తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన.. రేవంత్రెడ్డికి అన్ని వర్గాల ప్రజల నుంచి అబినందనలు వెల్లువెత్తుతున్నాయి. సహజంగానే ఈ అభినందనలు వెల్లువెత్తితే.. చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ ఉండదు. కానీ, ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటూనే రేవంత్ వేసిన అడుగు, తీసుకున్న నిర్ణ యంవంటివి దుమ్మురేపేలా ఉండడంతోపాటు.. కొందరు ముఖ్యమంత్రులకు ఆదర్శంగా కూడా ఉండడం తో మరింతగా ఈ అభిమానం పెల్లుబుకుతుండడం గమనార్హం.
ప్రధానంగా.. ప్రగతి భవన్ను ప్రజా భవన్గా మారుస్తున్నామని.. అక్కడ నిర్మించిన బారికేడ్లు, ఇనుప కంచె ను తొలగిస్తున్నామని.. రేపటి నుంచి ప్రజలకు ఇది చేరువ అవుతుందని.. రేవంత్ ఎల్బీ వేదికగా చేసిన ప్రకటన.. సంచలనంగా మారింది. దీనిపట్లే ప్రజలు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రజలు కూడా ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్పై కక్షతోనో.. మరే ఉద్దేశంతోనో.. రేవంత్ సదరు ప్రగతి భవన్ను కూల్చేస్తామని ప్రకటిస్తే.. ఎవరూ అడ్డుకునేవారు కాదేమో!?
కానీ, ఆయన అలా ప్రకటించలేదు. తెలంగాణ ప్రజల సొమ్ముతో నిర్మించిన ఈ భవనాన్ని ఆ ప్రజలకే మరింత చేరువ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఓ ఐదేళ్ల వెనక్కి వెళ్తే.. 2019లో ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు.. తొలి నిర్నయం.. అప్పట్లో చంద్రబాబు నిర్మించిన ప్రజావేదిక(8 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించింది)ను కూల్చేయడం. ఇది.. ఇప్పుడు ఏపీ ప్రజలకు గుర్తుకు వచ్చింది. ఏపీ పాలకుల్లాగా.. రేవంత్ కూడా ఆలోచించి ఉంటే.. అని విస్మయానికి గురయ్యారు.
అనుభవం లేకున్నా.. వారసత్వ రాజకీయాలు రాకున్నా.. రేవంత్.. తొలి అడుగులు.. ప్రజాభ్యుదయం పథంగా ముందుకు పడ్డాయని.. కేసీఆర్పై పీకల వరకు కోపం ఉన్నా.. ప్రగతి భవన్ను ప్రజలకు చేరువ చేశారే తప్ప. .. ఏపీ పాలకుల మాదిరిగా విపక్షాల ఆనవాళ్లు లేకుండా చేయాలని తలపోయలేదని.. కూల్చివేతలతోనే పాలనను ప్రారంభించలేదని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ముందు ముందు ఇంకెన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటారో.. చూడాలని కామెంట్ చేస్తు్నారు.
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…