Political News

ఎగ్జిట్ పోల్సే నిజ‌మ‌య్యాయి.. కేటీఆర్‌ ఏమంటారు!

“ఎగ్జిట్ పోల్స్‌ను మేం న‌మ్మం. అవ‌న్నీ వృథా. టైం వేస్ట్‌. రేపు అస‌లు రిజ‌ల్ట్ వ‌చ్చాక‌.. క్ష‌మాప‌ణ‌లు చెబుతారా?“ అంటూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు సంబందించి ప‌లు సంస్థ‌లు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ స‌ర్వేల‌పై బీఆర్ఎస్ కీల‌క నాయ‌కుడు, మంత్రి కేటీఆర్ చేసిన విమ‌ర్శ‌లు ఇంకా గుర్తుండే ఉంటాయి. అయితే.. ఇప్పుడు వాస్త‌వ ఫ‌లితం తెర‌మీదికి వ‌చ్చేసింది.

ఈవీఎం పెట్టెల్లో భ‌ద్రంగా దాగి ఉన్న ప్ర‌జాతీర్పు.. బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. పెల్లుబికిన‌.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపించింది. అయితే.. ఈ ఫ‌లితం.. పూర్తిగా రాకున్నా.. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్‌లో వ‌చ్చిన ఫ‌లిత‌మే.. ఇక్క‌డ కూడా ప్ర‌తిబింబించింది. బీఆర్ ఎస్‌కు 44-46 స్థానాలు, కాంగ్రెస్‌కు 56-64 స్థానాలు వ‌స్తాయ‌ని మెజారిటీ సంస్థ‌లు లెక్క‌లు క‌ట్టాయి. దీంతో కాంగ్రెస్ పుంజుకోవ‌డం అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపించింది.

కానీ, ఈ వాద‌న‌ను త‌ప్పుబ‌డుతూ. కేటీఆర్‌.. ఎక్స్ వేదిక‌గా నిప్పులు చెరిగారు. క్ష‌మాప‌ణ‌లు చెబుతారా? అంటూ.. ప్ర‌శ్నించారు. అయితే.. ఇప్పుడు అదే ఎగ్జిట్ పోల్ ఫ‌లితం నిజ‌మ‌య్యే దిశ‌గా ఎన్నిక‌ల కౌంటింగ్ ముందుకు సాగుతోంది. బీఆర్ ఎస్ 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉండ‌గా, కాంగ్రెస్ 64 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక‌, బీజేపీ 11 చోట్ల‌, ఎంఐఎం 3 స్థానాలు, స్వతంత్ర అభ్య‌ర్థులు 1 స్థానంలోనూ ఆధిక్యంలో ఉన్నారు. మొత్తంగా తెలంగాణ ఫ‌లితం ఇది. దీనిని ప‌రిశీలిస్తే.. ఎగ్జిట్ పోల్ ఫ‌లితం ఎంత యాక్యురేట్‌గా నిజ‌మైందో అర్ధ‌మ‌వుతోంది. మ‌రి దీనికి కేటీఆర్ ఏమంటారో చూడాలి.

This post was last modified on December 3, 2023 12:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

2 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

4 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

8 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

9 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

9 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

9 hours ago