Political News

హ్యాండిచ్చిన బీజేపీ.. జనసేనకు జీరో

పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చింది జనసేన. పార్టీ పెట్టిన పదేళ్లలో ఏ రోజు కూడా అధికార పార్టీ మీద కానీ.. కేసీఆర్ పాలన గురించి కానీ..తెలంగాణ సమస్యల గురించి కానీ మాట్లాడని పవన్ కల్యాణ్.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు రావటం అప్పట్లో ఆసక్తికర చర్చ నడిచింది.

తొలుత 22 స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావించినా.. ఆ తర్వాత వెనక్కి తగ్గారు. అయితే.. బీజేపీ నుంచి వచ్చిన ఒత్తిడితో చివరకు 8 స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యారు. అందులో గ్రేటర్ పరిధిలో కుకట్ పల్లి నియోజకవర్గం ఒకటి కాగా.. మిగిలిన ఏడు స్థానాలు జిల్లాలకు చెందినవే. అయితే.. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలు.. పార్టీ అధిక్యతను చూసినప్పుడు ఎక్కడా కూడా జనసేన పార్టీ అధిక్యతలో కనిపించని పరిస్థితి.

పోటీ చేసిన ఎనిమిది స్థానాల్లో జనసేన అభ్యర్థుల పత్తా లేకుండా పోయారని చెప్పాలి. మరోవైపు.. బీజేపీ మాత్రం గత ఎన్నికలతో పోలిస్తే.. గౌరవనీయమైన స్థానాల్ని దక్కించుకునేలా కనిపిస్తోంది. 2018 ఎన్నికల్లో బీజేపీకి కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కింది. అది కూడా గోషామహాల్ లో రాజాసింగ్ గెలుపొందారు. ఆ తర్వాతి కాలంలో చోటుచేసుకున్న ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించటం తెలిసిందే.

మొత్తంగా చూస్తే.. చాలామంది అంచనాలు వేసినట్లే.. జనసేన తెలంగాణ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. చివరకు బీజేపీ మద్దతుతో పోటీ చేసిన ఎనిమిది స్థానాల్లో అయినా గౌరవనీయమైన ఓట్లను సొంతం చేసుకుంటాయా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరోవైపు.. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్ని చూసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థానాల్ని సొంతం చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

This post was last modified on December 3, 2023 11:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏమిటో నితిన్ ధైర్యం?

అంతా అనుకున్న‌ట్లు జ‌రిగితే నితిన్ కొత్త చిత్రం రాబిన్ హుడ్ ఎప్పుడో రిలీజైపోయి ఉండాలి క్రిస్మ‌స్‌కు అనుకున్న ఆ చిత్రం…

46 minutes ago

బిగ్ డే : తండేల్ మీదే అందరి కళ్ళు

నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన తండేల్ థియేటర్లకు వచ్చేసింది. గత ఏడాది డిసెంబర్…

3 hours ago

‘పట్టు’ లేదని ముందే తెలుసుకున్నారా

ఈ మధ్య కాలంలో అజిత్ లాంటి స్టార్ ఉన్న పెద్ద సినిమా బజ్ లేకుండా విడుదలయ్యిందంటే అది పట్టుదల మాత్రమే.…

10 hours ago

‘అమ‌రావ‌తి’ని ఆప‌ద్దు: ఈసీ లేఖ‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప‌రుగులు పెట్టించాల‌ని సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో…

13 hours ago

ప్ర‌జ‌ల్లోకి ప్ర‌భుత్వం.. సీఎం రేవంత్ ప్లాన్‌

'ప్ర‌జ‌ల్లోకి ప్ర‌భుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స‌రికొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌నున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన…

14 hours ago

బాస్ ఈజ్ బాస్ : విశ్వక్ సేన్

వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…

14 hours ago