Political News

ప్లాష్ బ్యాక్: ఇప్పుడు రేవంత్ మాదిరే 2004లో వైఎస్ పరిస్థితి!

సందర్భానికి తగ్గట్లు కొన్ని పరిణామాల్ని గుర్తుకు తెచ్చుకోవటం ఆసక్తికరంగా ఉంటుంది.  హోరాహోరీగా సాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బయటకు వస్తున్నాయి. ఎగ్జిట్ సర్వేలన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఖాయమని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న మాట బలంగా వినిపించాయి. ఫలితాల్లో అదే ట్రెండ్ కనిపిస్తోంది. ఈ సందర్భంగా దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఒక ఉదంతాన్ని ప్రస్తావించటం సమయోచితంగా ఉంటుంది. 2004 ఎన్నికలకు ముందు.. అప్పటి ఉమ్మడి ఏపీలో సీఎంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు ఎంత శక్తివంతంగా ఉండేవారో తెలిసిందే. ఇలాంటివేళ.. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమించేది. అప్పట్లో ఆ పార్టీ ఆశలన్నీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీదే పెట్టుకునేవారు. ఇందుకు తగ్గట్లే వైఎస్ ఒళ్లు దాచుకోకుండా తీవ్రంగా శ్రమించటమే కాదు..  పార్టీని అధికారంలోకి రావటానికి అవసరమైన అన్ని పనులను చక్కబెట్టేవారు.

2004 ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ జరిగిన తర్వాత దాదాపు వారం రోజులకు పైనే కౌంటింగ్ ఆగింది. మిగిలిన రాష్ట్రాలతో పాటు.. ఎన్నికల ఫలితాల విడుదలను ఏపీలోనూ ఆగింది. దీంతో.. రిజల్ట్ వచ్చే వరకు తుది ఫలితం ఎలా ఉంటుందన్న టెన్షన్ తో కిందా మీదా పడేవారు. అప్పట్లో చంద్రబాబు మీద విపరీతమైన ద్వేషం ఉందన్న మాట నాటి అధికార పార్టీతో పాటు.. ప్రత్యర్థి పార్టీలోనూ బలంగా వినిపించేది.

ఇదిలా ఉండగా.. పోలింగ్ లో కాంగ్రెస్ కు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్న రిపోర్టులు వచ్చినప్పటికి.. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు వేటిని నమ్మకూడదన్నట్లుగా వైఎస్ ఉండేవారు. అందరి ఎదుట గెలుపు ధీమాను వ్యక్తం చేసినప్పటికీ.. తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న వారి దగ్గర మాత్రం తనకున్న సందేహాల్ని వ్యక్తం చేసేవారు. అయితే.. వారంతా ఎట్టి పరిస్థితుల్లో పార్టీ గెలుస్తుందని చెప్పేవారు. అయినప్పటికి వైఎస్ కు నమ్మకం కుదిరేది కాదు. ఇలాంటి వేళ.. కొందరు జర్నలిస్టు ముఖ్యుల్ని పిలిపించుకొని.. వారితో విశ్లేషణ చేయించుకున్న తర్వాత కాస్తంత నెమ్మదించేవారు.

అప్పట్లో వైఎస్ ఎలాంటి మానసిక పరిస్థితి ఎలా ఉందన్న విషయం ఇప్పుడు చర్చగా మారింది. ఎందుకంటే.. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు మీద రేవంత్ నమ్మకంగా ఉన్నప్పటికీ.. లోలోన ఏదో ఒక శంక బలంగా ఉండి.. సందేహాల్ని సంధిస్తున్న వైనం వినిపిస్తోంది. సాధారణంగా ఇంతటి హోరాహోరీ ఎన్నికల యుద్ధం జరిగిన తర్వాత.. మిగిలిన వారి మాదిరే కీలక స్థానాల్లో ఉన్న వారికి సైతం బోలెడంత కన్ఫ్యూజన్ ఉంటుందని చెప్పాలి. తాజా ఎన్నికల్లో  అంచనాలు మహా కష్టంగా మారిన నేపథ్యంలో.. తనకు అత్యంత సన్నిహితుల వద్ద రేవంత్ నోట వస్తున్న సంశయాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదంటున్నారు. అప్పట్లో వైఎస్ లాంటి బలమైన నేతకే తప్పనిది.. ఇప్పుడు రేవంత్ కు ఇలంటి పరిస్థితి ఎదురైన వైనాన్ని సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది.

Satya

Recent Posts

రోహిత్, కోహ్లీ పోరాడినా లాభం లేదు…

లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 27 పరుగుల తేడాతో ఓటమి పాలై సిరీస్ ను…

4 hours ago

చెన్నై లవ్ స్టోరీ డేంజర్ గేమ్

తమ సినిమా పెద్ద హిట్ అవుతుందని, బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ చెప్పుకోవడం మామూలే. ఇలా ఎవరైనా చెప్పుకుంటుంటే అదేమీ…

5 hours ago

జాతీయ అవార్డుల్లో ఎంత మార్పో…

ఒకప్పుడు జాతీయ అవార్డులు ప్రకటిస్తుంటే.. తెలుగు సినిమాకు ప్రాతినిధ్యం దక్కితే ఆశ్చర్యపోయేవాళ్లం. మన సినిమాలకు ఏదైనా విభాగంలో జాతీయ అవార్డు…

5 hours ago

రాహుల్ గాంధీతో ఫోటో కావాలా… ఇదిగో రేవంత్ ఆఫర్!

పార్టీలో కార్య‌క‌ర్త‌ల స్థాయిలో ఉన్న‌వారు.. పార్టీ పెద్ద‌ల‌తో ఫొటోలు అంటే.. ఎంత‌గా ఎగ‌బ‌డ‌తారో అంద‌రికీ తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా జాతీయ…

6 hours ago

కొత్త సంగీతం కోసం సుకుమార్ ఆరాటం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కలయికలో తెరకెక్కబోతున్న ఆర్సి 17 నవంబర్ నుంచి షూటింగ్ కు…

7 hours ago

మల్లారెడ్డి కారు దిగినట్టేనా…?

తెలుగు నేల రాజకీయాల్లో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ కేక్…

7 hours ago