తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చిత్రమైన జంపింగుల వ్యవహారం అందరికీ తెలిసిందే. చివరి నిముషం వరకు కూడా నాయకులు పార్టీలు మారేసి.. జెండా మార్చేసి.. కండువాలు కప్పేసుకున్నారు. ఇలాంటి వారిలో కొందరు ఇప్పుడు అలమటిస్తున్నారు. అయ్యోమారకుండా ఉంటే బాగుండేది కదా! అని బాధపడుతున్నారు. దీనికి కారణం.. మారిన పార్టీ అధికారంలోకి రావడమే!
అదేవిధంగా పార్టీ ఓడిపోకుండా.. అధికారంలోకి వచ్చి ఉంటే.. కొందరు ఖచ్చితంగా మంత్రులు అయ్యేవా రు. వీరిలో తొలిసారి విజయం దక్కించుకున్న వారు ఎక్కువగా ఉన్నారు. వీరికి ఖచ్చితంగా మంత్రులు పదవి దక్కేది. ఈ మేరకు కేసీఆర్ సైతం వారికి హామీ ఇచ్చారని ప్రచారంలో ఉంది. అయితే.. అలాంటి పార్టీ ఓడిపోయింది. అధికారంలోకి రాకుండా పోయింది. ఈ రెండు వైరుధ్యాలు కూడా.. చిత్రంగా ఉన్నప్పటికీ నిజం.
బీఆర్ ఎస్ తరఫున తొలిసారి విజయం దక్కించుకున్న పాడి కౌశిక్రెడ్డి ఆవేదన అంతా ఇంతాకాదు. ఒక పెద్ద మెగా లీడర్ను ఓడించాననే ఆనందం ఉన్నా.. దీనికి తగిన ఫలితం మంత్రి పదవిని అందుకునే అవకాశం లేకుండా పోయింది. “నువ్వు పోయి.. గెలిచిరా.. మంత్రిని చేస్తా” అన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పటికీ పాడి చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో కసిపెట్టి ప్రచారం చేసి.. సెంటిమెంటు అస్త్రంతో గెలుపు గుర్రం ఎక్కారు. కానీ ప్రయోజనం లేదు. పార్టీ ఓడిపోవడంతో మంత్రి పదవి పోగొట్టుకున్నారు.
ఇక, కాంగ్రెస్ విషయానికి వస్తే.. “ఉండన్నా.. మేం చూసుకుంటాం. పార్టీ అధికారంలోకి రాగనే నీకు ప్రాధాన్యం ఉంటుంది” అని రేవంత్ ఎంత నచ్చజెప్పినా.. వినిపించుకోని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారిపోయారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆయన కనుక పార్టీ మారకుండా ఉండి ఉంటే.. ఏదో ఒక పదవి ఆయనకు దక్కడం ఖాయమని అంటున్నారు. సో.. ఇలా రెండు పార్టీల్లోనూ చాలా మంది ఉన్నారు. మొత్తానికి “పార్టీ ఓడి వీరు.. పార్టీ మారి వారు..” మంత్రిపదవులు పోగొట్టుకున్నారు.
This post was last modified on December 4, 2023 5:05 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…