కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి… తాజా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసిన విష యం తెలిసిందే. ఆయ సంప్రదాయంగా పోటీ చేసే కొడంగల్తోపాటు.. ఈ దఫా సీఎం, బీఆర్ ఎస్ అధినే త కేసీఆర్ పోటీ చేసిన.. కామారెడ్డి నియోజకవర్గంలోనూ పోటీకి దిగారు. అయితే..ఈ రెండు నియోజకవ ర్గాల్లోనూ రేవంత్ ముందంజలో ఉండడం గమనార్హం.
కామారెడ్డి లో అయితే.. కేసీఆర్ ఘోర ఓటమి దిశగా ముందుకు సాగుతున్నారు. ఇక్కడ ఓట్ల లెక్కింపులో ఆయన 3 వ స్థానంలో ఉన్నారు. ఇక, అటు కొడంగల్, ఇటు కామారెడ్డిలో రేవంత్ గెలుపు బాటలో దూసుకుపోతున్నారు. మరోవైపు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లొ 70 సీట్లలో మెజారిటీ సాధించిన కాంగ్రెస్.. మరిన్ని సీట్లలో ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఇక, ఒక్క గజ్వేల్ నియోజకవర్గంలో మాత్రం కేసీఆర్ హవా కనిపిస్తోంది.
అనేక మంది మంత్రులు ఓటమి దిశగా ముందుకు సాగుతున్నారు. ఇదిలావుంటే, గెలుపు బాటలో వున్న కాంగ్రెస్ అభ్యర్థుల మెజారిటీ దాదాపు సగటున 5 వేల పైన వుండడం గమనార్హం. రేవంత్ రెడ్డి స్వగ్రామం లో భారీ ఎత్తున సంబరాలు. రేవంత్ రెడ్డి నివాసం కొడంగల్ కు , సొంత గ్రామం లోని నివాసం కు పెద్ద ఎత్తున చేరుకున్న స్పెషల్ పార్టీ పోలీసులు, సీఆర్ పీఎఫ్ బలగాలు. హైదరాబాద్ లోని రేవంత్ నివాసం భద్రత ను ఇప్పటికే తమ స్వాధీనం లోకి తీసుకున్న సీఆర్ పీఎఫ్ బలగాలు.
ఇక, హుజూరాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్..రెండు చోట్లా వెనుకబడిపోయారు. గజ్వేల్లో మరీ దారుణంగా మూడో ప్లేస్లో ఉన్నారు. ఇక, హుజూరాబాద్లో సెంటిమెంటు అస్త్రం ప్లే చేసిన పాడి కౌశిక్రెడ్డి ఈ సారి విజయం దక్కించుకునే దిశగా దూసుకుపోతుండడం గమనార్హం.
This post was last modified on December 3, 2023 11:30 am
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…