Political News

గులాబీ వాడిపోయింది!

ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కాంగ్రెస్ కు పట్టం కట్టగా…బీఆర్ఎస్ నేతలు ఎగ్జాక్ట్ పోల్స్ ను నమ్ముకుంటున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తొలి రౌండ్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో గులాబీ శ్రేణులు షాక్ అయ్యాయి. రెండో రౌండ్ పూర్తి అయ్యే సరికి 59 స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉండగా…34 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

కొడంగల్ లో 4 వేల మెజారిటీతో టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ ఆధిక్యంలో ఉన్నారు. కామారెడ్డిలో రేవంత్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉండడం బీఆర్ఎస్ శ్రేణులను కలవరపెడుతుంది. ఇక. మధిరలో భట్టి విక్రమార్క ముందంజలో ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 8 చోట్ల కాంగ్రెస్ ఒకచోట సిపిఐ ముందంజలో ఉంది. ఇక, సనత్ నగర్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందంజలో కొనసాగుతున్నారు. కొల్హాపూర్ లో జూపల్లి 1300 మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు.

నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూడువేల ఓట్ల మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు. ఇక, ఖమ్మంలో తుమ్మలకు 300 ఓట్ల ఆదిక్యం లభించింది. ఖైరతాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ముందంజలో కొనసాగుతున్నారు. సిద్దిపేటలో హరీష్ రావు ముందంజలో కొనసాగుతున్నారు. ఓవరాల్ గా మొదటి రెండు రౌండ్ల ఫలితాలు ముగిసే సమయానికి కాంగ్రెస్ మెజారిటీ స్థానాల్లో ముందంజలో కొనసాగుతుండగా బీఆర్ఎస్ వెనుకబడింది.

ఇవే ఫలితాలు చివరి రౌండ్ వరకు కొనసాగుతాయని కాంగ్రెస్ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అభ్యర్థులు బసచేసిన తాజ్ కృష్ణ హోటల్ వద్ద సందడి ఏర్పడింది. ఇప్పటికే కర్ణాటక నుంచి వచ్చిన కాంగ్రెస్ పెద్దలు అభ్యర్థుల వెంట ఉన్నారు. విజయం తమదేనని కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ధీమా వ్యక్తం చేస్తూ సంబరాలకు సిద్ధమవుతున్నాయి.

This post was last modified on December 3, 2023 10:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

35 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago