Political News

ప్రగతి భవన్ కాదు..ప్రజా భవన్: రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే తెలంగాణను కాంగ్రెస్ ‘హస్త’ గతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతాచారిని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఈ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 3న శ్రీకాంతాచారి తెలంగాణ కోసం అమరుడయ్యారని, అదే రోజున ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించుకున్నారని రేవంత్ అన్నారు.

ఈ గెలుపుతో కాంగ్రెస్ బాధ్యతను ప్రజలు మరింత పెంచారని చెప్పారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ స్ఫూర్తిని నింపారని, తనతో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పార్టీని ముందుకు నడిపించామని చెప్పారు. పార్టీలోని సీనియర్ నాయకులందరి సహాయ సహకారాలతోనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని రేవంత్ అన్నారు. సిపిఐ, సిపిఎం, టీజేఎస్ లతో కలిసి ముందుకు పోతామని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు బీఆర్ఎస్ సహకరిస్తుందని ఆశిస్తున్నట్టుగా రేవంత్ చెప్పారు. ఇక, ప్రగతి భవన్ పేరును డాక్టర్ అంబేద్కర్ ప్రజా భవన్ గా మారుస్తామని ఆయన అన్నారు.

అంతే కాకుండా సామాన్య ప్రజలందరికీ ప్రజాభవన్లో ప్రవేశం ఉంటుందని రేవంత్ చెప్పారు. ఇక, సచివాలయం గేట్లు కూడా అందరి కోసం తెరుచుకుంటాయని రేవంత్ క్లారిటీనిచ్చారు. ఇన్నాళ్లు తమకు అండగా నిలబడిన రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు అని, ఆయన అండతోనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్రావు ఠాక్రేకు ధన్యవాదాలు చెప్పిన రేవంత్ ఈ విజయంలో విజయశాంతి పోషించిన పాత్ర పట్ల కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని ఆమెకు కృతజ్ఞత తెలిపే అవకాశం రావడంతో ప్రజలు దానిని సద్వినియోగం చేసుకున్నారని రేవంత్ అన్నారు.

ప్రభుత్వ నిర్ణయాలపై హేతుబద్ధంగా వాదనలు వినిపించే అవకాశాన్ని ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి ప్రతిపక్షాలతో పాటు అందరినీ ఆహ్వానిస్తామని, కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని రేవంత్ అన్నారు.

This post was last modified on December 3, 2023 5:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

46 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

6 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago