Political News

కేసీయార్ సభకు వస్తారా ?

ఇపుడీ అంశంమీదే చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాగూ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతాయి. మహాయితే సమావేశాలు ఓ ఐదురోజులు జరిగితే ఎక్కువ. సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయన్నది ముఖ్యంకాదు. జరిగే సమావేశాలకు కేసీయార్ హాజరవుతారా లేదా అన్నదే కీలకం. ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పాటించాల్సిన కనీసపాటి ప్రోటోకాల్ ను కూడా పాటించలేదు. మామూలుగా ఓడిపోయిన తర్వాత రాజ్ భవన్ కు వెళ్ళి గవర్నర్ ను కలవటం ప్రోటోకాల్ మాత్రమే.

ఓడిపోయారు కాబట్టి కేసీయార్ గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖను అందిచాలి. ప్రభుత్వం ఏర్పడేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండమని గవర్నర్ కోరటం సంప్రదాయమే. అయితే కేసీయార్ ఇక్కడ హుందాగా నడుచుకోలేదు. గవర్నర్ ను కలవటానికి ఏమాత్రం ఇష్టపడలేదు. అందుకనే రాజీనామా లేఖను తన ఓఎస్డీకి ఇచ్చి పంపారు. ఓఎస్డీని గవర్నర్ వ్యక్తిగతంగా కలిశారా ? కలిస్తే గవర్నర్ ఏమన్నారు అన్న విషయాలు తెలీవు.

మొత్తానికి ప్రగతిభవన్ను ఖాళీచేసిన కేసీయార్ అట్నుంచి అటే ఫాం హౌస్ కు వెళ్ళిపోయారు. పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఇచ్చిన జనాలకు కనీసం ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా చెప్పకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారన్న విషయం బాగా అర్ధమవుతోంది. పార్టీ ఓడిపోవటమే కాకుండా వ్యక్తిగతంగా తాను కామారెడ్డిలో కూడా ఓడిపోయారు. బహుశా ఈ రెండింటి వల్ల కేసీయార్ జనాలపై బాగా మండుతున్నారేమో తెలీదు. ఎన్నికల్లో గెలుపోటములు చాలా సహజమన్న విషయాన్ని కేసీయార్ వ్యక్తిగతంగా చాలా అవమానంగా తీసుకున్నట్లు అర్ధమవుతోంది.

ఇక్కడే కేసీయార్ వైఖరిని చూసిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి హోదాలో అసలు అసెంబ్లీకి హాజరవుతారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసెంబ్లీకి హాజరైతే అక్కడ రేవంత్ రెడ్డిని ఫేస్ చేయాల్సుంటుంది. వీళ్ళద్దరి మధ్య సంబంధాలు ఉప్పు-నిప్పని అందరికీ తెలిసిందే. ఒకపుడు అసెంబ్లీలో రేవంత్ ను నోరెత్తనీయకుండా కేసీయార్ సస్పెండ్ చేయించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరిపుడు అవకాశం దొరికితే కేసీయార్ ను దెబ్బకు దెబ్బ తీయకుండా ఊరుకుంటారా ? ఆ విషయం కేసీయార్ ఊహించలేరా ? అందుకనే కేసీయార్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయమై అనుమానాలు పెరిగిపోతున్నది.

This post was last modified on December 5, 2023 11:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

2 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

4 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

8 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

9 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

9 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

10 hours ago