పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చింది జనసేన. పార్టీ పెట్టిన పదేళ్లలో ఏ రోజు కూడా అధికార పార్టీ మీద కానీ.. కేసీఆర్ పాలన గురించి కానీ..తెలంగాణ సమస్యల గురించి కానీ మాట్లాడని పవన్ కల్యాణ్.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు రావటం అప్పట్లో ఆసక్తికర చర్చ నడిచింది.
తొలుత 22 స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావించినా.. ఆ తర్వాత వెనక్కి తగ్గారు. అయితే.. బీజేపీ నుంచి వచ్చిన ఒత్తిడితో చివరకు 8 స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యారు. అందులో గ్రేటర్ పరిధిలో కుకట్ పల్లి నియోజకవర్గం ఒకటి కాగా.. మిగిలిన ఏడు స్థానాలు జిల్లాలకు చెందినవే. అయితే.. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలు.. పార్టీ అధిక్యతను చూసినప్పుడు ఎక్కడా కూడా జనసేన పార్టీ అధిక్యతలో కనిపించని పరిస్థితి.
పోటీ చేసిన ఎనిమిది స్థానాల్లో జనసేన అభ్యర్థుల పత్తా లేకుండా పోయారని చెప్పాలి. మరోవైపు.. బీజేపీ మాత్రం గత ఎన్నికలతో పోలిస్తే.. గౌరవనీయమైన స్థానాల్ని దక్కించుకునేలా కనిపిస్తోంది. 2018 ఎన్నికల్లో బీజేపీకి కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కింది. అది కూడా గోషామహాల్ లో రాజాసింగ్ గెలుపొందారు. ఆ తర్వాతి కాలంలో చోటుచేసుకున్న ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించటం తెలిసిందే.
మొత్తంగా చూస్తే.. చాలామంది అంచనాలు వేసినట్లే.. జనసేన తెలంగాణ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. చివరకు బీజేపీ మద్దతుతో పోటీ చేసిన ఎనిమిది స్థానాల్లో అయినా గౌరవనీయమైన ఓట్లను సొంతం చేసుకుంటాయా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరోవైపు.. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్ని చూసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థానాల్ని సొంతం చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
This post was last modified on December 3, 2023 11:28 am
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…