దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే.. వీటిలో ఈశాన్య రాష్ట్రం మిజోరాం మినహా.. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. ఈ ఫలితాల్లో తెలంగాణ మినహా.. మిగిలిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్యే హోరా హోరీ యుద్ధం జరిగింది. ఇక, ఇప్పుడుతుది ఫలితాల్లోనూ తొలి రెండు రౌండ్లలో బీజేపీ -కాంగ్రెస్లు.. పోటా పోటీగా వ్యవహరించినా.. ఇప్పుడు ఫలితాలు తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో బీజేపీకి సానుకూల పెరిగింది.
ఛత్తీస్ గడ్: ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికల పోలింగ్ జరిగింది. తాజాగా వెల్లడించిన ఫలితాల్లో బీజేపీ 50, కాంగ్రెస్ 38 స్థానాలు దక్కించుకున్నాయి. మరో రెండు స్థానాలను ఇతరులు దక్కించుకున్నారు. మ్యాజిక్ ఫిగర్ 46.
రాజస్థాన్: ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం స్థానాలు 200. కానీ, 119 స్థానాలకే ఎన్నికలు జరిగాయి. అయితే.. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఇక్కడి ప్రజలు ప్రభుత్వ పార్టీని మారుస్తున్న నేపథ్యంలో అదేసంప్రదాయం ఇప్పుడు కూడా కొనసాగింది. బీజేపీ 117 స్తానాల్లో విజయం దక్కించుకోగా, కాంగ్రెస్ 67 స్థానాలకే పరిమితమైంది.
మధ్యప్రదేశ్: ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. మొత్తం నియోజకవర్గాలు.. 230. వీటిలో బీజేపీకి 140 స్థానాలు దక్కగా.. కాంగ్రెస్కు 87, ఇతరులకు 3 స్థానాలు మాత్రమే లభించాయి. మొత్తంగా చూస్తే.. రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఆ రెండు కోల్పోగా.. మరో రాష్ట్రంలోనూ అధికారం దక్కించుకోలేక పోయింది.
This post was last modified on December 3, 2023 1:05 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…