Political News

మీతో వేగ‌లేను.. సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ఏపీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా మంత్రుల‌ను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడారు. వీడి యో కాన్ఫ‌రెన్స్ ద్వారా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రుల‌ను ఆయ‌న లైన్‌లోకి తీసుకున్నారు. “చెప్పం డి.. మీ మీ ప్రాంతాల్లో తుఫాను న‌ష్టం ఎంత జ‌రిగింది? మీమీ ప్రాంతాల్లో ఎంత‌మందిని శిబిరాల‌కు త‌రలించారు. వైద్య ఆరోగ్య సేవ‌లు ఎలా ఉన్నాయి. శిబిరాల్లో ఉన్న‌వారికి స‌హాయ‌క చ‌ర్య‌లు అందుతున్నా యా? ” అని ఆరా తీశారు.

మ‌రీ ముఖ్యంగా రైతుల ప‌రిస్థితిని ప‌దే ప‌దే అడిగి తెలుసుకున్నారు. ధాన్యం ప‌లు ప్రాంతాల్లో త‌డిసి పోవ‌డం.. రైతులు క‌న్నీరు పెట్టుకోవ‌డం.. అదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష పార్టీలు.. వారిని ఓదార్చ‌డం.. వంటివి మీడియాలో ప్ర‌ముఖంగా వ‌చ్చాయి. ఈ అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న ముఖ్య‌మంత్రి వెను వెంట‌నే మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. వారి వారి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిస్థితుల‌ను ఆరా తీశారు.

అయితే ఒక్క చెల్లుబోయిన వేణు, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, నారాయ‌ణ స్వామి మిన‌హా.. ఎవ‌రూ స‌రైన విధంగా స్పందించ‌లేక పోయారని తెలిసింది. అంతేకాదు.. లెక్క‌లు కూడా చెప్ప‌లేక పోయారు. ఇక‌, స‌హాయ‌క శిబిరాలు ఎక్క‌డెక్క‌డ ఏర్పాటు చేశార‌న్న ప్ర‌శ్న‌ల‌కు.. అన్ని ప్ర‌భుత్వ స్కూళ్లలోనూ ఏర్పాటు చేశార‌ని చెప్పేశారు. కానీ, వాస్త‌వానికి చాలా వ‌ర‌కు ప్ర‌భుత్వ స్కూళ్లు.. నీట మున‌గడంతో తిరుప‌తి, చిత్తూరు, నెల్లూరులో ప్ర‌వేటు భ‌వ‌నాల‌ను అద్దెకు తీసుకుని.. అక్క‌డ స‌హాయ శిబిరాలు ఏర్పాటు చేశారు.

ఈ విష‌యం తెలియ‌ని మంత్రులు.. ప్ర‌భుత్వస్కూళ్ల‌లో ఏర్పాటు చేశార‌నే స‌రికి సీఎంకు చిర్రెత్తుకొచ్చింది. వెంట‌నే వారిపై మండిప‌డ్డారు. మీ తో వేగ‌లేను. ఒక్క కార్య‌క్ర‌మాన్ని కూడా మీరు స‌వ్యంగా నిర్వ‌హించ‌లేక‌పోతున్నారు. ఇప్పుడు ఆదుకోక‌పోతే.. గత నాలుగున్న‌ర సంవ‌త్స‌రాల్లో చేసిన మంచి తుఫాన్‌తో కొట్టుకుపోతుంది. ఇప్ప‌టికైనా వెళ్లండి. ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోండి! అని గ‌ట్టిగానే హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 6, 2023 5:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

56 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago