తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అయితే.. ఇంతలోనే బీఆర్ ఎస్కు చెందిన అభ్యర్థి, భద్రాచలం నుంచి విజయం దక్కించుకున్న ఎస్టీ నేత తెల్లం వెంకట్రావు పార్టీ మారుతున్నట్టు ప్రకటించేశారు. నిజానికి ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రిటర్నింగ్ అధికారులు గెలిచిన వారికి ధ్రువీకరణ పత్రాలు కూడా అందించాల్సి ఉంది.
అయినప్పటికీ.. తెల్లం వెంకట్రావు.. తొందరపడిపోయారు. ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎస్టీ నియో కవర్గం భద్రాచలం నుంచి బీఆర్ ఎస్ తరఫున పోటీ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ హవాలో అనేక మంది బీఆర్ ఎస్ నాయకులు ఓడిపోయినా.. తెల్లం మాత్రం విజయం దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఆనందం ఇంకా తీరకుండానే పోలింగ్ కేంద్రం వద్దే.. ఆయన తన అనుచరులతో సమావేశం అయిపోయారు.
ఆవెంటనే కొందరు ఆయనకు బీఆర్ ఎస్ ఓడిపోయిందని.. మనం కాంగ్రెస్లోకి వెళ్దామని అన్నారు. అంతే.. ఇక, తెల్లం కూడా.. ఓకే చెప్పారు. ఈ నెల 8వ తారీఖున నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా తెల్లం వెంకట్రావు ప్రకటించారు. అయితే.. ఈ విషయాన్ని బీఆర్ ఎస్ నాయకులు సీరియస్గా తీసుకున్నారు.
ఫలితాలు ప్రకటించకుండానే ఇలా జంపింగ్ మాటలు మాట్టాడడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. ఒకవేళ ఈసీకి ఫిర్యాదు చేసినా.. ప్రస్తుతం తెల్లం గెలుపు ఆగదు కానీ.. విత్హోల్డ్లో పడే చాన్స్ ఉంది. మొత్తానికి తెల్లం వెంకట్రావు చేసిన ప్రకటన రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. రాబోయే రెండు మూడు రోజుల్లో మరెంత మంది బయటకు వస్తారో చూడాలి.
సినిమాలను అడ్డుకోవడం లేదా బ్యాన్ చేయడం వల్ల వాటి క్రేజ్ తగ్గడం పక్కన పెడితే నెటిజన్లలో క్యూరియాసిటీ మరింత పెరుగుతుందని…
బాలీవుడ్లో ఒకప్పుడు కంగనా రనౌత్కు తిరుగులేని స్టార్ ఇమేజ్, మార్కెట్ ఉండేది. కానీ వరుస ఫ్లాపులకు తోడు ఆమె వ్యక్తిగత ప్రవర్తన కారణంగా…
రాఘవ లారెన్స్ అంటే మొదట స్టార్ కొరియోగ్రాఫర్. తర్వాత అతను నటుడిగా మారి కొన్ని సినిమాలు చేశాడు. అంత వరకు…
బాలీవుడ్ బిగ్గెస్ట్ విజువల్ గ్రాండియర్ గా ప్రచారంలో ఉన్న రామాయణ పార్ట్ 1 దీపావళి విడుదలకు రెడీ అవుతోంది. ఇంకా…
బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్లో కొనసాగుతున్న…
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…