పార్టీ పరంగా చూసుకుంటే.. కాంగ్రెస్ అతి పెద్ద జాతీయ పార్టీ. పైగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అధికా రంలోకి రావాలని భావిస్తున్న పార్టీ కూడా. మరీ ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్ర విభజనతో.. ఏపీలో తీవ్రంగా నష్టపోయిన పార్టీ. అయితే.. ఇప్పుడు ఇచ్చామని చెబుతున్న తెలంగాణలో పదేళ్ల తర్వాత.. పార్టీ అధికా రంలోకి వచ్చింది. ఇక్కడ రేవంత్ను సీఎంను కూడా చేయనుంది. అయితే.. ఈ సమయంలోనే ఏపీలోనూ విస్తరించాలనేది పార్టీ ప్రణాళిక.
ఈ ప్రణాళిక ఎలా ఉన్నా.. ఏపీ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే రేవంత్ను కలిసేందుకు అప్పాయింట్మెం ట్ రెడీ చేసుకున్నారు. ఇప్పటికే రేవంత్తో చర్చించాల్సిన అంశాలను కూడా గిడుగు రుద్రరాజు వంటి నాయకులు రెడీ చేసుకుని ప్రిపేర్ కూడా అయ్యారు. వీటిలో ప్రధానంగా.. ప్రత్యేక హోదాకు.. రేవంత్ సహకరించాలనేది.. వారి ప్రధాన డిమాండ్. వచ్చే ఎన్నికల్లో ఏపీలో పార్టీ పుంజుకోవాలంటే.. దీనికి మించిన బ్రహ్మాస్త్రం లేదని ఏపీ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.
హోదా అంశాన్ని ఇప్పుడున్న ప్రధాన పార్టీలు వదిలేశాయని.. దీనిని అందిపుచ్చుకుని.. ఏపీలో పుంజుకు నేందుకు బాటలు వేసుకోవచ్చని.. నాయకులు లెక్కలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్పై ఒత్తిడి తేవాలనేది వారి ఉద్దేశం. ఎందుకంటే.. ఇప్పటికే.. ఏపీకి హోదా ఇవ్వడానికి వీల్లేదంటూ.. బీఆర్ ఎస్ తరఫున అప్పటి ఎంపీ కవిత.. సుప్రీంకోర్టులో కేసు వేశారు. అంతేకాదు.. పోలవరంపైనా కేసులు వేశారు. ఇవి ప్రభుత్వం తరఫునే ఆమె దాఖలు చేశారు.
దీంతో రేపు రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక.. హోదా.. పోలవరం రెండు అంశాలపైనా స్పందించాలని.. హోదాను అడ్డుకోకుండా.. చూడాలని.. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ముందుకు సాగాలనేది ఏపీ నేతల డిమాండ్. ఇక, రేవంత్ విషయానికి వస్తే.. పార్టీపరంగా చూసుకుంటే.. ఏపీలో డెవలప్ అయ్యేందుకు ఈ రెండు అంశాలు బాగానే పనిచేస్తాయి.
కానీ, తెలంగాణ రాష్ట్రపరంగా చూసుకుంటే.. అక్కడ ఆయనకు ప్రదాన చిక్కుముడిగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో ఎటువైపు స్పందించినా.. స్పందించకపోయినా.. ఆయనకు ఇబ్బందే కనుక.. వీటిపై నాన్చుడు ధోరణితోనే ముందుకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on December 6, 2023 5:48 pm
మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…
ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…
ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…