తెలంగాణలో జరిగిన తాజా ఎన్నికల్లో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ వివేకవంతమైన నిర్ణయం తీసుకుందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎప్పుడొచ్చావన్నది కాదు.. ఎంత బలంగా పనిచేశారన్నది ప్రధాన మన్న సూత్రీకరణే ప్రామాణికంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ క్రమంలో పార్టీని అన్ని విధాలా గట్టెక్కించిన రేవంత్ రెడ్డికే పగ్గాలు అప్పగించి.. సీఎం పీఠంపై కూర్చో బెట్టింది. ఇది యువతను, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను కూడా ఆకర్షించిన అంశం. సో.. మొత్తానికి తెలంగాణలో రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయారు.
ఇక, ఇప్పుడు మరో ఆసక్తికర చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. రేవంత్కు రాజకీయంగా అవకాశం కల్పించిన చంద్రబాబు.. ఏపీలో అధికారంలోకి వస్తే.. ఎలా ఉంటుంది? అనేది ప్రధాన చర్చ. దీనికి హేతువు కూడా ఉంది. రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయి. జల వివాదాల నుంచి విద్యుత్ సమస్యలు, ఉద్యోగుల వివాదాలు, విభజన సంస్థలు, ప్రాజెక్టుల నిర్మాణం.. వంటి అనేక విషయాల్లో సమస్యలు అలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటి పరిష్కారానికి గతంలో చంద్రబాబు హయాంలో కొంత ప్రయత్నం అయితే జరిగింది.
అయితే.. తెలంగాణలో కేసీఆర్ సర్కారు ఉండడంతో ఆ చర్చలు ముందుకు సాగలేదు. తర్వాత.. ఏపీలో ప్రభుత్వం మారి.. సీఎం జగన్ వచ్చినా.. కేసీఆర్ ఆయనకు మిత్రుడనే ప్రచారం ఉన్నా.. రాష్ట్రాల సమస్యలు ముందుకు సాగకపోగా.. మరింతగా పెరిగాయనే వాదన ఉంది. రాజకీయ ప్రయోజనాలే ప్రధానంగా పనిచేసుకున్నారని.. అటు ఇటు, రాష్ట్రాల ప్రతిపక్షాలు విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీకి సంబందించిన సమస్యలు.. తెలంగాణ అంశాలు.. ఈ రెండు కూడా ముడి పడకుండా అలానే ఉన్నాయి. దీంతో ఇప్పుడైనా పరిస్థితి మారాలనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం.
తెలంగాణలో రేవంత్ అధికారంలోకి రావడం.. కాంగ్రెస్ నాయకులు కూడా.. ఏపీ విషయంలో సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ఏపీలో చంద్రబాబు వస్తే.. మరింత సానుకూలత ఏర్పడి.. సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని మెజారిటీ వర్గాలు బావిస్తున్నారు. పైగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఇగో ప్రాబ్లెమ్స్ కూడా తప్పుతాయని అంటున్నారు. చంద్రబాబు అంటే.. రేవంత్కు ఉన్న గౌరవం.. రేవంత్ తన వాడేనన్న అభిమానం చంద్రబాబుకు ఉన్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మార్పులు తథ్యమని అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…