Political News

అల్లర్లతో అట్టుడికిపోతున్న చోటుకు వెళ్లనున్న ట్రంప్

అమెరికాలోని నల్లజాతీయుల మీద ఇటీవల కాలంలో జరుగుతున్న దాడులు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇటీవల నల్లజాతీయుడు జేకబ్ బ్లేక్ పైన పోలీసులు తుపాకీతో కాల్పులు జరపటం.. దీనికి సంబంధించి వీడియో ఒకటి వైరల్ గా మారింది. చేతిలో కత్తి లాంటి ఆయుధం ఉందన్న పేరుతో.. చుట్టూ మూగిన పోలీసులు ఆ వ్యక్తిపై కాల్పులు జరపటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ జేకబ్ ప్రాణాపాయస్థితిలోనే ఉన్నాడు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పలువురు నిరసనలు నిర్వహిస్తున్నారు. ఇక.. ఈ ఘటనకుకారణమైన కేనోషా పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇక్కడి వారు రోడ్లపైకి వచ్చి రాళ్లు రువ్వుతూ.. కనిపించిన వాహనాలకు నిప్పు పెడుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగిస్తున్నారు.

దీంతో.. కేనోషా పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. పోలీసుల చర్యను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న జో బైడెన్ ఈ అంశం మీద స్పందించారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. దీంతో.. అధ్యక్షుడు ట్రంప్ పై ఒత్తిడి పెరిగిపోయింది. ఆయన హయాంలో నల్లజాతీయుల మీద దాడులు ఎక్కువ అవుతున్నాయన్న ప్రచారం సాగుతోంది.

ఎన్నికలు ముంచుకొచ్చిన వేళ.. ఇలాంటి వాటిని వెంటనే ప్యాచప్ చేయాలన్న ఆలోచనలో ఉన్న ట్రంప్.. తీవ్ర ఉద్రిక్తలున్న కేనోషా పట్టణాన్ని తాను పర్యటించనున్నట్లుగా ట్రంప్ చెబుతున్నారు. అల్లర్లతో అట్టుడుగుతున్న ప్రాంతాన్ని చూసేందుకు ట్రంప్ చూపిస్తున్న ఉత్సాహాన్ని చూస్తే.. ఎన్నికలు ఎంతటి ప్రభావాన్ని చూపిస్తున్నాయన్న ఇట్టే అర్థం కాక మానదు.

This post was last modified on August 31, 2020 4:50 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

నీ ముగ్గురు భార్యలకూ టికెట్లు ఇప్పిస్తా .. ఓకేనా ?!

‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…

43 mins ago

ఈ రెండే హాట్ టాపిక్‌

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఏపీలో రెండు సంచ‌ల‌న విష‌యాల‌పై నెటిజ‌న్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జ‌గ‌న్ విదేశీ…

47 mins ago

మాఫియాల‌కు .. కౌంట్ డౌన్ మొద‌లైంది: మోడీ వార్నింగ్‌

ఏపీలో మాఫియాలు చెల‌రేగిపోతున్నాయ‌ని.. ఇసుక మాఫియా కార‌ణంగా అన్న‌మ‌య్య డ్యాం కొట్టుకుపోయింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో…

2 hours ago

త‌మ్ముడ‌ని కూడా చూడ‌వా అక్కా: అవినాష్ రెడ్డి

"నా అక్క‌లు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. త‌మ్ముడ‌ని కూడా చూడ‌కుండా మాట‌లు…

2 hours ago

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు రిలీఫ్‌

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. ఆయ‌న‌పై ఉన్న స‌స్పెన్ష‌న్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…

3 hours ago

బాహుబలి బ్రాండు విలువ ఎప్పటిదాకా

టాలీవుడ్ గమనాన్ని ఆసాంతం మార్చిన అతి కొద్ది సినిమాల్లో బాహుబలి స్థానం చాలా ప్రత్యేకం. అప్పటిదాకా మహా అయితే వంద…

4 hours ago