తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం దక్కించుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ క్రెడిట్ మొత్తాన్ని రేవంత్ ఖాతాలో వేసేందుకు సీనియర్లు సైతం ఎవరూ వెనుకాడడం లేదు. అందరూ రేవంత్ను కొనియాడుతున్నారు. రేవంత్ ఇంటికి కీలక అధికారుల నుంచి రాజకీయ నేతల వరకు అందరూ క్యూ కడుతున్నారు.
ఇదిలావుంటే.. తెలంగాణలో కాంగ్రెస్ విజయం దక్కించుకోవడంతో.. ఏపీలోనూ సంబరాలు ఊపందుకు న్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంత తర్వాత.. తొలిసారి ఇక్కడ కాంగ్రెస్ విజయం దక్కించుకుని, అధికారంలోకి వచ్చే దిశగా అడుగులు వేసింది. ఇది.. తమకు కూడా లాభిస్తుందని.. తమపై ఉన్న కోపాన్ని కూడా తగ్గిస్తుందని ఏపీ కాంగ్రెస్ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున పలువురు ప్రచారం కూడా చేశారు.
తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ విజయం దక్కించుకోవడంతో.. ఏపీ కాంగ్రెస్ నాయకులు విజయవాడలో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచి, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పాల్గొన్నారు. ఇదిలావుంటే.. తెలంగాణలో గెలిచిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుందని.. బలమైన ప్రతిపక్షంగా అయినా.. మారుతుందని నాయకులు లెక్కలు వేసుకుంటుండడం గమనార్హం.
This post was last modified on December 3, 2023 3:47 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…