“ఎగ్జిట్ పోల్స్ను మేం నమ్మం. అవన్నీ వృథా. టైం వేస్ట్. రేపు అసలు రిజల్ట్ వచ్చాక.. క్షమాపణలు చెబుతారా?“ అంటూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబందించి పలు సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలపై బీఆర్ఎస్ కీలక నాయకుడు, మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలు ఇంకా గుర్తుండే ఉంటాయి. అయితే.. ఇప్పుడు వాస్తవ ఫలితం తెరమీదికి వచ్చేసింది.
ఈవీఎం పెట్టెల్లో భద్రంగా దాగి ఉన్న ప్రజాతీర్పు.. బయటకు వచ్చేసింది. పెల్లుబికిన.. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. అయితే.. ఈ ఫలితం.. పూర్తిగా రాకున్నా.. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన ఫలితమే.. ఇక్కడ కూడా ప్రతిబింబించింది. బీఆర్ ఎస్కు 44-46 స్థానాలు, కాంగ్రెస్కు 56-64 స్థానాలు వస్తాయని మెజారిటీ సంస్థలు లెక్కలు కట్టాయి. దీంతో కాంగ్రెస్ పుంజుకోవడం అధికారంలోకి రావడం ఖాయమనే వాదన వినిపించింది.
కానీ, ఈ వాదనను తప్పుబడుతూ. కేటీఆర్.. ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. క్షమాపణలు చెబుతారా? అంటూ.. ప్రశ్నించారు. అయితే.. ఇప్పుడు అదే ఎగ్జిట్ పోల్ ఫలితం నిజమయ్యే దిశగా ఎన్నికల కౌంటింగ్ ముందుకు సాగుతోంది. బీఆర్ ఎస్ 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 64 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక, బీజేపీ 11 చోట్ల, ఎంఐఎం 3 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 1 స్థానంలోనూ ఆధిక్యంలో ఉన్నారు. మొత్తంగా తెలంగాణ ఫలితం ఇది. దీనిని పరిశీలిస్తే.. ఎగ్జిట్ పోల్ ఫలితం ఎంత యాక్యురేట్గా నిజమైందో అర్ధమవుతోంది. మరి దీనికి కేటీఆర్ ఏమంటారో చూడాలి.
This post was last modified on December 3, 2023 12:21 pm
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…