Political News

టీడీపీ స‌రికొత్త వ్యూహం… ఈ నెల 18 ముహూర్తం ఫిక్స్!

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక ఎత్తు.. ఇక నుంచి మ‌రో ఎత్తు.. అన్న‌ట్టుగా టీడీపీ వ్యూహం మార్చుకుంటోంది. ఈ నెల 17తో నారా లోకేష్ నిర్వ‌హిస్తున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర స‌మాప్తం కానుంది. నిజానికి ఇచ్ఛాపురం వ‌ర‌కు పాద‌యాత్ర నిర్వ‌హించాల‌ని అనుకున్నారు. కానీ, కొన్నిఅవాంత‌రాలు.. యాత్ర‌కు ఆటంకం క‌లిగించాయి. దీంతో ముందు వ‌డివ‌డిగా సాగి..షెడ్యూల్ క‌న్నా వేగంగా ముందుకు సాగిన యాత్ర ఆగిపోయింది. త‌ర్వాత‌.. గ‌త నెల 27న తిరిగి ప్రారంభించారు. అయితే.. ఇది కూడా తుఫాను కార‌ణంగా.. నిలిచిపోయింది. ఏదేమైనా.. ఎక్క‌డ వ‌ర‌కు న‌డిచామ‌న్న‌ది కాకుండా.. ఈ నెల 17తోనే దీనికి ముగింపు ప‌ల‌కాల‌ని మ‌రోసారి నిర్ణ‌యించారు.

17న ఎక్క‌డ పాద‌యాత్ర ఉంటే.. అక్క‌డ ముగింపు స‌భ పెట్టి.. త‌ర్వాత రోజు నుంచి పార్టీ కార్య‌క్రమాల్లో జోరు పెంచాల‌ని టీడీపీ నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి స‌ర్వం సిద్దం చేసింది. తాజాగా చంద్ర‌బాబు-జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల భేటీలోనూ ఈ అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. ఈ నెల 18 నుంచి ఉమ్మ‌డి కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టాల‌ని నిర్ణ‌యించారు. 17న జ‌ర‌గ‌నున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర ముగింపు స‌భ‌ను విజ‌యవంతం చేసే బాధ్య‌త‌ను ఇరు పార్టీలూ తీసుకున్నాయి. అనంత‌రం .. జిల్లాల స్థాయిలో ఇరు పార్టీల నాయ‌కులు సంయుక్తంగా నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌కు షెడ్యూల్ ఖ‌రారు చేయ‌నున్నారు.

జ‌న‌వ‌రి 15 త‌ర్వాత‌.. మండ‌ల‌స్థాయిలోనూ.. నియోజ‌క‌వ‌ర్గాల స్థాయిలో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. వారానికి ఒక చోట బ‌హిరంగ స‌భ‌లు.. గ్రామీణ ప్రాంతాల్లో వ‌లంటీర్ల త‌ర‌హాలో ఇరు పార్టీల నుంచి చ‌దువుకున్న‌వారిని ఎంపిక చేసి.. మెనిఫెస్టోపై అవ‌గాన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. ఇక‌, ఎన్నిక‌ల‌కు నెల‌రోజుల ముందు.. ఇరు పార్టీలూ.. సంయుక్తంగా.. రాష్ట్రంలో బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించి.. ప్ర‌జ‌ల‌ను కూట‌మి దిశ‌గా ముందుకు న‌డిపించాల‌ని నిర్ణ‌యించారు. అదేస‌మ‌యంలో క‌లిసి వ‌చ్చే పార్టీల‌ను ముందుగానే క‌లుపుకోవ‌డం ద్వారా.. వారి ఓట్ల‌ను కూడా స‌మీక‌రించాల‌ని భావిస్తున్నారు.

తెలంగాణ‌లో పొత్తులు చివ‌రి నిమిషం వ‌ర‌కు తేల‌క పోవ‌డంతో కొన్ని పార్టీలు న‌ష్ట‌పోయాయి. ఈ నేప‌థ్యంలో ఏపీలో అలాకాకుం డా.. ముందుగానే పొత్తులు పూర్తి చేసుకోవాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు. టికెట్ల కేటాయింపు సంగ‌తి ఎలా ఉన్నా.. నాయ‌కుల్లో మ‌నోధైర్యం, ఓటు బ్యాంకు స‌డ‌ల‌కుండా చూసుకోవ‌డం.. త‌ప్పుడు ఓట్ల‌ను తొల‌గించ‌డం.. ఇలా.. ప‌క్కా కార్యాచ‌ర‌ణ‌కు శ్రీకారం చుట్టాల‌ని, క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌ను బ‌లోపేతం చేయ‌డం ద్వారా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగాల‌ని న‌రి్ణ‌యించారు.

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

9 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

9 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

10 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

10 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

11 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

12 hours ago