తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసులరెడ్డి తన చాలెంజ్ ను నిలుపుకున్నారు. ఎన్నికలకు ముందు దాదాపు రెండు నెలల క్రితమే కేసీయార్ ను ఉద్దేశించి పొంగులేటి ఒక చాలెంజ్ చేశారు. అదేమిటంటే ఖమ్మం జిల్లాలో ఒక్క నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ ను గెలవనివ్వనని. తాజాగా వెల్లడైన పలితాల్లో జిల్లాలోని పది నియోజకవర్గాల్లో తొమ్మిది చోట్ల కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐలే గెలిచాయి. కేవలం ఒకే ఒక్క నియోజకవర్గం భద్రాచలంలో మాత్రం బీఆర్ఎస్ గెలిచింది.
తాజా ఫలితాలు చూసిన తర్వాత పొంగులేటి తన చాలెంజ్ ను నిలుపుకున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. పొంగులేటి చాలెంజ్ పై కేసీయార్ ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రస్తావించారు. పొంగులేటి చాలెంజ్ పై కేసీయార్ చాలా సెటైర్లు వేయటమే కాకుండా చాలా తక్కువ అంచనా వేశారు. అయితే ఫలితాలు చూసిన తర్వాత పొంగులేటిని అందరు శెభాష్ అనంటున్నారు. నిజానికి భద్రాచలంలో గెలిచిన తెల్లం వెంకటరావు కూడా పొంగులేటి మద్దతుదారుడే.
ఇక్కడ విషయం ఏమిటంటే ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లోను పొంగులేటికి అపారమైన పట్టుంది. ప్రతి నియోజకవర్గంలోను పొంగులేటికి పెద్దఎత్తున మద్దతుదారులున్నారు. 2014లో వైసీపీ తరపున పోటీచేస్తేనే ఒక ఎంపీతో పాటు ముగ్గురు ఎంఎల్ఏలు గెలిచారు. అప్పుడే పొంగులేటి పట్టేంటో బయటపడింది. తర్వాత తన పట్టును మరింతగా విస్తరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి, కమ్మ సామాజికవర్గాల్లో మంచి పట్టు సాధించారు. పొంగులేటిని దూరంచేసుకోవటమే కేసీయార్ చేసిన పెద్ద తప్పు. దీనికి అదనంగా తుమ్మల నాగేశ్వరరావును కూడా పార్టీలో నుండి వెళ్ళిపోయేట్లు చేశారు.
దాంతో పొంగులేటి, తుమ్మల ఇద్దరు కేసీయార్ కు వ్యతిరేకంగా తయారయ్యారు. అసలే జిల్లా అంతా మంచి పట్టున్న పొంగులేటికి తుమ్మల కూడా తోడయ్యారు. దాంతో ఇద్దరు కలిసి మొత్తం జిల్లాలోని తమ మద్దతుదారులను, అనుచరులు, క్యాడర్ను బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కూడగట్టారు. దాంతో పాలేరు, ఖమ్మంలో పొంగులేటి, తుమ్మల భారీ మెజారిటితో గెలవటమే కాకుండా మిగిలిన అభ్యర్దులను కూడా గెలిపించుకున్నారు. భద్రాచలంలో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్ధి తెల్లం వెంకటరావు కూడా పొంగులేటి మద్దతుదారుడే. కాబట్టి ఏదోరోజు తెల్లం కాంగ్రెస్ లోకి వచ్చేయటం ఖాయమనే ప్రచారం మొదలైంది.
తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం…
షాబాద్ లో ఆరుగురిని పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ దారుణంగా హత్య చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ NBK 111 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
వరస డిజాస్టర్లతో మార్కెట్ నే రిస్కులో పెట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. ఆగస్ట్…
స్టార్లు లేకపోయినా సరే ఏకంగా వంద కోట్ల బడ్జెట్లో భారీగా తెరకెక్కి, కళ్లు చెదిరే విజువల్స్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన…
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…