Political News

అర్థరాత్రి ట్యాంక్ బండ్ పై గ్యాంగ్ వార్

కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతం సంచలనంగా మారింది. సోమవారం తెల్లవారుజామున ట్యాంక్ బండ్ పై మొదలైన చిన్న గొడవ చిలికి చిలికి గాలివానలా మారటమే కాదు.. గ్యాంగ్ వార్ ను తలపించేలా చేసింది. టూవీలర్ మీద వేగంగా వెళుతున్న ముగ్గురిని.. నెమ్మదిగా వెళ్లాలని చెప్పటమే పెద్ద తప్పుగా మారింది. అది కాస్తా పెద్ద గొడవగా మారటమే కాదు.. పలువురికి గాయాలు.. కారు తగలబడింది. పక్కనే ఉన్న బస్టాపు సైతం కాలిపోయిన ఉదంతం ఇప్పుడు పలు ప్రశ్నల్ని లేవనెత్తుతోంది.

పార్సిగుట్టకు చెందిన నలుగురు స్నేహితులు ఆదివారం అర్థరాత్రి వేళలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు టాటా సఫారి కారులో బయలుదేరి వెళ్లారు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో నిమజ్జనం పూర్తి చేసి తిరిగి వస్తున్నారు. ఇదే సమయంలో వారి వాహనం వెనుక నుంచి టూ వీలర్ మీద ముగ్గురు యువకులు యమా స్పీడ్ గా వెళుతున్న వైనాన్ని చూసి.. వారిని అంత వేగం ఎందుకని మందలించారు. దీంతో.. వారి మధ్య గొడవ మొదలైంది.

బైక్ మీద వెళుతున్న ముగ్గురు యువకులు.. కారులోని వారిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అదే సమయంలో కారు తగలబడటంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అదే సమయంలో ట్యాంక్ బండ్ మీద పలువురు నిమజ్జనం చేస్తున్నారు. దీంతో.. భయంతో పరుగులు తీశారు. దాదాపు ఈ ఉదంతం అరగంట పాటు సాగినా.. పోలీసులు అక్కడకు రాకపోవటం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారం సినిమా షూటింగ్ ను తలపించింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. కారు ఎలా తగలబడిందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

This post was last modified on September 1, 2020 11:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago