తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం దక్కించుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ క్రెడిట్ మొత్తాన్ని రేవంత్ ఖాతాలో వేసేందుకు సీనియర్లు సైతం ఎవరూ వెనుకాడడం లేదు. అందరూ రేవంత్ను కొనియాడుతున్నారు. రేవంత్ ఇంటికి కీలక అధికారుల నుంచి రాజకీయ నేతల వరకు అందరూ క్యూ కడుతున్నారు.
ఇదిలావుంటే.. తెలంగాణలో కాంగ్రెస్ విజయం దక్కించుకోవడంతో.. ఏపీలోనూ సంబరాలు ఊపందుకు న్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంత తర్వాత.. తొలిసారి ఇక్కడ కాంగ్రెస్ విజయం దక్కించుకుని, అధికారంలోకి వచ్చే దిశగా అడుగులు వేసింది. ఇది.. తమకు కూడా లాభిస్తుందని.. తమపై ఉన్న కోపాన్ని కూడా తగ్గిస్తుందని ఏపీ కాంగ్రెస్ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున పలువురు ప్రచారం కూడా చేశారు.
తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ విజయం దక్కించుకోవడంతో.. ఏపీ కాంగ్రెస్ నాయకులు విజయవాడలో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచి, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పాల్గొన్నారు. ఇదిలావుంటే.. తెలంగాణలో గెలిచిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుందని.. బలమైన ప్రతిపక్షంగా అయినా.. మారుతుందని నాయకులు లెక్కలు వేసుకుంటుండడం గమనార్హం.
This post was last modified on December 3, 2023 3:47 pm
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…