Political News

కాంగ్రెస్ ముందుంది ఇంకో పరీక్ష

తొందరలోనే కాంగ్రెస్ పార్టీ మరో పెద్ద పరీక్షను ఎదుర్కోబోతోంది. అదేమిటంటే లోక్ సభ ఎన్నికలు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్-మే నెలలో పార్లమెంటు ఎన్నికలు జరగాల్సుంది. అయితే తాజాగా ఐదు రాష్ట్రల్లో మూడింటిలో విజయంసాధించిన బీజేపీ మంచి ఊపుమీదుంది. కాబట్టి షెడ్యూల్ కన్నా ముందే ఎన్నికలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఒకవేళ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగినా ఇంక మిగిలున్నది పట్టుమరి ఐదు నెలలు మాత్రమే.

తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పడి కుదురుకోవటానికి కనీసం నెలరోజుల సమయం అవసరమవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ శాఖ పనితీరు ఎలాగుందో గమనించాలన్నా, ఒకదారికి తేవాలన్నా కనీసం ఐడాదికాలం పడుతుంది. అయితే ఇక్కడ అంత వ్యవధిలేదు. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ శాఖలను యుద్ధ ప్రాతిపదికను ప్రక్షాళన చేయాల్సుంటుంది. అన్నీ శాఖలను కాకపోయినా కనీసం ముఖ్యమైన శాఖలు అంటే జనాలకు ప్రతిరోజు పనుండే పోలీసు, రెవిన్యు, మున్సిపాలిటి, పంచాయితీరాజ్, వైద్యారోగ్యం లాంటి శాఖలపైన ముందుగా దృష్టి పెట్టాల్సుంటుంది.

వీటిల్లో కూడా పోలీసులు, రెవిన్యు, వైద్యారోగ్య శాఖలపైన ప్రతిరోజు ముఖ్యమంత్రి మానిటర్ చేయాల్సిందే. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ను ముందు సెట్ చేయాల్సుంటుంది. అలాగే ధరణి పోర్టల్ స్ధానంలో ప్రత్యామ్నాయంగా మెరుగైన వ్యవస్ధను ఏర్పాటుచేయాలంటే పెద్ద కసరత్తే జరగాలి. ఇది లక్షలాది మంది భూ యజమానులకు సంబంధించిన వ్యవహారం కాబట్టి టాప్ ప్రయారిటి ఇవ్వాలి. బీఆర్ఎస్+కేసీయార్ ఓటమిలో ధరణి పోర్టల్ కూడా కీలకపాత్ర పోషించిందనే చెప్పాలి. కాబట్టి దీనిపై ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటే అంతమంచిది.

ప్రత్యామ్నాయంగా తీసుకురాబోతున్న వ్యవస్ధ సక్రమంగా పనిచేసేదై ఉండటంతో పాటు తప్పులు దొర్లినపుడు గ్రామస్ధాయిలోనే దాన్ని రెక్టిఫ్ చేసేట్లుగా ఉండాలి. అప్పుడే జనాలు మెచ్చుకుంటారు. అనేక కారణాలతో కేసీయార్ ప్రభుత్వం పెట్టిన కేసుల్లో నిజమైనవి ఏవో, కక్షసాధింపుతో పెట్టినవి ఏవో చూడాలి. కక్షసాధింపుతో పెట్టిన కేసులుంటే వాటిని విత్ డ్రా చేసేయాలి. మరో రెండు నెలలపాటు చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి వార్ ఫుట్టింగ్ చర్యలు తీసుకుంటేనే తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు వస్తాయి లేకపోతే అంతే సంగతులు.

This post was last modified on December 6, 2023 12:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

15 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

59 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago