Political News

మూడు రాష్ట్రాల్లో హ‌స్త వాసి చిక్క‌లేదు.. !

దేశ‌వ్యాప్తంగా జ‌రిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. అయితే.. వీటిలో ఈశాన్య రాష్ట్రం మిజోరాం మిన‌హా.. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ జ‌రుగుతోంది. ఈ ఫ‌లితాల్లో తెలంగాణ మిన‌హా.. మిగిలిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మ‌ధ్యే హోరా హోరీ యుద్ధం జ‌రిగింది. ఇక‌, ఇప్పుడుతుది ఫ‌లితాల్లోనూ తొలి రెండు రౌండ్ల‌లో బీజేపీ -కాంగ్రెస్‌లు.. పోటా పోటీగా వ్య‌వ‌హ‌రించినా.. ఇప్పుడు ఫ‌లితాలు తుది ద‌శ‌కు చేరుకుంటున్న నేప‌థ్యంలో బీజేపీకి సానుకూల పెరిగింది.

ఛ‌త్తీస్ గ‌డ్‌: ఇక్క‌డ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాల‌కు రెండు విడ‌త‌ల్లో ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగింది. తాజాగా వెల్ల‌డించిన ఫ‌లితాల్లో బీజేపీ 50, కాంగ్రెస్ 38 స్థానాలు ద‌క్కించుకున్నాయి. మ‌రో రెండు స్థానాల‌ను ఇత‌రులు ద‌క్కించుకున్నారు. మ్యాజిక్ ఫిగ‌ర్ 46.

రాజ‌స్థాన్‌: ఇక్క‌డ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం స్థానాలు 200. కానీ, 119 స్థానాల‌కే ఎన్నిక‌లు జ‌రిగాయి. అయితే.. ప్ర‌తి ఐదేళ్లకు ఒక‌సారి ఇక్క‌డి ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ పార్టీని మారుస్తున్న నేప‌థ్యంలో అదేసంప్ర‌దాయం ఇప్పుడు కూడా కొన‌సాగింది. బీజేపీ 117 స్తానాల్లో విజ‌యం ద‌క్కించుకోగా, కాంగ్రెస్ 67 స్థానాల‌కే ప‌రిమిత‌మైంది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌: ఇక్క‌డ బీజేపీ అధికారంలో ఉంది. మొత్తం నియోజ‌క‌వ‌ర్గాలు.. 230. వీటిలో బీజేపీకి 140 స్థానాలు ద‌క్క‌గా.. కాంగ్రెస్‌కు 87, ఇత‌రుల‌కు 3 స్థానాలు మాత్ర‌మే ల‌భించాయి. మొత్తంగా చూస్తే.. రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఆ రెండు కోల్పోగా.. మ‌రో రాష్ట్రంలోనూ అధికారం ద‌క్కించుకోలేక పోయింది.

This post was last modified on December 3, 2023 1:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

4 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

7 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

8 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

9 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

10 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

11 hours ago