కాపురం చేసే కళ.. కాలిగోటిలోనే తెలుస్తుందన్నట్టు.. ఏరాష్ట్రంలో అయినా..ఎన్నికల పోలింగ్ మొదలు కాగానే.. తొలుత లెక్కించే పోస్టల్ బ్యాలెట్లోనే గెలిచే పార్టీని అంచనా వేసేయొచ్చు. అలానే తెలంగాణ లోనూ.. పోస్టల్ బ్యాలెట్.. ఎవరు అధికారంలోకి వస్తారనే విషయాన్ని స్పష్టంగా చెప్పేశాయి. తొలి రౌండ్ లెక్కింపు నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్లు.. ఎక్కడా చికాకు పెట్టలేదు. ఎవరినీ ఊరించలేదు. చాలా స్పష్టంగా.. చాలా పక్కాగా తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టాయి.
కాంగ్రెస్కు పూర్తి అనుకూలంగా పోస్టల్ బ్యాలెట్లు రావడం గమనార్హం. ఇదే.. కాంగ్రెస్కు బలమైన శక్తిగా మారింది. ఇక, పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తే.. బీఆర్ ఎస్ నాయకులు కేసీఆర్(గజ్వేల్, కామారెడ్డి), కేటీఆర్(సిరిసిల్ల) కూడా.. వెనుకబడిపోయారు. చివరి వరకు వారికి పోస్టల్ బ్యాలెట్ అనుకూలంగా లేదు. ఇక, ఈవీఎంల ఓట్లు లెక్కించడం ప్రారంభించాక మాత్రమే.. ఇద్దరూ తేరుకున్నారు.
అయితే.. ఈ పోస్టల్ బ్యాలెట్లో ఎందుకింత బీఆర్ ఎస్కు వ్యతిరేకత కనిపించింది? దీనివెనుక ఉన్న రీజనేంటి? అనేది ఆసక్తిగా మారింది. పోస్టల్ బ్యాలెట్ అంటే.. ఇది ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన అభిప్రాయాలను చెప్పేది. సో.. ప్రస్తుతం తెలంగాణలోని ఉద్యోగులు కేసీఆర్ సర్కారుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనేది పోస్టల్ బ్యాలెట్ కుండబద్దలు కొట్టింది.
ప్రతి నెలా 1న జీతాలు ఇవ్వకపోవడం.. సీపీఎస్ రద్దు చేయకపోవడం.. ఉద్యోగులకు సంబంధించి డీఏలను ఏళ్ల తరబడి పెండింగులో పెట్టడం, రాజకీయ ఒత్తిళ్లు.. ఇలా అనేక కోణాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులను నిరాశే పరిచింది. ఇదే పోస్టల్ బ్యాలెట్ రూపంలో స్పష్టమైందని పరిశీలకులు చెబుతున్నారు.
This post was last modified on December 3, 2023 11:17 am
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…