కనీ వినీ ఎరుగని ఆనందం.. ఊహకు కూడా అందని విజయానందం.. తెలంగాణ ఇచ్చామని చెప్పుకోవడమే తప్ప.. అధికారంలోకి వచ్చే దిశగా ఆ మేరకు సాధన చేయలేని అంతర్గత కుమ్ములాటలతో అలసిసొలిసిన కాంగ్రెస్లో ఇప్పుడు అంబరాన్నంటిన ఆనందం.. రేవంత్రెడ్డి సారథ్యంలో కలిసి కట్టుగా ఒక్కుమ్మడిగా సాగించిన పోరు.. అందించిన విజయానందం!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో మేజిక్ ఫిగర్ 60 ని దాటేసి మరో ఏడు స్థానాల్లో గెలుపు దిశగా దూసుకుపోతున్న కాంగ్రెస్లో ప్రతి నాయకుడు ఆనందంగానే ఉన్నారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని రేవంత్ సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ఆయన ఏదైతే చెప్పుకొచ్చారో.. ఇప్పుడు కూడా అదే మాట నిలబెట్టుకునే తీరుగా ప్రజలకు సందేశం పంపించారు.
అగ్ని కీలల్లో ఆహుతవుతూ తెలంగాణ ఆకాంక్షలను ఆకాశమంత ఎత్తున నిలిపిన అమరులకు జోహార్లు అంటూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. “అగ్ని కీలల్లో ఆహుతవుతూ తెలంగాణ ఆకాంక్షలను ఆకాశమంత ఎత్తున నిలిపిన అమరులకు జోహార్లు. శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ అమరుల ఆశయాలు, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు ఫలించే సమయం ఆసన్నమైంది’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.
This post was last modified on December 3, 2023 1:58 pm
అన్యోన్య కాపురమే.. వైవాహిక బంధానికి.. చూడముచ్చటైన జంటకు.. నిదర్శనం. అయితే.. కారణాలు ఏవైనా ఇప్పుడు ఈ బంధానికి ఇప్పుడు `స్లీప్…
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 2026-27 వార్షిక బడ్జెట్ను ఈ నెల 20 లేదా 21న సభలో…
నిన్న జరిగిన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక పాయింట్ ఇండస్ట్రీ వర్గాలతో…
ఈ నెల 19న జరిగే ఉగాది తర్వాత ఏ క్షణమైనా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన…
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయాలపై జనసేన పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ నాగబాబుకు ఇంకా మక్కువ పోలేదని…
సాధారణంగా జనావాసాలు ఉండే నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆయా కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది…