కనీ వినీ ఎరుగని ఆనందం.. ఊహకు కూడా అందని విజయానందం.. తెలంగాణ ఇచ్చామని చెప్పుకోవడమే తప్ప.. అధికారంలోకి వచ్చే దిశగా ఆ మేరకు సాధన చేయలేని అంతర్గత కుమ్ములాటలతో అలసిసొలిసిన కాంగ్రెస్లో ఇప్పుడు అంబరాన్నంటిన ఆనందం.. రేవంత్రెడ్డి సారథ్యంలో కలిసి కట్టుగా ఒక్కుమ్మడిగా సాగించిన పోరు.. అందించిన విజయానందం!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో మేజిక్ ఫిగర్ 60 ని దాటేసి మరో ఏడు స్థానాల్లో గెలుపు దిశగా దూసుకుపోతున్న కాంగ్రెస్లో ప్రతి నాయకుడు ఆనందంగానే ఉన్నారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని రేవంత్ సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ఆయన ఏదైతే చెప్పుకొచ్చారో.. ఇప్పుడు కూడా అదే మాట నిలబెట్టుకునే తీరుగా ప్రజలకు సందేశం పంపించారు.
అగ్ని కీలల్లో ఆహుతవుతూ తెలంగాణ ఆకాంక్షలను ఆకాశమంత ఎత్తున నిలిపిన అమరులకు జోహార్లు అంటూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. “అగ్ని కీలల్లో ఆహుతవుతూ తెలంగాణ ఆకాంక్షలను ఆకాశమంత ఎత్తున నిలిపిన అమరులకు జోహార్లు. శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ అమరుల ఆశయాలు, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు ఫలించే సమయం ఆసన్నమైంది’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.
This post was last modified on December 3, 2023 1:58 pm
తెలుగు ప్రేక్షకులకు కార్తీ అనగానే ఠక్కున గుర్తొచ్చే సినిమా ఖైదీ. అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయం సాధించి అక్కడి…
మలయాళ ఇండస్ట్రీ బాక్సాఫీస్ లెక్కల్ని ఎప్పటికప్పుడు సవరిస్తూ ఉండే హీరో.. మోహన్ లాల్. ఆ ఇండస్ట్రీలో కలెక్షన్ల రికార్డుల్లో చాలా…
2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీలో కూటమి పార్టీలకు చెందిన శ్రేణుల నుంచి ఓ వినూత్న నినాదం వినిపించింది. సైకో…
బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ మీద జరిగిన రివ్యూలు, ఆన్ లైన్ విశ్లేషణలు, సోషల్…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడు సార్లు ఏపీకి వచ్చారు. అంటే.. కేవలం…
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే ఎంటర్ టైనర్ కోసం హీరోయిన్ వేట కొనసాగుతోంది. ఏవేవో పేర్లు అనుకుని…