‘మార్పు’ అంటే ఊహించేందుకే భయపడిన పరిస్థితి. పార్టీలో ఎవరు ఎగస్పార్టీ అవుతారో.. ఎవరిని అక్కు న చేర్చుకుంటే ఎవరు జారిపోతారో.. అనే బెంగ. అయినప్పటికీ.. పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్లే నాయకుడు కావాలి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెను సాహసమే చేసింది. తమ పార్టీ కాని నాయకుడిని. నిన్నమొన్నటి వరకు తమపై విరుచుకుపడిన నాయకుడిని.. తమ పార్టీలో చేర్చుకుని.. పెద్దపీట వేసింది.
దశాబ్దాలుగా పార్టీలోనే ఉన్నామని.. పార్టీతో అనుబంధం పెంచుకున్నామని చెబుతూనే.. పార్టీకి గోతులు తవ్వుతున్నారని భావించిన నాయకులను ఏమైనా కానీ.. అనే తెగింపుతో పక్కన పెట్టింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా రేవంత్రెడ్డి తెరమీదికి వచ్చారు. ఫైర్బ్రాండ్. అనే ట్యాగ్ సొంతం చేసుకున్న రేవంత్కు మొదట్లో అనేక మంది నాయకులు ఎసరు పెట్టే ప్రయత్నమే చేశారు. ఆయన మొహం చూడను. ఆయన ఉంటే గాంధీ భవన్కు వెళ్లను అని భీష్మించిన నాయకులు ఉన్నారు.
‘రేవంత్ ఎవడు? వానెవణ్నో తెచ్చి.. చేస్తే.. మేం చేతులు కట్టుకోవాల్నా!’ అన్న మాటలు కూడా ఇప్పటికీ వినిపిస్తూనేఉన్నాయి. అయినా.. తనకు అప్పగించిన బాధ్యతలను తూ.చ. తప్పకుండా.. తన పీఠానికి ఉన్న అధికారాలను కూడా తగ్గించుకుని రేవంత్ నాలుగు మెట్లు దిగి వచ్చారు. ఫలితంగా.. దాదాపు ఎన్నికలకు ముందు అసంతృప్తులు తగ్గించారు. చిన్నా చితకా ఉంటే.. వాటిని కూడా సరిచేసేందుకు చాలానే శ్రమించారు.
కట్ చేస్తే.. రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తొలిసారి చరిత్ర సృష్టించింది. తెలంగాణ ఇచ్చామని చెప్పుకొన్న పార్టీ ఇప్పుడు గర్వంగా తలెత్తుకుని.. అధికార పీఠం అధిష్టించే సమయం వచ్చేసింది. తాజా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఈ ఫలితం.. ఈ దూకుడు.. ఖచ్చితంగా.. రేవంత్ మంత్రం పలించబట్టేనని అంటున్నారు పరిశీలకులు. ఈవిషయంలో సాహసం చేసిన కాంగ్రెస్ అధిష్టానంతోపాటు.. అంతే కష్టపడిన రేవంత్కు కూడాఫలితం దక్కుతుందని చెబుతున్నారు.
This post was last modified on December 3, 2023 1:11 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…