Political News

ప్లాష్ బ్యాక్: ఇప్పుడు రేవంత్ మాదిరే 2004లో వైఎస్ పరిస్థితి!

సందర్భానికి తగ్గట్లు కొన్ని పరిణామాల్ని గుర్తుకు తెచ్చుకోవటం ఆసక్తికరంగా ఉంటుంది.  హోరాహోరీగా సాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బయటకు వస్తున్నాయి. ఎగ్జిట్ సర్వేలన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఖాయమని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న మాట బలంగా వినిపించాయి. ఫలితాల్లో అదే ట్రెండ్ కనిపిస్తోంది. ఈ సందర్భంగా దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఒక ఉదంతాన్ని ప్రస్తావించటం సమయోచితంగా ఉంటుంది. 2004 ఎన్నికలకు ముందు.. అప్పటి ఉమ్మడి ఏపీలో సీఎంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు ఎంత శక్తివంతంగా ఉండేవారో తెలిసిందే. ఇలాంటివేళ.. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమించేది. అప్పట్లో ఆ పార్టీ ఆశలన్నీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీదే పెట్టుకునేవారు. ఇందుకు తగ్గట్లే వైఎస్ ఒళ్లు దాచుకోకుండా తీవ్రంగా శ్రమించటమే కాదు..  పార్టీని అధికారంలోకి రావటానికి అవసరమైన అన్ని పనులను చక్కబెట్టేవారు.

2004 ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ జరిగిన తర్వాత దాదాపు వారం రోజులకు పైనే కౌంటింగ్ ఆగింది. మిగిలిన రాష్ట్రాలతో పాటు.. ఎన్నికల ఫలితాల విడుదలను ఏపీలోనూ ఆగింది. దీంతో.. రిజల్ట్ వచ్చే వరకు తుది ఫలితం ఎలా ఉంటుందన్న టెన్షన్ తో కిందా మీదా పడేవారు. అప్పట్లో చంద్రబాబు మీద విపరీతమైన ద్వేషం ఉందన్న మాట నాటి అధికార పార్టీతో పాటు.. ప్రత్యర్థి పార్టీలోనూ బలంగా వినిపించేది.

ఇదిలా ఉండగా.. పోలింగ్ లో కాంగ్రెస్ కు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్న రిపోర్టులు వచ్చినప్పటికి.. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు వేటిని నమ్మకూడదన్నట్లుగా వైఎస్ ఉండేవారు. అందరి ఎదుట గెలుపు ధీమాను వ్యక్తం చేసినప్పటికీ.. తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న వారి దగ్గర మాత్రం తనకున్న సందేహాల్ని వ్యక్తం చేసేవారు. అయితే.. వారంతా ఎట్టి పరిస్థితుల్లో పార్టీ గెలుస్తుందని చెప్పేవారు. అయినప్పటికి వైఎస్ కు నమ్మకం కుదిరేది కాదు. ఇలాంటి వేళ.. కొందరు జర్నలిస్టు ముఖ్యుల్ని పిలిపించుకొని.. వారితో విశ్లేషణ చేయించుకున్న తర్వాత కాస్తంత నెమ్మదించేవారు.

అప్పట్లో వైఎస్ ఎలాంటి మానసిక పరిస్థితి ఎలా ఉందన్న విషయం ఇప్పుడు చర్చగా మారింది. ఎందుకంటే.. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు మీద రేవంత్ నమ్మకంగా ఉన్నప్పటికీ.. లోలోన ఏదో ఒక శంక బలంగా ఉండి.. సందేహాల్ని సంధిస్తున్న వైనం వినిపిస్తోంది. సాధారణంగా ఇంతటి హోరాహోరీ ఎన్నికల యుద్ధం జరిగిన తర్వాత.. మిగిలిన వారి మాదిరే కీలక స్థానాల్లో ఉన్న వారికి సైతం బోలెడంత కన్ఫ్యూజన్ ఉంటుందని చెప్పాలి. తాజా ఎన్నికల్లో  అంచనాలు మహా కష్టంగా మారిన నేపథ్యంలో.. తనకు అత్యంత సన్నిహితుల వద్ద రేవంత్ నోట వస్తున్న సంశయాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదంటున్నారు. అప్పట్లో వైఎస్ లాంటి బలమైన నేతకే తప్పనిది.. ఇప్పుడు రేవంత్ కు ఇలంటి పరిస్థితి ఎదురైన వైనాన్ని సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది.

This post was last modified on December 3, 2023 9:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

1 hour ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

3 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

4 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

4 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

5 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

7 hours ago