అంచనాలే నిజమవుతున్నాయి. కీలకమైన పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ కు తగ్గట్లే పరిణామాలు ఉంటున్నాయి. కౌంటింగ్ మొదలైన రెండున్నర గంటల అనంతరం పరిస్థితి చూస్తే.. విజయం దిశగా కాంగ్రెస్ వెళుతోంది. ఇప్పటివరకు వెలువడిన అధిక్యత లను చూస్తే.. కాంగ్రెస్ గట్టెక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో.. తొలి గంటన్నరతో పోలిస్తే.. పదకొండు గంటల వేళకు పరిస్థితుల్లో కాస్తంత మార్పులు చోటు చేసుకుంటాయి, అయినా కాంగ్రెస్ కే స్పష్టమైన మెజారిటీ కనిపించడానికి అవకాశాలున్నాయి.
తెలంగాణలోని పలు జిల్లాల్లో గులాబీ పార్టీకి దారుణంగా దెబ్బలు పడితే.. గ్రేటర్ పరిధిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గ్రేటర్ పరిధిలోని 22 నియోజకవర్గాల్లో ఏడు మజ్లిస్ అధిక్యతలో ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ ఒక స్థానంలో.. బీజేపీ రెండు స్థానాల్లో అధిక్యతలో ఉంది. మిగిలిన 15 స్థానాల్లో బీఆర్ఎస్ జోరు మీద ఉండటం ఆసక్తికరంగా మారింది.
అన్నింటికంటే మించి.. గోషామహల్ లోనూ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ వెనుకబడి ఉండటం.. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్ బిలాల్ అధిక్యతలో ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ సీటు మీద బీఆర్ఎస్ ప్రత్యేకంగా ఫోకస్ చేయటం తెలిసిందే. ఏది ఏమైనా.. ఈసారి గోషామహాల్ లో రాజా సింగ్ కు షాకిచ్చేలా చేయాలన్న పట్టుదలతో మంత్రి కేటీఆర్ ఉండటం తెలిసిందే. ఇందుకు తగ్గట్లే.. ప్రస్తుతానికి రాజాసింగ్ వెనుకబడిపోగా.. బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మొత్తంగా చూస్తే.. జిల్లాలకు భిన్నంగా గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఫలితాలు ఉన్నాయని చెప్పాలి.
This post was last modified on December 3, 2023 12:02 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…