మొత్తానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లే కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగురవేసింది. ఆ పార్టీ స్పష్టమైన ఆదిక్యం సంపాదించడంతో టీఆర్ఎస్ కథ ముగిసింది. ఇరు పార్టీలకు సమాన సీట్లు వస్తే ఎంఐఎం మద్దతుతో.. ఎమ్మెల్యేల కొనుగోలుతో టీఆర్ఎసే అధికారంలోకి రావచ్చన్న అంచనాలు కూడా ఫలించలేదు. టిఆర్ఎస్ చాలా దూరంలో ఆగిపోయింది. కాంగ్రెస్ అధికారానికి అవసరమైన సీట్లు సొంతంగా సాధించింది. చాలా ముందుగానే ఫలితం తేలిపోవడంతో టిఆర్ఎస్ ఓటమిని అంగీకరించేసింది. ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా కూడా చేశారు.
అయితే నేరుగా గవర్నరును కలిసి రాజీనామాను సమర్పించడం ఆనవాయితీ. కానీ రాజ్ భవన్ కు వెళ్లకుండా తన రాజీనామా గవర్నరుకు చేరేలా చూశారు. అవమాన భారంతోనే ఆయన ఇలా చేశారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ ఓటమి తర్వాత కేసీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండడంపైనా విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెరాస పార్టీ పెట్టాక కేసీఆర్ ఎన్నో డక్కా మొక్కీలు తిన్నారు. ఓటములు చూశారు. ప్రతిపక్షంలో ఉంటూ కూడా రాజకీయ ప్రత్యర్థులపై పైచేయి సాధించడం.. అధికారంలో ఉన్న వారిని ఉక్కిరి బిక్కిరి చేయడం కేసీఆర్ కే చెల్లింది. అందుకు ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపించడమే. ఇక తెలంగాణ ఏర్పాటు అయ్యాక అధికారంలో వచ్చి పదేళ్లు పాలించిన కాలంలో కేసీఆర్ ఆధిపత్యం ఎలా సాగిందో అందరికీ తెలుసు.
పాలన, అభివృద్ధి విషయంలో ప్రశంసలు అందుకున్నప్పటికీ.. సచివాలయానికి రాని, ప్రజలను కలవని ముఖ్యమంత్రిగా ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. ఎవరేమన్నా తాను అనుకున్నదే చేశారు. ఎవరికి తలవంచిందే లేదు. అలాంటి నేత ఇప్పుడు ఎన్నికల్లో పరాభవం ఎదుర్కొన్నారు. ఈ స్థితిలో జనాల్లో తిరగడం, ప్రభుత్వంపై పోరాటం సాగించడం కేసీఆర్ కు కష్టమే. వయసు, ఆరోగ్యం కూడా ఆయన వైపు లేవు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. కొడుకు కేటీఆర్ కు పార్టీని అప్పగించి.. నెమ్మదిగా కేసీఆర్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా కేటీఆర్ ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే అనధికారికంగా రిటర్మెంట్ తీసుకున్నట్లే.
This post was last modified on December 4, 2023 8:45 am
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…