తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అయితే.. ఇంతలోనే బీఆర్ ఎస్కు చెందిన అభ్యర్థి, భద్రాచలం నుంచి విజయం దక్కించుకున్న ఎస్టీ నేత తెల్లం వెంకట్రావు పార్టీ మారుతున్నట్టు ప్రకటించేశారు. నిజానికి ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రిటర్నింగ్ అధికారులు గెలిచిన వారికి ధ్రువీకరణ పత్రాలు కూడా అందించాల్సి ఉంది.
అయినప్పటికీ.. తెల్లం వెంకట్రావు.. తొందరపడిపోయారు. ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎస్టీ నియో కవర్గం భద్రాచలం నుంచి బీఆర్ ఎస్ తరఫున పోటీ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ హవాలో అనేక మంది బీఆర్ ఎస్ నాయకులు ఓడిపోయినా.. తెల్లం మాత్రం విజయం దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఆనందం ఇంకా తీరకుండానే పోలింగ్ కేంద్రం వద్దే.. ఆయన తన అనుచరులతో సమావేశం అయిపోయారు.
ఆవెంటనే కొందరు ఆయనకు బీఆర్ ఎస్ ఓడిపోయిందని.. మనం కాంగ్రెస్లోకి వెళ్దామని అన్నారు. అంతే.. ఇక, తెల్లం కూడా.. ఓకే చెప్పారు. ఈ నెల 8వ తారీఖున నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా తెల్లం వెంకట్రావు ప్రకటించారు. అయితే.. ఈ విషయాన్ని బీఆర్ ఎస్ నాయకులు సీరియస్గా తీసుకున్నారు.
ఫలితాలు ప్రకటించకుండానే ఇలా జంపింగ్ మాటలు మాట్టాడడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. ఒకవేళ ఈసీకి ఫిర్యాదు చేసినా.. ప్రస్తుతం తెల్లం గెలుపు ఆగదు కానీ.. విత్హోల్డ్లో పడే చాన్స్ ఉంది. మొత్తానికి తెల్లం వెంకట్రావు చేసిన ప్రకటన రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. రాబోయే రెండు మూడు రోజుల్లో మరెంత మంది బయటకు వస్తారో చూడాలి.
This post was last modified on December 3, 2023 4:19 pm
సరైన సినిమాలు రాలేదనే కారణం స్పష్టంగా కనిపిస్తున్నా ఎన్నికల ప్రభావం బాక్సాఫీస్ మీద తీవ్రంగా పడిన మాట వాస్తవం. వార్…
ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమరం దాదాపు ముగిసింది. ఈ వార్త రాసే సమయానికి ఇంకా కొన్ని చోట్ల మాత్రమే పోలింగ్…
మంచు విష్ణు కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. కన్నప్ప. ఈ చిత్రాన్ని విష్ణు అనే కాదు.. మంచు ఫ్యామిలీనే…
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…