2 రోజుల ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు తెరదించింది. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హై కమాండ్ ఎన్నుకుందని కాంగ్రెస్ నేత కేసీ వేణు గోపాల్ అధికారికంగా ప్రకటించారు. సీఎల్పీ నేతగా ఎంపికైన రేవంత్ రెడ్డి ఈ నెల 7వ తేదీ ఉదయం 10.28 నిమిషాలకు తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆయన తెలిపారు. కేబినెట్ కూర్పుతో పాటు పోర్ట్ ఫోలియోల కేటాయింపుల కోసం రేవంత్ రెడ్డిని ఢిల్లీకి రావాలని పార్టీ హై కమాండ్ నుంచి ఆహ్వానం అందింది.
ఈ క్రమంలోనే బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సీఎల్పీ నేతగా, సీఎం అభ్యర్థిగా రేవంత్ పేరును కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని వేణుగోపాల్ చెప్పారు. రేవంత్ ఒక డైనమిక్ లీడర్ అని, పార్టీలోని సీనియర్ నాయకులతో కలిసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారని చెప్పారు. పార్టీ గెలుపు కోసం సీనియర్లతో కలిసి పకడ్బందీ వ్యూహాలను రచించారని ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు వేణుగోపాల్ ధన్యవాదాలు తెలిపారు.
రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం చాలా భిన్నంగా ఉంది. ఆర్ఎస్ఎస్ నేతగా తన ప్రస్థానం మొదలుబెట్టిన రేవంత్ రెడ్డి 2001-02 మధ్య టీఆర్ఎస్ కార్యకర్తగా పని చేయడం విశేషం. 2004లో కల్వకుర్తి టికెట్ ఆశించిన రేవంత్ కు నిరాశ తప్పలేదు. 2006లో జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా టికెట్ దక్కకపోవడంతో టీఆర్ఎస్ కు రేవంత్ గుడ్ బై చెప్పారు. 2008 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీలో చేరి యాక్టివ్గా పనిచేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు..రేవంత్ కు కొడంగల్ టికెట్ కేటాయించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడినా రేవంత్ రెడ్డి గెలిచారు. 2014 ఎన్నికల్లో కూడా గెలిచిన రేవంత్…2018లో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇపుడు నరేందర్ రెడ్డిని ఓడించి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు.
This post was last modified on December 5, 2023 8:07 pm
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…