Political News

గులాబీ వాడిపోయింది!

ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కాంగ్రెస్ కు పట్టం కట్టగా…బీఆర్ఎస్ నేతలు ఎగ్జాక్ట్ పోల్స్ ను నమ్ముకుంటున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తొలి రౌండ్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో గులాబీ శ్రేణులు షాక్ అయ్యాయి. రెండో రౌండ్ పూర్తి అయ్యే సరికి 59 స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉండగా…34 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

కొడంగల్ లో 4 వేల మెజారిటీతో టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ ఆధిక్యంలో ఉన్నారు. కామారెడ్డిలో రేవంత్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉండడం బీఆర్ఎస్ శ్రేణులను కలవరపెడుతుంది. ఇక. మధిరలో భట్టి విక్రమార్క ముందంజలో ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 8 చోట్ల కాంగ్రెస్ ఒకచోట సిపిఐ ముందంజలో ఉంది. ఇక, సనత్ నగర్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందంజలో కొనసాగుతున్నారు. కొల్హాపూర్ లో జూపల్లి 1300 మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు.

నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూడువేల ఓట్ల మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు. ఇక, ఖమ్మంలో తుమ్మలకు 300 ఓట్ల ఆదిక్యం లభించింది. ఖైరతాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ముందంజలో కొనసాగుతున్నారు. సిద్దిపేటలో హరీష్ రావు ముందంజలో కొనసాగుతున్నారు. ఓవరాల్ గా మొదటి రెండు రౌండ్ల ఫలితాలు ముగిసే సమయానికి కాంగ్రెస్ మెజారిటీ స్థానాల్లో ముందంజలో కొనసాగుతుండగా బీఆర్ఎస్ వెనుకబడింది.

ఇవే ఫలితాలు చివరి రౌండ్ వరకు కొనసాగుతాయని కాంగ్రెస్ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అభ్యర్థులు బసచేసిన తాజ్ కృష్ణ హోటల్ వద్ద సందడి ఏర్పడింది. ఇప్పటికే కర్ణాటక నుంచి వచ్చిన కాంగ్రెస్ పెద్దలు అభ్యర్థుల వెంట ఉన్నారు. విజయం తమదేనని కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ధీమా వ్యక్తం చేస్తూ సంబరాలకు సిద్ధమవుతున్నాయి.

This post was last modified on December 3, 2023 10:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago