Political News

దెబ్బకు ఈసీ వెబ్ సైట్ క్రాష్

2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గాఅభివర్ణించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మొదలైన ఓట్ల లెక్కింపుతో అందరి చూపు ఇప్పుడు ఎన్నికల ఫలితాల మీదే ఉంది. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ఉంది. దీంతో.. తెలుగువారంతా ఎన్నికల ఫలితాల కోసం తీవ్రమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితం రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ సమీకరణాల్ని మారుస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో వీక్షకులు పెద్ద ఎత్తున టీవీ చానళ్లను వీక్షిస్తున్నారు. ఈ రోజు ఆదివారం కావటంతో అందరి చూపు ఎన్నికల ఫలితాల మీదే ఉంది. దీనికి తోడు.. మొబైల్ వినియోగం పెద్ద ఎత్తున పెరిగిన నేపథ్యంలో పలువురు కేంద్ర ఎన్నికల కమిషన్ కు చెందిన ప్రధాన వెబ్ సైట్ ను ఫలితాల కోసం చూస్తున్నారు. దీంతో.. ఈ సైట్ కు తాకిడి అనూహ్యంగా పెరిగింది.

పెరిగిన వీక్షకుల కారణంగా ఈసీ వెబ్ సైట్ మీద లోడ్ పెరిగింది. దీంతో.. ఈ వెబ్ సైట్ క్రాష్ అయినట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఈసీ వెబ్ సైట్ ఓపెన్ చేస్తుంటే తెరుచుకోని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈసీ వెబ్ సైట్ గురించి పలువురు సోషల్ మీడియాలో కంప్లైంట్లు చేస్తున్నారు. ఈసీ వెబ్ సైట్ ఓపెన్ కాని నేపథ్యంలో ఎన్నికల ఫలితాల వివరాల్ని తెలుసుకునే వీల్లేకుండా పోయిన పరిస్థితి. దీంతో.. అధికారిక సమాచారాన్ని అందించే ఈసీ వెబ్ సైట్ క్రాష్ కావటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. వెబ్ సైట్ ఓపెన్ కాని అంశాన్ని తాము పరిశీలిస్తున్నట్లుగా ఈసీ వెల్లడించింది.

This post was last modified on December 3, 2023 12:22 pm

Share
Show comments
Published by
Satya
Tags: EC Website

Recent Posts

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

4 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

7 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

7 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

9 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

10 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

10 hours ago