‘మార్పు’ అంటే ఊహించేందుకే భయపడిన పరిస్థితి. పార్టీలో ఎవరు ఎగస్పార్టీ అవుతారో.. ఎవరిని అక్కు న చేర్చుకుంటే ఎవరు జారిపోతారో.. అనే బెంగ. అయినప్పటికీ.. పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్లే నాయకుడు కావాలి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెను సాహసమే చేసింది. తమ పార్టీ కాని నాయకుడిని. నిన్నమొన్నటి వరకు తమపై విరుచుకుపడిన నాయకుడిని.. తమ పార్టీలో చేర్చుకుని.. పెద్దపీట వేసింది.
దశాబ్దాలుగా పార్టీలోనే ఉన్నామని.. పార్టీతో అనుబంధం పెంచుకున్నామని చెబుతూనే.. పార్టీకి గోతులు తవ్వుతున్నారని భావించిన నాయకులను ఏమైనా కానీ.. అనే తెగింపుతో పక్కన పెట్టింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా రేవంత్రెడ్డి తెరమీదికి వచ్చారు. ఫైర్బ్రాండ్. అనే ట్యాగ్ సొంతం చేసుకున్న రేవంత్కు మొదట్లో అనేక మంది నాయకులు ఎసరు పెట్టే ప్రయత్నమే చేశారు. ఆయన మొహం చూడను. ఆయన ఉంటే గాంధీ భవన్కు వెళ్లను అని భీష్మించిన నాయకులు ఉన్నారు.
‘రేవంత్ ఎవడు? వానెవణ్నో తెచ్చి.. చేస్తే.. మేం చేతులు కట్టుకోవాల్నా!’ అన్న మాటలు కూడా ఇప్పటికీ వినిపిస్తూనేఉన్నాయి. అయినా.. తనకు అప్పగించిన బాధ్యతలను తూ.చ. తప్పకుండా.. తన పీఠానికి ఉన్న అధికారాలను కూడా తగ్గించుకుని రేవంత్ నాలుగు మెట్లు దిగి వచ్చారు. ఫలితంగా.. దాదాపు ఎన్నికలకు ముందు అసంతృప్తులు తగ్గించారు. చిన్నా చితకా ఉంటే.. వాటిని కూడా సరిచేసేందుకు చాలానే శ్రమించారు.
కట్ చేస్తే.. రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తొలిసారి చరిత్ర సృష్టించింది. తెలంగాణ ఇచ్చామని చెప్పుకొన్న పార్టీ ఇప్పుడు గర్వంగా తలెత్తుకుని.. అధికార పీఠం అధిష్టించే సమయం వచ్చేసింది. తాజా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఈ ఫలితం.. ఈ దూకుడు.. ఖచ్చితంగా.. రేవంత్ మంత్రం పలించబట్టేనని అంటున్నారు పరిశీలకులు. ఈవిషయంలో సాహసం చేసిన కాంగ్రెస్ అధిష్టానంతోపాటు.. అంతే కష్టపడిన రేవంత్కు కూడాఫలితం దక్కుతుందని చెబుతున్నారు.
This post was last modified on December 3, 2023 1:11 pm
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…