“ఎగ్జిట్ పోల్స్ను మేం నమ్మం. అవన్నీ వృథా. టైం వేస్ట్. రేపు అసలు రిజల్ట్ వచ్చాక.. క్షమాపణలు చెబుతారా?“ అంటూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబందించి పలు సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలపై బీఆర్ఎస్ కీలక నాయకుడు, మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలు ఇంకా గుర్తుండే ఉంటాయి. అయితే.. ఇప్పుడు వాస్తవ ఫలితం తెరమీదికి వచ్చేసింది.
ఈవీఎం పెట్టెల్లో భద్రంగా దాగి ఉన్న ప్రజాతీర్పు.. బయటకు వచ్చేసింది. పెల్లుబికిన.. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. అయితే.. ఈ ఫలితం.. పూర్తిగా రాకున్నా.. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన ఫలితమే.. ఇక్కడ కూడా ప్రతిబింబించింది. బీఆర్ ఎస్కు 44-46 స్థానాలు, కాంగ్రెస్కు 56-64 స్థానాలు వస్తాయని మెజారిటీ సంస్థలు లెక్కలు కట్టాయి. దీంతో కాంగ్రెస్ పుంజుకోవడం అధికారంలోకి రావడం ఖాయమనే వాదన వినిపించింది.
కానీ, ఈ వాదనను తప్పుబడుతూ. కేటీఆర్.. ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. క్షమాపణలు చెబుతారా? అంటూ.. ప్రశ్నించారు. అయితే.. ఇప్పుడు అదే ఎగ్జిట్ పోల్ ఫలితం నిజమయ్యే దిశగా ఎన్నికల కౌంటింగ్ ముందుకు సాగుతోంది. బీఆర్ ఎస్ 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 64 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక, బీజేపీ 11 చోట్ల, ఎంఐఎం 3 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 1 స్థానంలోనూ ఆధిక్యంలో ఉన్నారు. మొత్తంగా తెలంగాణ ఫలితం ఇది. దీనిని పరిశీలిస్తే.. ఎగ్జిట్ పోల్ ఫలితం ఎంత యాక్యురేట్గా నిజమైందో అర్ధమవుతోంది. మరి దీనికి కేటీఆర్ ఏమంటారో చూడాలి.
This post was last modified on December 3, 2023 12:21 pm
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…