Political News

గులాబీ పరువు నిలిపిన గ్రేటర్

అంచనాలే నిజమవుతున్నాయి. కీలకమైన పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ కు తగ్గట్లే పరిణామాలు ఉంటున్నాయి. కౌంటింగ్ మొదలైన రెండున్నర గంటల అనంతరం పరిస్థితి చూస్తే.. విజయం దిశగా కాంగ్రెస్ వెళుతోంది. ఇప్పటివరకు వెలువడిన అధిక్యత లను చూస్తే.. కాంగ్రెస్ గట్టెక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో.. తొలి గంటన్నరతో పోలిస్తే.. పదకొండు గంటల వేళకు పరిస్థితుల్లో కాస్తంత మార్పులు చోటు చేసుకుంటాయి, అయినా కాంగ్రెస్ కే స్పష్టమైన మెజారిటీ కనిపించడానికి అవకాశాలున్నాయి.

తెలంగాణలోని పలు జిల్లాల్లో గులాబీ పార్టీకి దారుణంగా దెబ్బలు పడితే.. గ్రేటర్ పరిధిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గ్రేటర్ పరిధిలోని 22 నియోజకవర్గాల్లో ఏడు మజ్లిస్ అధిక్యతలో ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ ఒక స్థానంలో.. బీజేపీ రెండు స్థానాల్లో అధిక్యతలో ఉంది. మిగిలిన 15 స్థానాల్లో బీఆర్ఎస్ జోరు మీద ఉండటం ఆసక్తికరంగా మారింది.

అన్నింటికంటే మించి.. గోషామహల్ లోనూ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ వెనుకబడి ఉండటం.. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్ బిలాల్ అధిక్యతలో ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ సీటు మీద బీఆర్ఎస్ ప్రత్యేకంగా ఫోకస్ చేయటం తెలిసిందే. ఏది ఏమైనా.. ఈసారి గోషామహాల్ లో రాజా సింగ్ కు షాకిచ్చేలా చేయాలన్న పట్టుదలతో మంత్రి కేటీఆర్ ఉండటం తెలిసిందే. ఇందుకు తగ్గట్లే.. ప్రస్తుతానికి రాజాసింగ్ వెనుకబడిపోగా.. బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మొత్తంగా చూస్తే.. జిల్లాలకు భిన్నంగా గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఫలితాలు ఉన్నాయని చెప్పాలి.

This post was last modified on December 3, 2023 12:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో ఈసారి ఉగాది పండగా మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

8 minutes ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

3 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

3 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

5 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

6 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

6 hours ago