తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచితీరుతామని ఎంతో కాన్ఫిడెంట్గా ప్రకటించిన బీఆర్ ఎస్ ఓడిపోయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తమను ఏమీ చేయలేవని.. ప్రజల్లో బీఆర్ ఎస్ పట్ల అనుకూలత, సానుకూలత ఉందని సీఎం కేసీఆర్ నుంచి మంత్రి కేటీఆర్ వరకు అందరూ చెప్పారు. అయినా.. పార్టీ ఓడిపోయింది. అయితే.. దీనిపై నెటిజన్లు ఆసక్తికర విషయాన్ని వెలుగు లోకి తెచ్చి.. ట్రోల్స్ చేస్తున్నారు. “పార్టీలో ఐరన్ లెగ్ కాలుపెట్టింది. అందుకే ఓడిపోయింది!” అని వ్యాఖ్యానిస్తున్నారు.
బీఆర్ ఎస్ను జాతీయపార్టీగా ప్రకటించిన తర్వాత.. ఏపీ శాఖకు తోట చంద్రశేఖర్ను నియమించింది. అయితే.. ఈయనపై అప్పటికే ఐరన్లెగ్ అనే పేరుందని నెటిజన్లు చెబుతున్నారు. ఆయన ఎక్కడ అడుగు పెడితే.. ఆ పార్టీ నాశనమవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో తొలుత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు తోట. 2007లో ప్రారంభమైన ఈ పార్టీ కూడా తర్వాత కాలంలో కనుమరుగైంది. కనీసం అధికారంలోకి కూడా రాలేక పోయింది. 2014లో ప్రజారాజ్యం నుంచి వైసీపీలోకి తోట అడుగు పెట్టారు.
ఇక, ఆ సమయంలో అధికారంలోకి వస్తామని ఆశలు పెట్టుకున్న వైసీపీ కూడా.. ఓడిపోయింది. దీనికి కారణం.. తోటేనని వైసీపీ నాయకులు కూడా అప్పట్లో ప్రచారం చేశారు. ఇక, ఆ తర్వాత.. 2019లో ఇదే తోట చంద్రశేఖర్ పవర్ స్టార్ నేతృత్వంలోని జనసేన పార్టలో చేరారు. అంతేకాదు.. ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేశారుకూడా. కానీ, ఆ పార్టీ కూడా అప్పటి ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయింది. అనంతరం.. బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకుని ఏపీ పగ్గాలు అందుకున్నారు. మరి ఆయన మహిమో.. ఆయన ఐరన్ లెగ్ మహిమో తెలియదుకానీ.. బీఆర్ ఎస్ పదేళ్ల అధికారాన్ని చేజార్చుకుంది. ప్రస్తుతంఇదే విషయం నెటిజన్ల మధ్య ట్రోల్గా మారడం గమనార్హం.
This post was last modified on December 3, 2023 7:15 pm
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…