Political News

ఎంపీల లెక్క సరిపోయిందా ?

తాజాగా జరిగిన తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ తరపున పోటీచేసిన ఆరుగురు ఎంపీల లెక్క సరిపోయింది. లెక్కసరిపోవటం అంటే ముగ్గురు ఎంపీలు ఓడిపోయి మరో ముగ్గురు ఎంపీలు గెలిచారు. కాంగ్రెస్ తరపున ఎంపీలుగా ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంఎల్ఏలుగా పోటీచేసి గెలిచారు. అలాగే బీజేపీ తరపున పోటీచేసిన ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు ఓడిపోయారు.

రేవంత్ మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్నారు. తాజా ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో కొడంగల్, కామారెడ్డిలో పోటీచేశారు. సొంత నియోజకవర్గం కొడంగల్ లో గెలిచి కామారెడ్డిలో ఓడిపోయారు. అలాగే భువనగిరి ఎంపీ కోమటరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో పోటీచేసి గెలిచారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ అసెంబ్లీకి పోటీచేసి గెలిచారు. వీళ్ళల్లో రేవంత్ ముఖ్యమంత్రి అభ్యర్ధి రేసులో దూసుకుపోతున్నారు. మిగిలిన ఇద్దరిలో ఒకళ్ళు మంత్రివర్గంలో ఉండే అవకాశాలున్నాయి.

ఇక బీజేపీలో చూస్తే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ ఎంఎల్ఏగా పోటీచేసి ఓడిపోయారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు బోధ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయారు. నిజానికి ఈ ముగ్గురికి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయటం ఏమాత్రం ఇష్టంలేదు. అయితే సీనియర్లు ప్రత్యేకించి ఎంపీలందరు ఎంఎల్ఏలుగా పోటీచేయాల్సిందే అని అధిష్టానం ఆదేశించటంతో పోటీచేయక వీళ్ళకు తప్పలేదు. అయితే కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రమే పోటీచేయకుండా తప్పించుకున్నారు.

వీళ్ళు కాకుండా బీఆర్ఎస్ తరపున మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకరరెడ్డి దుబ్బాక అసెంబ్లీ నియోజకవకర్గంలో పోటీచేసి గెలిచారు. బీజేపీలోని ముగ్గురు ఎంపీలు ఓడిపోయి, కాంగ్రెస్ లోని ముగ్గురు ఎంపీలు గెలిచారంటే వీళ్ళ వ్యక్తిగత పనితీరు కూడా కారణమనే అనుకోవాలి. దీనికి అదనంగా కాంగ్రెస్ వేవ్ కొంత ఉండటం రేవంత్, కోమటరెడ్డి, ఉత్తమ్ గెలుపుకు సహకరించిందనే అనుకోవాలి. ఏదేమైనా రెండుపార్టీల్లోని ఎంపీల లెక్కయితే సరిపోయింది.

This post was last modified on December 5, 2023 11:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

3 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

5 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

9 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

10 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

10 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

10 hours ago