Political News

డ‌బ్బు ఖ‌ర్చుచేయ‌కుండా ఓట్లు రాల‌వు: ప‌వ‌న్

ఎన్నిక‌ల్లో డ‌బ్బులు ఖ‌ర్చు చేయ‌కండా ఓట్లు వేయ‌మంటే.. ఎవ‌రూ వేయ‌ర‌ని, ఈ విష‌యం త‌న‌కు తెలిసి వ‌చ్చింద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హించిన జ‌న‌సేన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. ప్ర‌తి ఒక్క జ‌నసేన కార్య‌క‌ర్త ఎన్నిక‌ల పోల్ మేనేజ్ మెంట్పై దృష్టి పెట్టాల‌ని.. ఎన్నిక‌ల సంఘ‌మే మ‌న‌కు 45 ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసుకునే అవ‌కాశం ఇచ్చింద‌న్నారు.

ఇంటి నుంచి పోలింగ్ బూత్ వ‌ర‌కు ఓట‌ర్ల‌ను చేయి ప‌ట్టి న‌డిపించేందుకు డ‌బ్బులు ఖ‌ర్చు చేయాల్సిందేనని చెప్పారు. జ‌న‌సేన‌-టీడీపీ కి మ‌ద్ద‌తుగా ఉన్న ప్ర‌తి ఒక్క‌రినీ గుర్తించే బాధ్య‌త‌ను పార్టీ నాయ‌కులు తీసుకోవాల‌న్నారు. వారు జ‌న‌సేన‌-టీడీపీకి ఓటు వేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు. ప‌దవులు ఆశించ‌వ‌ద్ద‌ని ఆయ‌న సూచించారు. త‌న‌కు ప‌ద‌వుల‌పై కాంక్ష లేద‌ని.. నాయ‌కులు కూడా మార్పును మాత్ర‌మే కోరుకోవాలి త‌ప్ప ప‌ద‌వులు కాద‌ని సూచించారు.

జ‌న‌సేన-టీడీపీ పొత్తుపై విమ‌ర్శ‌లు చేసేవారంతా వైసీపీ కోవ‌ర్టులేన‌ని గ‌తంలో చెప్పిన త‌న మాట‌కు కట్టుబ డే ఉన్నాన‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ఎవ‌రూ కూడా పొత్తుల‌పై చ‌ర్చ‌లు పెట్ట‌ద్ద‌ని సూచించారు. ఎన్నిక‌ల పైనే దృష్టి పెట్టాల‌ని.. రాష్ట్రంలో వైసీపీని గ‌ద్దె దించ‌డ‌మే ప‌నిగా ప‌నిచేయాలి త‌ప్ప‌.. ప‌ద‌వులు ఇస్తేనే.. టికెట్లు ఇస్తేనే ప‌నిచేస్తామ‌నే తర‌హా ఆలోచ‌న‌ల‌కు స్వ‌స్తి ప‌ల‌కాల‌ని సూచించారు. తాను ఓట‌మి నుంచి వ‌చ్చిన‌వాడిన‌ని.. త‌నను అంద‌రూ స్ఫూర్తిగా తీసుకోవాల‌ని సూచించారు.

ప్ర‌తి ఒక్క‌రికీ గుర్తింపు ద‌క్కేలా తాను బాధ్య‌త తీసుకుంటాన‌ని చెప్పారు. క్షేత్ర‌స్థాయిలో పాలు-తేనె మాదిరి గా టీడీపీతో జ‌న‌సేన నాయ‌కులు క‌లిసి ప‌నిచేయాల‌ని సూచించారు. పొర‌పొచ్చాలు రాకుండా చూసుకోవాలని.. చెప్పారు. వ‌చ్చే ప‌దేళ్ల‌పాటు ఉమ్మ‌డి ప్ర‌భుత్వం ఉండేలా కార్యాచ‌ర‌ణ‌కు న‌డుం బిగించాల‌న్నారు. ఎవ‌రిపైనా త‌న‌కు కోపం లేద‌ని.. జ‌గ‌న్‌పై వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు ఎలాంటి ద్వేషం లేద‌ని మ‌రోసారి చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంద‌ని.. ఇది ప్ర‌జ‌లే కోరుకుంటున్న ప్ర‌భుత్వ‌మ‌ని అన్నారు.

This post was last modified on December 7, 2023 9:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

2 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

2 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

4 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

4 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

5 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

5 hours ago