2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గాఅభివర్ణించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మొదలైన ఓట్ల లెక్కింపుతో అందరి చూపు ఇప్పుడు ఎన్నికల ఫలితాల మీదే ఉంది. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ఉంది. దీంతో.. తెలుగువారంతా ఎన్నికల ఫలితాల కోసం తీవ్రమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితం రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ సమీకరణాల్ని మారుస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో వీక్షకులు పెద్ద ఎత్తున టీవీ చానళ్లను వీక్షిస్తున్నారు. ఈ రోజు ఆదివారం కావటంతో అందరి చూపు ఎన్నికల ఫలితాల మీదే ఉంది. దీనికి తోడు.. మొబైల్ వినియోగం పెద్ద ఎత్తున పెరిగిన నేపథ్యంలో పలువురు కేంద్ర ఎన్నికల కమిషన్ కు చెందిన ప్రధాన వెబ్ సైట్ ను ఫలితాల కోసం చూస్తున్నారు. దీంతో.. ఈ సైట్ కు తాకిడి అనూహ్యంగా పెరిగింది.
పెరిగిన వీక్షకుల కారణంగా ఈసీ వెబ్ సైట్ మీద లోడ్ పెరిగింది. దీంతో.. ఈ వెబ్ సైట్ క్రాష్ అయినట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఈసీ వెబ్ సైట్ ఓపెన్ చేస్తుంటే తెరుచుకోని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈసీ వెబ్ సైట్ గురించి పలువురు సోషల్ మీడియాలో కంప్లైంట్లు చేస్తున్నారు. ఈసీ వెబ్ సైట్ ఓపెన్ కాని నేపథ్యంలో ఎన్నికల ఫలితాల వివరాల్ని తెలుసుకునే వీల్లేకుండా పోయిన పరిస్థితి. దీంతో.. అధికారిక సమాచారాన్ని అందించే ఈసీ వెబ్ సైట్ క్రాష్ కావటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. వెబ్ సైట్ ఓపెన్ కాని అంశాన్ని తాము పరిశీలిస్తున్నట్లుగా ఈసీ వెల్లడించింది.
This post was last modified on December 3, 2023 12:22 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…