Political News

టీడీపీ స‌రికొత్త వ్యూహం… ఈ నెల 18 ముహూర్తం ఫిక్స్!

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక ఎత్తు.. ఇక నుంచి మ‌రో ఎత్తు.. అన్న‌ట్టుగా టీడీపీ వ్యూహం మార్చుకుంటోంది. ఈ నెల 17తో నారా లోకేష్ నిర్వ‌హిస్తున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర స‌మాప్తం కానుంది. నిజానికి ఇచ్ఛాపురం వ‌ర‌కు పాద‌యాత్ర నిర్వ‌హించాల‌ని అనుకున్నారు. కానీ, కొన్నిఅవాంత‌రాలు.. యాత్ర‌కు ఆటంకం క‌లిగించాయి. దీంతో ముందు వ‌డివ‌డిగా సాగి..షెడ్యూల్ క‌న్నా వేగంగా ముందుకు సాగిన యాత్ర ఆగిపోయింది. త‌ర్వాత‌.. గ‌త నెల 27న తిరిగి ప్రారంభించారు. అయితే.. ఇది కూడా తుఫాను కార‌ణంగా.. నిలిచిపోయింది. ఏదేమైనా.. ఎక్క‌డ వ‌ర‌కు న‌డిచామ‌న్న‌ది కాకుండా.. ఈ నెల 17తోనే దీనికి ముగింపు ప‌ల‌కాల‌ని మ‌రోసారి నిర్ణ‌యించారు.

17న ఎక్క‌డ పాద‌యాత్ర ఉంటే.. అక్క‌డ ముగింపు స‌భ పెట్టి.. త‌ర్వాత రోజు నుంచి పార్టీ కార్య‌క్రమాల్లో జోరు పెంచాల‌ని టీడీపీ నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి స‌ర్వం సిద్దం చేసింది. తాజాగా చంద్ర‌బాబు-జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల భేటీలోనూ ఈ అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. ఈ నెల 18 నుంచి ఉమ్మ‌డి కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టాల‌ని నిర్ణ‌యించారు. 17న జ‌ర‌గ‌నున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర ముగింపు స‌భ‌ను విజ‌యవంతం చేసే బాధ్య‌త‌ను ఇరు పార్టీలూ తీసుకున్నాయి. అనంత‌రం .. జిల్లాల స్థాయిలో ఇరు పార్టీల నాయ‌కులు సంయుక్తంగా నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌కు షెడ్యూల్ ఖ‌రారు చేయ‌నున్నారు.

జ‌న‌వ‌రి 15 త‌ర్వాత‌.. మండ‌ల‌స్థాయిలోనూ.. నియోజ‌క‌వ‌ర్గాల స్థాయిలో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. వారానికి ఒక చోట బ‌హిరంగ స‌భ‌లు.. గ్రామీణ ప్రాంతాల్లో వ‌లంటీర్ల త‌ర‌హాలో ఇరు పార్టీల నుంచి చ‌దువుకున్న‌వారిని ఎంపిక చేసి.. మెనిఫెస్టోపై అవ‌గాన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. ఇక‌, ఎన్నిక‌ల‌కు నెల‌రోజుల ముందు.. ఇరు పార్టీలూ.. సంయుక్తంగా.. రాష్ట్రంలో బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించి.. ప్ర‌జ‌ల‌ను కూట‌మి దిశ‌గా ముందుకు న‌డిపించాల‌ని నిర్ణ‌యించారు. అదేస‌మ‌యంలో క‌లిసి వ‌చ్చే పార్టీల‌ను ముందుగానే క‌లుపుకోవ‌డం ద్వారా.. వారి ఓట్ల‌ను కూడా స‌మీక‌రించాల‌ని భావిస్తున్నారు.

తెలంగాణ‌లో పొత్తులు చివ‌రి నిమిషం వ‌ర‌కు తేల‌క పోవ‌డంతో కొన్ని పార్టీలు న‌ష్ట‌పోయాయి. ఈ నేప‌థ్యంలో ఏపీలో అలాకాకుం డా.. ముందుగానే పొత్తులు పూర్తి చేసుకోవాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు. టికెట్ల కేటాయింపు సంగ‌తి ఎలా ఉన్నా.. నాయ‌కుల్లో మ‌నోధైర్యం, ఓటు బ్యాంకు స‌డ‌ల‌కుండా చూసుకోవ‌డం.. త‌ప్పుడు ఓట్ల‌ను తొల‌గించ‌డం.. ఇలా.. ప‌క్కా కార్యాచ‌ర‌ణ‌కు శ్రీకారం చుట్టాల‌ని, క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌ను బ‌లోపేతం చేయ‌డం ద్వారా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగాల‌ని న‌రి్ణ‌యించారు.

This post was last modified on December 7, 2023 2:59 pm

Share
Show comments

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

2 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

3 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

3 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

5 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

5 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

7 hours ago