Political News

గులాబీ పరువు నిలిపిన గ్రేటర్

అంచనాలే నిజమవుతున్నాయి. కీలకమైన పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ కు తగ్గట్లే పరిణామాలు ఉంటున్నాయి. కౌంటింగ్ మొదలైన రెండున్నర గంటల అనంతరం పరిస్థితి చూస్తే.. విజయం దిశగా కాంగ్రెస్ వెళుతోంది. ఇప్పటివరకు వెలువడిన అధిక్యత లను చూస్తే.. కాంగ్రెస్ గట్టెక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో.. తొలి గంటన్నరతో పోలిస్తే.. పదకొండు గంటల వేళకు పరిస్థితుల్లో కాస్తంత మార్పులు చోటు చేసుకుంటాయి, అయినా కాంగ్రెస్ కే స్పష్టమైన మెజారిటీ కనిపించడానికి అవకాశాలున్నాయి.

తెలంగాణలోని పలు జిల్లాల్లో గులాబీ పార్టీకి దారుణంగా దెబ్బలు పడితే.. గ్రేటర్ పరిధిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గ్రేటర్ పరిధిలోని 22 నియోజకవర్గాల్లో ఏడు మజ్లిస్ అధిక్యతలో ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ ఒక స్థానంలో.. బీజేపీ రెండు స్థానాల్లో అధిక్యతలో ఉంది. మిగిలిన 15 స్థానాల్లో బీఆర్ఎస్ జోరు మీద ఉండటం ఆసక్తికరంగా మారింది.

అన్నింటికంటే మించి.. గోషామహల్ లోనూ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ వెనుకబడి ఉండటం.. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్ బిలాల్ అధిక్యతలో ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ సీటు మీద బీఆర్ఎస్ ప్రత్యేకంగా ఫోకస్ చేయటం తెలిసిందే. ఏది ఏమైనా.. ఈసారి గోషామహాల్ లో రాజా సింగ్ కు షాకిచ్చేలా చేయాలన్న పట్టుదలతో మంత్రి కేటీఆర్ ఉండటం తెలిసిందే. ఇందుకు తగ్గట్లే.. ప్రస్తుతానికి రాజాసింగ్ వెనుకబడిపోగా.. బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మొత్తంగా చూస్తే.. జిల్లాలకు భిన్నంగా గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఫలితాలు ఉన్నాయని చెప్పాలి.

Satya

Recent Posts

ఒక నయనతార.. ఒక త్రిష.. ఒక నివేథా

కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…

1 hour ago

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

3 hours ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

4 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

4 hours ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

5 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

5 hours ago