రాజకీయాల్లో నాయకులు అనుసరించని వ్యూహాలంటూ ఉండవు. సమయానికి తగిన విధంగా నాయకులు తమ వ్యూహాల కత్తులకు పదును పెడతారు. అందునా.. ఎన్నికలంటే మరింత ఎక్కువగా వ్యూహాలకు తెరదీ స్తారు. ఈ వ్యూహాలు అవి.. ఇవి.. అనే తేడా ఉండదు. సమయానికితగిన విధంగా ఏదైనా ఉండొచ్చు. గెలుపు గుర్రం ఎక్కడమే పరమావధి, ప్రత్యర్థిని చిత్తు చేయడమే మూల మంత్రం.
ఇదే ఫార్ములాను ఎంచుకున్నారు.. హుజరాబాద్ నుంచి విజయం దక్కించుకున్న పాడి కౌశిక్రెడ్డి. హుజూరా బాద్లో పాడి గెలుపు అంత ఈజీగా ఏమీ దక్కలేదు. పైగా.. కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకుడిగా పేరున్న ఈటల రాజేందర్తో పోటీ.. ఇప్పటికే ఒకసారి వెంటాడిన వోటమి. ఈ సారీ గెలవకపోతే.. నేరుగా కేసీఆర్కు దగ్గరకు వెళ్లే చనువుకు.. తెరపడే అవకాశం. మరో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిన దుస్థితి.
వెరసి మొత్తంగా.. పాడి కౌశిక్రెడ్డికి ప్రస్తుతం జరిగిన ఎన్నికల తాడోపేడో అన్నట్టుగా చావో రేవో అయిపో యాయి. అందుకే ఆయన ఆది నుంచి పక్కా ప్లాన్తోనే ముందుకు కదిలారు. నియోజకవర్గం ప్రజలను కలు సుకున్నారు. కుమార్తె, సతీమణితో కలిసి.. దణ్ణాలు పెట్టారు. ఓట్టు వేయమని అభ్యర్థించారు. అంతేకాదు.. ఆయన సతీమణి ఏకంగా జోలె కూడా పట్టింది. ఓటును అర్థించింది.
అయితే.. జనాలు నవ్వారు. చాల్చాలేవయ్యా! అన్నారు. దీంతో విసిగిపోయిన పాడి కౌశిక్రెడ్డి.. సెంటిమెంటు అస్త్రాన్ని ఒక్కసారిగా దూశారు. మరో రెండు గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా.. నన్ను గెలిపిస్తే.. జైత్ర యాత్ర.. లేకపోతే శవయాత్ర అంటూ.. సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన హుజూరాబాద్ నియోజకవర్గాన్ని కదిలించేసింది. అంతే అప్పటి వరకు ఫామ్లో ఉన్న మాజీ మంత్రి ఈటల కొట్టుకుపోయారు. ఫలితాల ఒరవడిలో పాడి గెలుపు గుర్రం ఎక్కారు.
చివరాఖరుకు..
చివరాఖరుకు.. చెప్పేదేంటంటే.. జనాలు దణ్ణాలు పెడితే.. కొంత వరకు మొగ్గుతారో.. జోలె పడితే ఇంకొంత మొగ్గుతారేమో… కానీ, సెంటిమెంటు అస్త్రానికి ఫుల్లుగా పడిపోతారన్నమాట.!
This post was last modified on December 4, 2023 5:57 pm
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…
ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి…
నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…