అంచనాలే నిజమవుతున్నాయి. కీలకమైన పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ కు తగ్గట్లే పరిణామాలు ఉంటున్నాయి. కౌంటింగ్ మొదలైన రెండున్నర గంటల అనంతరం పరిస్థితి చూస్తే.. విజయం దిశగా కాంగ్రెస్ వెళుతోంది. ఇప్పటివరకు వెలువడిన అధిక్యత లను చూస్తే.. కాంగ్రెస్ గట్టెక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో.. తొలి గంటన్నరతో పోలిస్తే.. పదకొండు గంటల వేళకు పరిస్థితుల్లో కాస్తంత మార్పులు చోటు చేసుకుంటాయి, అయినా కాంగ్రెస్ కే స్పష్టమైన మెజారిటీ కనిపించడానికి అవకాశాలున్నాయి.
తెలంగాణలోని పలు జిల్లాల్లో గులాబీ పార్టీకి దారుణంగా దెబ్బలు పడితే.. గ్రేటర్ పరిధిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గ్రేటర్ పరిధిలోని 22 నియోజకవర్గాల్లో ఏడు మజ్లిస్ అధిక్యతలో ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ ఒక స్థానంలో.. బీజేపీ రెండు స్థానాల్లో అధిక్యతలో ఉంది. మిగిలిన 15 స్థానాల్లో బీఆర్ఎస్ జోరు మీద ఉండటం ఆసక్తికరంగా మారింది.
అన్నింటికంటే మించి.. గోషామహల్ లోనూ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ వెనుకబడి ఉండటం.. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్ బిలాల్ అధిక్యతలో ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ సీటు మీద బీఆర్ఎస్ ప్రత్యేకంగా ఫోకస్ చేయటం తెలిసిందే. ఏది ఏమైనా.. ఈసారి గోషామహాల్ లో రాజా సింగ్ కు షాకిచ్చేలా చేయాలన్న పట్టుదలతో మంత్రి కేటీఆర్ ఉండటం తెలిసిందే. ఇందుకు తగ్గట్లే.. ప్రస్తుతానికి రాజాసింగ్ వెనుకబడిపోగా.. బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మొత్తంగా చూస్తే.. జిల్లాలకు భిన్నంగా గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఫలితాలు ఉన్నాయని చెప్పాలి.
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…