తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చిత్రమైన జంపింగుల వ్యవహారం అందరికీ తెలిసిందే. చివరి నిముషం వరకు కూడా నాయకులు పార్టీలు మారేసి.. జెండా మార్చేసి.. కండువాలు కప్పేసుకున్నారు. ఇలాంటి వారిలో కొందరు ఇప్పుడు అలమటిస్తున్నారు. అయ్యోమారకుండా ఉంటే బాగుండేది కదా! అని బాధపడుతున్నారు. దీనికి కారణం.. మారిన పార్టీ అధికారంలోకి రావడమే!
అదేవిధంగా పార్టీ ఓడిపోకుండా.. అధికారంలోకి వచ్చి ఉంటే.. కొందరు ఖచ్చితంగా మంత్రులు అయ్యేవా రు. వీరిలో తొలిసారి విజయం దక్కించుకున్న వారు ఎక్కువగా ఉన్నారు. వీరికి ఖచ్చితంగా మంత్రులు పదవి దక్కేది. ఈ మేరకు కేసీఆర్ సైతం వారికి హామీ ఇచ్చారని ప్రచారంలో ఉంది. అయితే.. అలాంటి పార్టీ ఓడిపోయింది. అధికారంలోకి రాకుండా పోయింది. ఈ రెండు వైరుధ్యాలు కూడా.. చిత్రంగా ఉన్నప్పటికీ నిజం.
బీఆర్ ఎస్ తరఫున తొలిసారి విజయం దక్కించుకున్న పాడి కౌశిక్రెడ్డి ఆవేదన అంతా ఇంతాకాదు. ఒక పెద్ద మెగా లీడర్ను ఓడించాననే ఆనందం ఉన్నా.. దీనికి తగిన ఫలితం మంత్రి పదవిని అందుకునే అవకాశం లేకుండా పోయింది. “నువ్వు పోయి.. గెలిచిరా.. మంత్రిని చేస్తా” అన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పటికీ పాడి చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో కసిపెట్టి ప్రచారం చేసి.. సెంటిమెంటు అస్త్రంతో గెలుపు గుర్రం ఎక్కారు. కానీ ప్రయోజనం లేదు. పార్టీ ఓడిపోవడంతో మంత్రి పదవి పోగొట్టుకున్నారు.
ఇక, కాంగ్రెస్ విషయానికి వస్తే.. “ఉండన్నా.. మేం చూసుకుంటాం. పార్టీ అధికారంలోకి రాగనే నీకు ప్రాధాన్యం ఉంటుంది” అని రేవంత్ ఎంత నచ్చజెప్పినా.. వినిపించుకోని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారిపోయారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆయన కనుక పార్టీ మారకుండా ఉండి ఉంటే.. ఏదో ఒక పదవి ఆయనకు దక్కడం ఖాయమని అంటున్నారు. సో.. ఇలా రెండు పార్టీల్లోనూ చాలా మంది ఉన్నారు. మొత్తానికి “పార్టీ ఓడి వీరు.. పార్టీ మారి వారు..” మంత్రిపదవులు పోగొట్టుకున్నారు.
This post was last modified on December 4, 2023 5:05 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…