2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గాఅభివర్ణించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మొదలైన ఓట్ల లెక్కింపుతో అందరి చూపు ఇప్పుడు ఎన్నికల ఫలితాల మీదే ఉంది. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ఉంది. దీంతో.. తెలుగువారంతా ఎన్నికల ఫలితాల కోసం తీవ్రమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితం రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ సమీకరణాల్ని మారుస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో వీక్షకులు పెద్ద ఎత్తున టీవీ చానళ్లను వీక్షిస్తున్నారు. ఈ రోజు ఆదివారం కావటంతో అందరి చూపు ఎన్నికల ఫలితాల మీదే ఉంది. దీనికి తోడు.. మొబైల్ వినియోగం పెద్ద ఎత్తున పెరిగిన నేపథ్యంలో పలువురు కేంద్ర ఎన్నికల కమిషన్ కు చెందిన ప్రధాన వెబ్ సైట్ ను ఫలితాల కోసం చూస్తున్నారు. దీంతో.. ఈ సైట్ కు తాకిడి అనూహ్యంగా పెరిగింది.
పెరిగిన వీక్షకుల కారణంగా ఈసీ వెబ్ సైట్ మీద లోడ్ పెరిగింది. దీంతో.. ఈ వెబ్ సైట్ క్రాష్ అయినట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఈసీ వెబ్ సైట్ ఓపెన్ చేస్తుంటే తెరుచుకోని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈసీ వెబ్ సైట్ గురించి పలువురు సోషల్ మీడియాలో కంప్లైంట్లు చేస్తున్నారు. ఈసీ వెబ్ సైట్ ఓపెన్ కాని నేపథ్యంలో ఎన్నికల ఫలితాల వివరాల్ని తెలుసుకునే వీల్లేకుండా పోయిన పరిస్థితి. దీంతో.. అధికారిక సమాచారాన్ని అందించే ఈసీ వెబ్ సైట్ క్రాష్ కావటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. వెబ్ సైట్ ఓపెన్ కాని అంశాన్ని తాము పరిశీలిస్తున్నట్లుగా ఈసీ వెల్లడించింది.
This post was last modified on December 3, 2023 12:22 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…