“ఎగ్జిట్ పోల్స్ను మేం నమ్మం. అవన్నీ వృథా. టైం వేస్ట్. రేపు అసలు రిజల్ట్ వచ్చాక.. క్షమాపణలు చెబుతారా?“ అంటూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబందించి పలు సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలపై బీఆర్ఎస్ కీలక నాయకుడు, మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలు ఇంకా గుర్తుండే ఉంటాయి. అయితే.. ఇప్పుడు వాస్తవ ఫలితం తెరమీదికి వచ్చేసింది.
ఈవీఎం పెట్టెల్లో భద్రంగా దాగి ఉన్న ప్రజాతీర్పు.. బయటకు వచ్చేసింది. పెల్లుబికిన.. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. అయితే.. ఈ ఫలితం.. పూర్తిగా రాకున్నా.. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన ఫలితమే.. ఇక్కడ కూడా ప్రతిబింబించింది. బీఆర్ ఎస్కు 44-46 స్థానాలు, కాంగ్రెస్కు 56-64 స్థానాలు వస్తాయని మెజారిటీ సంస్థలు లెక్కలు కట్టాయి. దీంతో కాంగ్రెస్ పుంజుకోవడం అధికారంలోకి రావడం ఖాయమనే వాదన వినిపించింది.
కానీ, ఈ వాదనను తప్పుబడుతూ. కేటీఆర్.. ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. క్షమాపణలు చెబుతారా? అంటూ.. ప్రశ్నించారు. అయితే.. ఇప్పుడు అదే ఎగ్జిట్ పోల్ ఫలితం నిజమయ్యే దిశగా ఎన్నికల కౌంటింగ్ ముందుకు సాగుతోంది. బీఆర్ ఎస్ 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 64 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక, బీజేపీ 11 చోట్ల, ఎంఐఎం 3 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 1 స్థానంలోనూ ఆధిక్యంలో ఉన్నారు. మొత్తంగా తెలంగాణ ఫలితం ఇది. దీనిని పరిశీలిస్తే.. ఎగ్జిట్ పోల్ ఫలితం ఎంత యాక్యురేట్గా నిజమైందో అర్ధమవుతోంది. మరి దీనికి కేటీఆర్ ఏమంటారో చూడాలి.
This post was last modified on December 3, 2023 12:21 pm
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…