్యానికి నాయకులు సహకరించడం లేదు. పార్టీలు మారుతున్నవారికి ఇస్తున్న ప్రాధాన్యం తమకు లేకుండా పోయిందని క్షేత్రస్థాయి నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో ఇక్కడకూడా యాత్ర పేరు ఎత్తేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.
This post was last modified on December 8, 2023 8:43 am
మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…
ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…
ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…