తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చిత్రమైన జంపింగుల వ్యవహారం అందరికీ తెలిసిందే. చివరి నిముషం వరకు కూడా నాయకులు పార్టీలు మారేసి.. జెండా మార్చేసి.. కండువాలు కప్పేసుకున్నారు. ఇలాంటి వారిలో కొందరు ఇప్పుడు అలమటిస్తున్నారు. అయ్యోమారకుండా ఉంటే బాగుండేది కదా! అని బాధపడుతున్నారు. దీనికి కారణం.. మారిన పార్టీ అధికారంలోకి రావడమే!
అదేవిధంగా పార్టీ ఓడిపోకుండా.. అధికారంలోకి వచ్చి ఉంటే.. కొందరు ఖచ్చితంగా మంత్రులు అయ్యేవా రు. వీరిలో తొలిసారి విజయం దక్కించుకున్న వారు ఎక్కువగా ఉన్నారు. వీరికి ఖచ్చితంగా మంత్రులు పదవి దక్కేది. ఈ మేరకు కేసీఆర్ సైతం వారికి హామీ ఇచ్చారని ప్రచారంలో ఉంది. అయితే.. అలాంటి పార్టీ ఓడిపోయింది. అధికారంలోకి రాకుండా పోయింది. ఈ రెండు వైరుధ్యాలు కూడా.. చిత్రంగా ఉన్నప్పటికీ నిజం.
బీఆర్ ఎస్ తరఫున తొలిసారి విజయం దక్కించుకున్న పాడి కౌశిక్రెడ్డి ఆవేదన అంతా ఇంతాకాదు. ఒక పెద్ద మెగా లీడర్ను ఓడించాననే ఆనందం ఉన్నా.. దీనికి తగిన ఫలితం మంత్రి పదవిని అందుకునే అవకాశం లేకుండా పోయింది. “నువ్వు పోయి.. గెలిచిరా.. మంత్రిని చేస్తా” అన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పటికీ పాడి చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో కసిపెట్టి ప్రచారం చేసి.. సెంటిమెంటు అస్త్రంతో గెలుపు గుర్రం ఎక్కారు. కానీ ప్రయోజనం లేదు. పార్టీ ఓడిపోవడంతో మంత్రి పదవి పోగొట్టుకున్నారు.
ఇక, కాంగ్రెస్ విషయానికి వస్తే.. “ఉండన్నా.. మేం చూసుకుంటాం. పార్టీ అధికారంలోకి రాగనే నీకు ప్రాధాన్యం ఉంటుంది” అని రేవంత్ ఎంత నచ్చజెప్పినా.. వినిపించుకోని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారిపోయారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆయన కనుక పార్టీ మారకుండా ఉండి ఉంటే.. ఏదో ఒక పదవి ఆయనకు దక్కడం ఖాయమని అంటున్నారు. సో.. ఇలా రెండు పార్టీల్లోనూ చాలా మంది ఉన్నారు. మొత్తానికి “పార్టీ ఓడి వీరు.. పార్టీ మారి వారు..” మంత్రిపదవులు పోగొట్టుకున్నారు.
This post was last modified on December 4, 2023 5:05 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…