‘మార్పు’ అంటే ఊహించేందుకే భయపడిన పరిస్థితి. పార్టీలో ఎవరు ఎగస్పార్టీ అవుతారో.. ఎవరిని అక్కు న చేర్చుకుంటే ఎవరు జారిపోతారో.. అనే బెంగ. అయినప్పటికీ.. పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్లే నాయకుడు కావాలి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెను సాహసమే చేసింది. తమ పార్టీ కాని నాయకుడిని. నిన్నమొన్నటి వరకు తమపై విరుచుకుపడిన నాయకుడిని.. తమ పార్టీలో చేర్చుకుని.. పెద్దపీట వేసింది.
దశాబ్దాలుగా పార్టీలోనే ఉన్నామని.. పార్టీతో అనుబంధం పెంచుకున్నామని చెబుతూనే.. పార్టీకి గోతులు తవ్వుతున్నారని భావించిన నాయకులను ఏమైనా కానీ.. అనే తెగింపుతో పక్కన పెట్టింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా రేవంత్రెడ్డి తెరమీదికి వచ్చారు. ఫైర్బ్రాండ్. అనే ట్యాగ్ సొంతం చేసుకున్న రేవంత్కు మొదట్లో అనేక మంది నాయకులు ఎసరు పెట్టే ప్రయత్నమే చేశారు. ఆయన మొహం చూడను. ఆయన ఉంటే గాంధీ భవన్కు వెళ్లను అని భీష్మించిన నాయకులు ఉన్నారు.
‘రేవంత్ ఎవడు? వానెవణ్నో తెచ్చి.. చేస్తే.. మేం చేతులు కట్టుకోవాల్నా!’ అన్న మాటలు కూడా ఇప్పటికీ వినిపిస్తూనేఉన్నాయి. అయినా.. తనకు అప్పగించిన బాధ్యతలను తూ.చ. తప్పకుండా.. తన పీఠానికి ఉన్న అధికారాలను కూడా తగ్గించుకుని రేవంత్ నాలుగు మెట్లు దిగి వచ్చారు. ఫలితంగా.. దాదాపు ఎన్నికలకు ముందు అసంతృప్తులు తగ్గించారు. చిన్నా చితకా ఉంటే.. వాటిని కూడా సరిచేసేందుకు చాలానే శ్రమించారు.
కట్ చేస్తే.. రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తొలిసారి చరిత్ర సృష్టించింది. తెలంగాణ ఇచ్చామని చెప్పుకొన్న పార్టీ ఇప్పుడు గర్వంగా తలెత్తుకుని.. అధికార పీఠం అధిష్టించే సమయం వచ్చేసింది. తాజా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఈ ఫలితం.. ఈ దూకుడు.. ఖచ్చితంగా.. రేవంత్ మంత్రం పలించబట్టేనని అంటున్నారు పరిశీలకులు. ఈవిషయంలో సాహసం చేసిన కాంగ్రెస్ అధిష్టానంతోపాటు.. అంతే కష్టపడిన రేవంత్కు కూడాఫలితం దక్కుతుందని చెబుతున్నారు.
This post was last modified on December 3, 2023 1:11 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…