తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచితీరుతామని ఎంతో కాన్ఫిడెంట్గా ప్రకటించిన బీఆర్ ఎస్ ఓడిపోయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తమను ఏమీ చేయలేవని.. ప్రజల్లో బీఆర్ ఎస్ పట్ల అనుకూలత, సానుకూలత ఉందని సీఎం కేసీఆర్ నుంచి మంత్రి కేటీఆర్ వరకు అందరూ చెప్పారు. అయినా.. పార్టీ ఓడిపోయింది. అయితే.. దీనిపై నెటిజన్లు ఆసక్తికర విషయాన్ని వెలుగు లోకి తెచ్చి.. ట్రోల్స్ చేస్తున్నారు. “పార్టీలో ఐరన్ లెగ్ కాలుపెట్టింది. అందుకే ఓడిపోయింది!” అని వ్యాఖ్యానిస్తున్నారు.
బీఆర్ ఎస్ను జాతీయపార్టీగా ప్రకటించిన తర్వాత.. ఏపీ శాఖకు తోట చంద్రశేఖర్ను నియమించింది. అయితే.. ఈయనపై అప్పటికే ఐరన్లెగ్ అనే పేరుందని నెటిజన్లు చెబుతున్నారు. ఆయన ఎక్కడ అడుగు పెడితే.. ఆ పార్టీ నాశనమవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో తొలుత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు తోట. 2007లో ప్రారంభమైన ఈ పార్టీ కూడా తర్వాత కాలంలో కనుమరుగైంది. కనీసం అధికారంలోకి కూడా రాలేక పోయింది. 2014లో ప్రజారాజ్యం నుంచి వైసీపీలోకి తోట అడుగు పెట్టారు.
ఇక, ఆ సమయంలో అధికారంలోకి వస్తామని ఆశలు పెట్టుకున్న వైసీపీ కూడా.. ఓడిపోయింది. దీనికి కారణం.. తోటేనని వైసీపీ నాయకులు కూడా అప్పట్లో ప్రచారం చేశారు. ఇక, ఆ తర్వాత.. 2019లో ఇదే తోట చంద్రశేఖర్ పవర్ స్టార్ నేతృత్వంలోని జనసేన పార్టలో చేరారు. అంతేకాదు.. ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేశారుకూడా. కానీ, ఆ పార్టీ కూడా అప్పటి ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయింది. అనంతరం.. బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకుని ఏపీ పగ్గాలు అందుకున్నారు. మరి ఆయన మహిమో.. ఆయన ఐరన్ లెగ్ మహిమో తెలియదుకానీ.. బీఆర్ ఎస్ పదేళ్ల అధికారాన్ని చేజార్చుకుంది. ప్రస్తుతంఇదే విషయం నెటిజన్ల మధ్య ట్రోల్గా మారడం గమనార్హం.
This post was last modified on December 3, 2023 7:15 pm
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…