Political News

అల్లర్లతో అట్టుడికిపోతున్న చోటుకు వెళ్లనున్న ట్రంప్

అమెరికాలోని నల్లజాతీయుల మీద ఇటీవల కాలంలో జరుగుతున్న దాడులు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇటీవల నల్లజాతీయుడు జేకబ్ బ్లేక్ పైన పోలీసులు తుపాకీతో కాల్పులు జరపటం.. దీనికి సంబంధించి వీడియో ఒకటి వైరల్ గా మారింది. చేతిలో కత్తి లాంటి ఆయుధం ఉందన్న పేరుతో.. చుట్టూ మూగిన పోలీసులు ఆ వ్యక్తిపై కాల్పులు జరపటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ జేకబ్ ప్రాణాపాయస్థితిలోనే ఉన్నాడు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పలువురు నిరసనలు నిర్వహిస్తున్నారు. ఇక.. ఈ ఘటనకుకారణమైన కేనోషా పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇక్కడి వారు రోడ్లపైకి వచ్చి రాళ్లు రువ్వుతూ.. కనిపించిన వాహనాలకు నిప్పు పెడుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగిస్తున్నారు.

దీంతో.. కేనోషా పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. పోలీసుల చర్యను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న జో బైడెన్ ఈ అంశం మీద స్పందించారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. దీంతో.. అధ్యక్షుడు ట్రంప్ పై ఒత్తిడి పెరిగిపోయింది. ఆయన హయాంలో నల్లజాతీయుల మీద దాడులు ఎక్కువ అవుతున్నాయన్న ప్రచారం సాగుతోంది.

ఎన్నికలు ముంచుకొచ్చిన వేళ.. ఇలాంటి వాటిని వెంటనే ప్యాచప్ చేయాలన్న ఆలోచనలో ఉన్న ట్రంప్.. తీవ్ర ఉద్రిక్తలున్న కేనోషా పట్టణాన్ని తాను పర్యటించనున్నట్లుగా ట్రంప్ చెబుతున్నారు. అల్లర్లతో అట్టుడుగుతున్న ప్రాంతాన్ని చూసేందుకు ట్రంప్ చూపిస్తున్న ఉత్సాహాన్ని చూస్తే.. ఎన్నికలు ఎంతటి ప్రభావాన్ని చూపిస్తున్నాయన్న ఇట్టే అర్థం కాక మానదు.

This post was last modified on August 31, 2020 4:50 pm

Share

Recent Posts

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

44 minutes ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

2 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

2 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

2 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

3 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

4 hours ago