తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అయితే.. ఇంతలోనే బీఆర్ ఎస్కు చెందిన అభ్యర్థి, భద్రాచలం నుంచి విజయం దక్కించుకున్న ఎస్టీ నేత తెల్లం వెంకట్రావు పార్టీ మారుతున్నట్టు ప్రకటించేశారు. నిజానికి ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రిటర్నింగ్ అధికారులు గెలిచిన వారికి ధ్రువీకరణ పత్రాలు కూడా అందించాల్సి ఉంది.
అయినప్పటికీ.. తెల్లం వెంకట్రావు.. తొందరపడిపోయారు. ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎస్టీ నియో కవర్గం భద్రాచలం నుంచి బీఆర్ ఎస్ తరఫున పోటీ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ హవాలో అనేక మంది బీఆర్ ఎస్ నాయకులు ఓడిపోయినా.. తెల్లం మాత్రం విజయం దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఆనందం ఇంకా తీరకుండానే పోలింగ్ కేంద్రం వద్దే.. ఆయన తన అనుచరులతో సమావేశం అయిపోయారు.
ఆవెంటనే కొందరు ఆయనకు బీఆర్ ఎస్ ఓడిపోయిందని.. మనం కాంగ్రెస్లోకి వెళ్దామని అన్నారు. అంతే.. ఇక, తెల్లం కూడా.. ఓకే చెప్పారు. ఈ నెల 8వ తారీఖున నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా తెల్లం వెంకట్రావు ప్రకటించారు. అయితే.. ఈ విషయాన్ని బీఆర్ ఎస్ నాయకులు సీరియస్గా తీసుకున్నారు.
ఫలితాలు ప్రకటించకుండానే ఇలా జంపింగ్ మాటలు మాట్టాడడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. ఒకవేళ ఈసీకి ఫిర్యాదు చేసినా.. ప్రస్తుతం తెల్లం గెలుపు ఆగదు కానీ.. విత్హోల్డ్లో పడే చాన్స్ ఉంది. మొత్తానికి తెల్లం వెంకట్రావు చేసిన ప్రకటన రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. రాబోయే రెండు మూడు రోజుల్లో మరెంత మంది బయటకు వస్తారో చూడాలి.
This post was last modified on December 3, 2023 4:19 pm
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…